Vande Bharat: ఈ 3 మార్గాల్లో కొత్తగా వందే భారత్.. సమయ వేళలు ఇవే..!

భారతీయ రైల్వే నిరంతరం వందే భారత్ రైళ్ల సంఖ్యను పెంచుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం మహారాష్ట్రకు మూడు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ల సంఖ్య 11కి చేరుకుంది. భారతీయ రైల్వే ప్రకారం, కొత్తగా ప్రారంభించిన రైళ్లు నాగ్‌పూర్-సికింద్రాబాద్..

Vande Bharat: ఈ 3 మార్గాల్లో కొత్తగా వందే భారత్.. సమయ వేళలు ఇవే..!
Vande Bharat Express Train
Follow us

|

Updated on: Sep 18, 2024 | 8:39 PM

భారతీయ రైల్వే నిరంతరం వందే భారత్ రైళ్ల సంఖ్యను పెంచుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం మహారాష్ట్రకు మూడు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ల సంఖ్య 11కి చేరుకుంది. భారతీయ రైల్వే ప్రకారం, కొత్తగా ప్రారంభించిన రైళ్లు నాగ్‌పూర్-సికింద్రాబాద్, కొల్హాపూర్-పూణే, పూణే-హుబ్లీ మార్గాల్లో నడుస్తాయి.

ఈ రైళ్లను ప్రవేశపెట్టడానికి ముందు మహారాష్ట్రలో పశ్చిమ రైల్వే, సెంట్రల్ రైల్వే ద్వారా ఎనిమిది వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయి. ఈ రైళ్లలో పశ్చిమ రైల్వే ముంబై-అహ్మదాబాద్, ముంబై-గాంధీనగర్ రూట్లలో వందేభారత్‌ను నడుపుతుండగా, సెంట్రల్ రైల్వే ముంబై-మడ్‌గావ్, ముంబై-సోలాపూర్, ముంబై-సాయి నగర్ షిర్డీ, ముంబై-జల్నా, నాగ్‌పూర్-రాయ్‌పూర్, నాగ్‌పూర్-బిలాస్‌పూర్ మార్గాలు. ఈ ప్రాంతాలలో రైల్వే కనెక్టివిటీ ప్రయాణికులకు మరింత అందుబాటులోకి వచ్చింది. మహారాష్ట్ర నుండి ప్రారంభమైన మూడు వందేభారత్ రైళ్ల స్టాపేజ్‌లు, టైమ్ టేబుల్‌ గురించి తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: Metal: ఉక్కు దేనితో తయారవుతుంది? ఎక్కువ ఉత్పత్తి చేసే దేశం ఏదీ? భారత్‌ ఏ స్థానంలో..

ఇవి కూడా చదవండి

కొల్హాపూర్-పూణే వందే భారత్ ఎక్స్‌ప్రెస్

ఈ రైలు ప్రతి బుధ, శుక్ర, ఆదివారాలు నడుస్తుంది. పూణే నుంచి మధ్యాహ్నం 2:15 గంటలకు బయలుదేరి రాత్రి 7:40 గంటలకు కొల్హాపూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కొల్హాపూర్ నుంచి ఉదయం 8:15 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1:30 గంటలకు పూణె చేరుకుంటుంది. ఈ వందే భారత్ రైలు మిరాజ్, సాంగ్లీ, కిర్లోస్కర్వాడి, కరాద్, సతార్ వంటి స్టేషన్లలో ఆగుతుంది.

పూణే-హుబ్లీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్

ఈ రైలు ప్రతి గురు, శని, సోమవారాలు నడుస్తుంది. ఇది పూణె నుంచి సాయంత్రం 4:15 గంటలకు బయలుదేరి రాత్రి 11:40 గంటలకు హుబ్లీకి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో హుబ్లీ నుంచి ఉదయం 5:00 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1:30 గంటలకు పూణె చేరుకుంటుంది. ఈ రైలు సతార్, సాంగ్లీ, మిరాజ్, బెల్గాం మరియు ధార్వాడ్‌లలో స్టాప్‌లను కలిగి ఉంటుంది.

నాగ్‌పూర్-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్

ఈ రైలు మంగళవారం మినహా వారానికి ఆరు రోజులు నడుస్తుంది. ఇది నాగ్‌పూర్‌లో ఉదయం 5:00 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు సికింద్రాబాద్ నుండి మధ్యాహ్నం 1:00 గంటలకు బయలుదేరి రాత్రి 8:20 గంటలకు నాగ్‌పూర్ చేరుకుంటుంది. ఈ రైలుకు సేవాగ్రామ్, చంద్రాపూర్, బల్లార్షా, రామగుండం, కాజీపట్ వంటి స్టేషన్లలో హాల్టులు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Jio AirFiber: జియో నుంచి దీపావళి ధమాకా ఆఫర్.. ఏడాది పాటు ఎయిర్‌ఫైబర్‌ ఉచితం

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఓలా.. ఎందుకిలా ?? స్కూటీతో యువతి వినూత్న నిరసన !!
ఓలా.. ఎందుకిలా ?? స్కూటీతో యువతి వినూత్న నిరసన !!
అల్లు అర్జున్‌కు అజ్ఞాతవ్యక్తి గిఫ్ట్‌.. అందులో ఏముందంటే ??
అల్లు అర్జున్‌కు అజ్ఞాతవ్యక్తి గిఫ్ట్‌.. అందులో ఏముందంటే ??
జానీ మాస్టర్ కేసుపై కరాటే కళ్యాణి కామెంట్స్..
జానీ మాస్టర్ కేసుపై కరాటే కళ్యాణి కామెంట్స్..
కోవిడ్ ఎఫెక్ట్స్ ఇంత దారుణంగా ఉంటాయా.? అందుకే ఇంత త్వరగా మరణాలా.?
కోవిడ్ ఎఫెక్ట్స్ ఇంత దారుణంగా ఉంటాయా.? అందుకే ఇంత త్వరగా మరణాలా.?
మీరు కాఫీ ప్రియులా.. అయితే ఈ న్యూస్‌ మీకోసమే.!
మీరు కాఫీ ప్రియులా.. అయితే ఈ న్యూస్‌ మీకోసమే.!
పొలంలో అదే.. పంప్‌సెట్‌ పక్కన అదే.! కొండచిలువ కలకలం..
పొలంలో అదే.. పంప్‌సెట్‌ పక్కన అదే.! కొండచిలువ కలకలం..
నాకు బోల్డ్‌గా స్టోరీ చెప్పారు.!అందుకే ఉప్పెనను వదులుకున్నా..
నాకు బోల్డ్‌గా స్టోరీ చెప్పారు.!అందుకే ఉప్పెనను వదులుకున్నా..
సిద్ధార్థ్-అదితికి ఎన్ని ఆస్తులు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
సిద్ధార్థ్-అదితికి ఎన్ని ఆస్తులు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టార్ కమెడియన్ సునీల్ వైఫ్ ఫోటో.!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టార్ కమెడియన్ సునీల్ వైఫ్ ఫోటో.!
త్రివిక్రమ్‌కే ఓటేసిన బన్నీ.! మరి అట్లీ తో సినిమా పరిస్థితి ఏంటి?
త్రివిక్రమ్‌కే ఓటేసిన బన్నీ.! మరి అట్లీ తో సినిమా పరిస్థితి ఏంటి?