AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rich Indians: భారతదేశంలో పెరుగుతున్న మిలియనీర్ల సంఖ్య!

దేశంలోని మిలియనీర్ల సంఖ్య భారీగా పెరిగింది. గత ఐదేళ్లలో రూ.10 కోట్ల కంటే ఎక్కువ సంపాదిస్తున్న భారతీయుల సంఖ్య 63 శాతం పెరిగింది. సెంట్రమ్ ఇనిస్టిట్యూషనల్ రీసెర్చ్ తన నివేదికలలో ఈ సమాచారాన్ని ఇచ్చింది. నివేదిక ప్రకారం.. ఏటా రూ. 5 కోట్లకు పైగా సంపాదించే వారి సంఖ్య 49 శాతం పెరిగి 58,200కి చేరుకుంది..

Rich Indians: భారతదేశంలో పెరుగుతున్న మిలియనీర్ల సంఖ్య!
Subhash Goud
|

Updated on: Sep 18, 2024 | 8:01 PM

Share

దేశంలోని మిలియనీర్ల సంఖ్య భారీగా పెరిగింది. గత ఐదేళ్లలో రూ.10 కోట్ల కంటే ఎక్కువ సంపాదిస్తున్న భారతీయుల సంఖ్య 63 శాతం పెరిగింది. సెంట్రమ్ ఇనిస్టిట్యూషనల్ రీసెర్చ్ తన నివేదికలలో ఈ సమాచారాన్ని ఇచ్చింది. నివేదిక ప్రకారం.. ఏటా రూ. 5 కోట్లకు పైగా సంపాదించే వారి సంఖ్య 49 శాతం పెరిగి 58,200కి చేరుకుంది.

31,800 మంది సంపాదన రూ.10 కోట్ల కంటే ఎక్కువ: 

ANIని ఉటంకిస్తూ సెంట్రమ్ ఇన్‌స్టిట్యూషనల్ రీసెర్చ్ ఈ నివేదిక వచ్చింది. ఈ నివేదిక ప్రకారం, ఏటా రూ.10 కోట్లకు పైగా సంపాదించే వారి సంఖ్య గత ఐదేళ్లలో 63 శాతం పెరిగింది. దేశంలో ఏటా రూ.10 కోట్ల కంటే ఎక్కువ సంపాదిస్తున్న వారు 31,800 మంది ఉన్నారని, 2018-19 ఆర్థిక సంవత్సరం నుంచి 2023 వరకు గత ఐదేళ్ల మధ్య వీరి సంఖ్య భారీగా పెరిగిందని ఈ నివేదికలో పేర్కొంది.

ఇవి కూడా చదవండి

10 లక్షల మంది సంపాదన రూ. 50 లక్షల పైనే..

సెంట్రమ్ ఇన్‌స్టిట్యూషనల్ రీసెర్చ్ ప్రకారం, ఏటా రూ. 50 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్న భారతీయుల సంఖ్య 25 శాతం పెరిగింది. ఏటా రూ. 50 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్న వారి సంఖ్య దాదాపు 10 లక్షల మంది ఉన్నారు. 2018-19 నుండి 2023-24 ఆర్థిక సంవత్సరం మధ్య సంవత్సరానికి రూ. 10 కోట్ల కంటే ఎక్కువ సంపాదించే వారి సంఖ్య సంవత్సరానికి 121 శాతం పెరిగింది. అటువంటి వ్యక్తుల మొత్తం సంపద రూ. 38 లక్షల కోట్లకు చేరుకుంది. ఏటా రూ.5 కోట్ల కంటే ఎక్కువ సంపాదిస్తున్న వారి సంఖ్య ఏటా 106 శాతం పెరిగి, ఈ కేటగిరీలోకి వచ్చే వ్యక్తుల మొత్తం సంపద రూ.40 లక్షల కోట్లకు చేరుకుంది. ఏటా రూ.50 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్న వారి సంఖ్య 64 శాతం పెరిగి ఐదేళ్లలో వారి సంపద రూ.49 లక్షల కోట్లకు పెరిగింది.

భారతదేశంలో అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు, అల్ట్రా హై నెట్ వర్త్ వ్యక్తుల మొత్తం ఆర్థిక ఆస్తులు 2023 నాటికి $ 1.2 ట్రిలియన్ నుండి 2028 నాటికి $ 2.2 ట్రిలియన్లకు పెరుగుతాయని నివేదిక అంచనా వేసింది. 2023-2028లో ఈ వర్గంలోకి వచ్చే వ్యక్తుల సంపదలో వార్షికంగా 13 నుండి 14 శాతం పెరుగుదల ఉంటుంది. ప్రజల ఆదాయం ఇంత భారీగా పెరిగినప్పటికీ, సంపదలో కేవలం 15 శాతం మాత్రమే నిపుణులు నిర్వహిస్తున్నారని, అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ సంఖ్య 75 శాతంగా ఉందని పరిశోధన నివేదికలో పేర్కొంది.

ఇది కూడా చదవండి: Jio AirFiber: జియో నుంచి దీపావళి ధమాకా ఆఫర్.. ఏడాది పాటు ఎయిర్‌ఫైబర్‌ ఉచితం

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
200 ఏళ్లనాటి రాజమహల్‌.. 52 గదులు, 53 తలపుల వెనుక రహస్యం తెలిస్తే
200 ఏళ్లనాటి రాజమహల్‌.. 52 గదులు, 53 తలపుల వెనుక రహస్యం తెలిస్తే
సూర్య గ్రహణం వచ్చేస్తోంది.. దానికి ముందు తప్పక చేయాల్సిన పనులివే
సూర్య గ్రహణం వచ్చేస్తోంది.. దానికి ముందు తప్పక చేయాల్సిన పనులివే
ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్ రీఎంట్రీ? ఒక్క ఫొటోతో..
ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్ రీఎంట్రీ? ఒక్క ఫొటోతో..
బోగాపురం అల్లూరి ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ..!
బోగాపురం అల్లూరి ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ..!
నాన్నకు ప్రేమతో తాటి చెట్టుకు నిచ్చేన..! 55 అడుగుల ఎత్తు హాయిగా
నాన్నకు ప్రేమతో తాటి చెట్టుకు నిచ్చేన..! 55 అడుగుల ఎత్తు హాయిగా
భలే టేస్ట్.. మాములుగా ఉండదు... మ్యాడైపోతారు..
భలే టేస్ట్.. మాములుగా ఉండదు... మ్యాడైపోతారు..
ఈ జిల్లాలో వారం రోజుల పాటు బంగారం షాప్‌లు క్లోజ్.. ఎందుకంటే?
ఈ జిల్లాలో వారం రోజుల పాటు బంగారం షాప్‌లు క్లోజ్.. ఎందుకంటే?
జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి ఉగ్రదాడి..!
జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి ఉగ్రదాడి..!
10 రోజులు తింటే కిలోమీటర్ దూరంలోవి కూడా క్లియర్‌గా..
10 రోజులు తింటే కిలోమీటర్ దూరంలోవి కూడా క్లియర్‌గా..
దేవశయని ఏకాదశి ఎప్పుడు..? ఈ రోజు తులసి పూజ ఎందుకు అత్యంత విశేషం?
దేవశయని ఏకాదశి ఎప్పుడు..? ఈ రోజు తులసి పూజ ఎందుకు అత్యంత విశేషం?