AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఇక అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లలో ఏసీలు.. రైల్వే కీలక నిర్ణయం

పండుగ సీజన్లలో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఇండియన్ రైల్వేస్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఇకపై అన్‌రిజర్వడ్ బోగీల్లో ప్రయాణిస్తున్న ప్రయాణీకులు కూడా ఏసీ లాంటి ప్రయాణాన్ని ఆస్వాదించేందుకు రైల్వేశాఖ ప్రణాళికలు సిద్దం చేస్తోంది.

Indian Railways: ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఇక అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లలో ఏసీలు.. రైల్వే కీలక నిర్ణయం
Subhash Goud
| Edited By: |

Updated on: Sep 19, 2024 | 9:33 AM

Share

పండుగ సీజన్లలో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఇండియన్ రైల్వేస్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఇకపై అన్‌రిజర్వడ్ బోగీల్లో ప్రయాణిస్తున్న ప్రయాణీకులు కూడా ఏసీ లాంటి ప్రయాణాన్ని ఆస్వాదించేందుకు రైల్వేశాఖ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. వందేభారత్, శతాబ్ది, రాజధాని.. లేదా ఎక్స్‌ప్రెస్ రైళ్లకు రిజర్వేషన్ టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ 3 నెలల ముందు నుంచి ప్రారంభమవుతుంది. ఇక పెద్ద పండుగలు దసరా, సంక్రాంతికి అయితే కన్ఫర్మ్ టికెట్లు అటుంచితే.. ఈ ట్రైన్స్‌లో వెయిటింగ్ లిస్టు వందల్లో ఉంటుంది. జనాలు తమ సొంత ఊర్లకు ప్రయాణించేందుకు కిక్కిరిసిన అన్‌రిజర్వడ్ బోగీల్లోనే తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. అందుకే ఇకపై వారికి కూడా అలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని రైల్వేశాఖ ఆలోచిస్తోంది. ఆ కోవలోనే ఇకపై అన్‌రిజర్వడ్ బోగీలలోనూ ఏసీలు ఇన్‌స్టాల్ చేయాలని నిర్ణయించింది.

ఈ క్రమంలోనే ‘నమో భారత్ ర్యాపిడ్ రైల్’ డిజైన్‌ను తయారు చేసింది కేంద్ర రైల్వేశాఖ. ఇటీవల తొలి నమో భారత్ ర్యాపిడ్ రైలు భుజ్-అహ్మదాబాద్ మార్గంలో నడిచింది. ఈ రైలులో దాదాపుగా 270 మంది ప్రయాణీకుల సామర్ధ్యం కలిగిన పలు అన్‌రిజర్వడ్ బోగీల్లో 15-15 టన్నుల ఏసీలను అమర్చారు. మెట్రో ప్రయాణం మాదిరిగానే అనుకున్న క్యాపసిటీ నిండగానే.. బోగీలన్నీ చల్లబడతాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. మరికొద్దిరోజుల్లో ఇదే డిజైన్‌ను ఎక్స్‌ప్రెస్ రైళ్లలోని అన్‌రిజర్వడ్ బోగీల్లోనూ ఉపయోగించనున్నారు. శతాబ్ది, రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లలోని అమర్చిన ఏసీల కంటే డబుల్ క్యాపసిటీతో కూడిన ఏసీలను అన్‌రిజర్వడ్ బోగీల్లో ఇన్‌స్టాల్ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది రైల్వేశాఖ.

రాత పరీక్ష లేకుండానే.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాలు!
రాత పరీక్ష లేకుండానే.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాలు!
రోహిత్ తొలగింపు వెనుక గౌతమ్ గంభీర్ మాస్టర్ ప్లాన్ ఇదేనా ?
రోహిత్ తొలగింపు వెనుక గౌతమ్ గంభీర్ మాస్టర్ ప్లాన్ ఇదేనా ?
JEE Main 2026 మీ ఫైనల్ ప్రిపరేషన్‌ ఇలా ఉంటే.. టాప్ ర్యాంక్ మీదే!
JEE Main 2026 మీ ఫైనల్ ప్రిపరేషన్‌ ఇలా ఉంటే.. టాప్ ర్యాంక్ మీదే!
ఉజ్జయినిలో భక్తి పారవశ్యంలో మునిగిపోయిన స్టార్ క్రికెటర్లు
ఉజ్జయినిలో భక్తి పారవశ్యంలో మునిగిపోయిన స్టార్ క్రికెటర్లు
హాఫ్ సెంచరీ చేసి 6 ఏళ్లు దాటిందిగా.. వరుస ఫ్లాప్ షోలతో భారంగా..
హాఫ్ సెంచరీ చేసి 6 ఏళ్లు దాటిందిగా.. వరుస ఫ్లాప్ షోలతో భారంగా..
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
పంజాబ్ పీచమణిచిన సౌరాష్ట్ర సింహం..సెమీఫైనల్లో 165 పరుగులతో ఊచకోత
పంజాబ్ పీచమణిచిన సౌరాష్ట్ర సింహం..సెమీఫైనల్లో 165 పరుగులతో ఊచకోత
భారత్‌లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!
భారత్‌లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!
అంతరిక్ష కేంద్రంలో అనారోగ్యం కలకలం.. భూమిపైకి వ్యోమగాములు
అంతరిక్ష కేంద్రంలో అనారోగ్యం కలకలం.. భూమిపైకి వ్యోమగాములు
గోల్డ్‌లోన్‌ ట్రై చేస్తున్నారా?ఫిబ్రవరి 1 వరకు వెయిట్‌ చేయండి
గోల్డ్‌లోన్‌ ట్రై చేస్తున్నారా?ఫిబ్రవరి 1 వరకు వెయిట్‌ చేయండి