Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Union Budget 2025: మెడికల్ కాలేజీలో సీట్ల పెంపుపై మంత్రి నిర్మలమ్మ కీలక ప్రకటన

Union Budget 2025: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను సమర్పిస్తున్నారు. మోదీ ప్రభుత్వానికి ఇది రెండో పూర్తిస్థాయి బడ్జెట్‌. అదే సమయంలో నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్‌లో పలు రంగాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ముఖ్యంగా రైతులకు, విద్యార్థులకు సంబంధించిన మెడికల్‌ సీట్లపై కీలక ప్రకటన చేశారు..

Union Budget 2025: మెడికల్ కాలేజీలో సీట్ల పెంపుపై మంత్రి నిర్మలమ్మ కీలక ప్రకటన
Follow us
Subhash Goud

|

Updated on: Feb 01, 2025 | 12:00 PM

Budget 2025: పార్లమెంట్లో మంత్రి నిర్మలాసీతారామన్‌ వార్షిక బడ్జెట్‌ 2025 ప్రవేశపెట్టి ప్రసంగిస్తున్నారు. ఈ బడ్జెట్‌లో పలు రంగాలకు వరాలు కురిపించారు. రైతులతో పాటు వివిధ రంగాల అంశాలపై ప్రకటనలు చేస్తున్నారు. అలాగే మెడికల్‌ కాలేజీలో సీట్ల పెంపుపై ప్రకటన చేశారు. వైద్య విద్యార్థుల కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది నుంచి మెడికల్ కాలేజీలో 10 వేల సీట్లు పెంచుతామని వెల్లడించారు. అలాగే ఐటీ సామర్థ్యం పెరిగిందని, 5 IITలలో అదనపు మౌలిక సదుపాయాలు సృష్టించనున్నట్లు చెప్పారు. IIT పాట్నా విస్తరించనున్నట్లు చెప్పారు. వచ్చే ఐదేళ్లలో 75,000 కొత్త యూజీ మెడికల్ సీట్లను ప్రభుత్వం చేర్చనుంది మంత్రి నిర్మలాసీతారామన్‌ తెలిపారు.

డాక్టర్లు కావాలని కలలు కనే వారికి ఇది శుభవార్త. ఇప్పుడు దేశంలో ఎంబీబీఎస్ సీట్లను పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇది MBBS లో ప్రవేశం పొందడం సులభతరం చేస్తుంది. మెడిసిన్ చదివే వారికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో అనేక బహుమతులు ఇచ్చారు.

దేశంలోని వైద్య కళాశాలల్లో ఇప్పుడు మొత్తం 1,12,112 MBBS సీట్లు ఉన్నాయి. వీటి కోసం ప్రతి సంవత్సరం అడ్మిషన్ కోసం పోరాటం జరుగుతుంది. ఈ సీట్లకు నీట్ పరీక్ష ద్వారా ప్రవేశం కల్పిస్తారు. 2014 సంవత్సరం వరకు మొత్తం MBBS సీట్లు 51348 ఉండగా, 2014 వరకు దేశంలో మొత్తం 387 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. జూలై 2024 వరకు ఉన్న డేటా ప్రకారం.. ఇప్పుడు దేశంలోని వైద్య కళాశాలల సంఖ్య 731. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లను కూడా పెంచారు. 2014 వరకు మొత్తం పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్ల సంఖ్య 31185 కాగా, జూలై 2024 నాటికి ఈ సీట్ల సంఖ్య 72627కి పెరిగింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బడ్జెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మంటలు రేపనున్న మార్చినెల.. ఎండలతో జాగ్రత్త జర వీడియో
మంటలు రేపనున్న మార్చినెల.. ఎండలతో జాగ్రత్త జర వీడియో
గంగానది మధ్యలో వంద మంది యాత్రికులు.. ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో
గంగానది మధ్యలో వంద మంది యాత్రికులు.. ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో
హల్దీ ఫంక్షన్‌లో కోతి హల్‌చల్‌.. ఏం చేసిందో చూడండి
హల్దీ ఫంక్షన్‌లో కోతి హల్‌చల్‌.. ఏం చేసిందో చూడండి
92 ఏళ్ల వృద్ధురాలి సాహసం.. శివుడి కోసం.. కాగుతున్న నూనెలో చేతితో
92 ఏళ్ల వృద్ధురాలి సాహసం.. శివుడి కోసం.. కాగుతున్న నూనెలో చేతితో
అయ్యో.. నీళ్ల కోసం వచ్చి బావిలో పడి.. చివరికి?
అయ్యో.. నీళ్ల కోసం వచ్చి బావిలో పడి.. చివరికి?
గోవా కొంపముంచిన ఇడ్లీ సాంబార్‌.. ఎమ్మెల్యే ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు
గోవా కొంపముంచిన ఇడ్లీ సాంబార్‌.. ఎమ్మెల్యే ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు
"గోల్డ్‌ కార్డు'' కావాలా నాయనా..? కండిషన్స్ అప్లయ్‌.!
ఐదుగురు మహిళలతో కలిసి అంతరిక్షంలోకి జెఫ్‌ బెజోస్‌ ప్రియురాలు
ఐదుగురు మహిళలతో కలిసి అంతరిక్షంలోకి జెఫ్‌ బెజోస్‌ ప్రియురాలు
గ్రహశకలం భూమిని ఢీ కొంటే.. నాశనమయ్యే నగరాలు ఏంటో తెలుసా?
గ్రహశకలం భూమిని ఢీ కొంటే.. నాశనమయ్యే నగరాలు ఏంటో తెలుసా?
తల్లి ప్రేమ రేంజ్ ఇదీ.. కుక్క దాడి నుంచి తల్లి రక్షణ కవచం ఏర్పాటు
తల్లి ప్రేమ రేంజ్ ఇదీ.. కుక్క దాడి నుంచి తల్లి రక్షణ కవచం ఏర్పాటు