AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Govt Scheme: రైతులకు మేలు జరిగే మూడు అద్భుతమైన పథకాలు

భారతీయ రైతుల కోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ ప్రభుత్వం చేపట్టిన పనుల జాబితాను పరిశీలిస్తే అందులో రైతుల సంక్షేమం కోసం తీసుకొచ్చిన ఎన్నో పథకాలు ఉన్నాయి. ప్రతి సీజన్‌లో భారతీయ రైతులకు సహాయం అందించడానికి పని చేసే అటువంటి మూడు పథకాల గురించి తెలుసుకుందాం. లబ్ధిదారుని రైతు ఖాతాలో నేరుగా డబ్బు జమ చేసే పథకం ఉంది. రైతులకు..

Govt Scheme: రైతులకు మేలు జరిగే మూడు అద్భుతమైన పథకాలు
Govt Scheme
Subhash Goud
|

Updated on: Apr 27, 2024 | 8:49 AM

Share

భారతీయ రైతుల కోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ ప్రభుత్వం చేపట్టిన పనుల జాబితాను పరిశీలిస్తే అందులో రైతుల సంక్షేమం కోసం తీసుకొచ్చిన ఎన్నో పథకాలు ఉన్నాయి. ప్రతి సీజన్‌లో భారతీయ రైతులకు సహాయం అందించడానికి పని చేసే అటువంటి మూడు పథకాల గురించి తెలుసుకుందాం. లబ్ధిదారుని రైతు ఖాతాలో నేరుగా డబ్బు జమ చేసే పథకం ఉంది. రైతులకు ఎక్కువ ప్రయోజనం చేకూర్చే ఆ మూడు పథకాల గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం.

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన

పంటలు నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని ప్రారంభించింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతులను ఒకే చోటికి చేర్చే ప్రయత్నం చేశారు. ఈ పథకం కోసం ప్రభుత్వానికి ఒక విజన్, మిషన్ ఉంది. విపత్తులు, తెగుళ్లు లేదా కరువు వల్ల పంటలు దెబ్బతిన్నప్పుడు బీమా పథకం కింద ఆర్థిక సహాయం అందించబడుతుంది.

ఇవి కూడా చదవండి

కిసాన్ క్రెడిట్ కార్డ్

కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) పథకాన్ని 1998లో కేంద్ర ప్రభుత్వం రైతులకు వారి వ్యవసాయం లేదా వ్యవసాయ ఖర్చులకు తగిన రుణాన్ని అందించడానికి ప్రారంభించింది. ఈ వ్యవసాయ లేదా కేంద్ర ప్రభుత్వ పథకాల కింద వ్యవసాయానికి ప్రభుత్వ సబ్సిడీ రూపంలో సంవత్సరానికి 4 శాతం రాయితీ రేటుతో వ్యవసాయ రుణాలు కలిగిన రైతులకు భారత ప్రభుత్వం సహాయం అందిస్తుంది. ఇప్పటి వరకు 2.5 కోట్ల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు.

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇది రైతులకు ఏటా రూ.6 వేలు ఇస్తుంది. దేశంలోని ఏ రైతు అయినా ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మొత్తం మూడు వాయిదాలలో అందిస్తోంది. ఇవి 4 నెలల వ్యవధిలో రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి