AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: ఇప్పుడు ఆ టికెట్‌ రద్దుపై అదనపు ఛార్జీ ఉండదు.. రైల్వే కీలక నిర్ణయం

రైల్వేశాఖ కీలక ప్రకటన చేసింది. దీని కోసం ప్రయాణికులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆర్‌ఏసీ టిక్కెట్ల వెయిటింగ్, క్యాన్సిలేషన్ కోసం రైల్వే ప్రత్యేక ఛార్జీలను వసూలు చేయదు. ప్రయాణీకుల టిక్కెట్ వెయిటింగ్ లిస్ట్‌లో లేదా RACలో ఉంటే అదనపు రుసుము వసూలు చేయరు. అయితే టిక్కెట్ రద్దు రుసుము ద్వారా భారతీయ రైల్వే చాలా సంపాదిస్తున్నదని, అయితే అది ప్రయాణీకుల జేబులపై..

Indian Railways: ఇప్పుడు ఆ టికెట్‌ రద్దుపై అదనపు ఛార్జీ ఉండదు.. రైల్వే కీలక నిర్ణయం
Indian Railways
Subhash Goud
|

Updated on: Apr 27, 2024 | 7:40 AM

Share

రైల్వేశాఖ కీలక ప్రకటన చేసింది. దీని కోసం ప్రయాణికులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆర్‌ఏసీ టిక్కెట్ల వెయిటింగ్, క్యాన్సిలేషన్ కోసం రైల్వే ప్రత్యేక ఛార్జీలను వసూలు చేయదు. ప్రయాణీకుల టిక్కెట్ వెయిటింగ్ లిస్ట్‌లో లేదా RACలో ఉంటే అదనపు రుసుము వసూలు చేయరు. అయితే టిక్కెట్ రద్దు రుసుము ద్వారా భారతీయ రైల్వే చాలా సంపాదిస్తున్నదని, అయితే అది ప్రయాణీకుల జేబులపై ప్రభావం చూపుతుంది. దీని వల్ల నష్టాలు చవి చూడాల్సి వస్తుంది. ఏసీ కోచ్‌లోని ప్రయాణికులు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ ప్రయాణికుడు ఆర్‌టీఈ కింద సమాచారం కోరిన తర్వాత, టికెట్ రద్దు తర్వాత తగ్గింపు నియమాన్ని రైల్వే మార్చింది.

భారతీయ రైల్వే కొత్త నిబంధనల ప్రకారం.. ప్రయాణికుల టిక్కెట్లను రద్దు చేయడానికి ప్రయాణీకుల నుండి రూ.60 వసూలు చేస్తారు. అందువల్ల స్లీపర్ క్లాస్ ప్రయాణికులకు రూ.120, థర్డ్ ఏసీ టికెట్ రద్దుకు రూ.180, సెకండ్ ఏసీ టికెట్ రద్దుకు రూ.200, ఫస్ట్ ఏసీ టికెట్ రద్దుకు రూ.240 మినహాయించబడతాయి. మొదటిసారిగా ఆర్‌ఏసీ టిక్కెట్లు లేదా ఇతర టిక్కెట్ల వెయిటింగ్, క్యాన్సిలేషన్‌పై సేవా పన్ను, ఇతర ఛార్జీల భారీ రికవరీని రైల్వే చేసింది.

ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?

జార్ఖండ్ సామాజిక కార్యకర్త సునీల్ కుమార్ ఖండేల్‌వాల్ ఆర్‌టీఈ కింద దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఎంత మొత్తం ఫీజుగా వసూలు చేశారు? ఎంత రికవరీ చేశారు అనే విషయాలపై ఆరా తీశారు. సమాచారం అందుకున్న తర్వాత, టిక్కెట్ రద్దు ఛార్జీలతో రైల్వేకు భారీ ఆదాయం వస్తోందని, ప్రయాణికులు భారీగా నష్టపోతున్నారని ఫిర్యాదు చేశారు. ఓ ప్రయాణికుడు రూ.190 టిక్కెట్‌లో సీటును రిజర్వేషన్‌ చేసుకున్నాడు. వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉండగా, ఆ తర్వాత అ టికెట్‌ రద్దయ్యింది. అప్పుడు అతనికి రూ.95 మాత్రమే వాపసు వచ్చింది.

తాగునీటి నిబంధనలను మార్పు

నీటి ఆదా కోసం భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో తాగునీరు వృథా కాకుండా ఉంటుంది. ఇప్పటి వరకు వందేభారత్ రైల్వేలో ప్రయాణికులకు ఒక లీటర్ వాటర్ బాటిళ్లు ఇచ్చేవారు. ఇప్పుడు ప్రతి ప్రయాణికుడికి 500 మిల్లీలీటర్లు అంటే అరలీటర్ డ్రింకింగ్ వాటర్ బాటిల్, రైల్వే నీర్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ అందించాలని నిర్ణయించారు. దీంతో నీటి వృథాను అరికట్టవచ్చు. అవసరమైతే, ప్రయాణీకుడు అదనపు నీటి బాటిల్‌ను అడగవచ్చు. రైల్వే వారికి అర లీటర్ వాటర్ బాటిళ్లను అందజేస్తుంది. దీని కోసం అదనంగా చెల్లించాల్సిన అవసరం ఉండదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆయిల్ ఫ్రీ ఆమ్లెట్.. చుక్క నూనెలేకుండా టేస్టీటేస్టీగా చేసుకోండి
ఆయిల్ ఫ్రీ ఆమ్లెట్.. చుక్క నూనెలేకుండా టేస్టీటేస్టీగా చేసుకోండి
భారత గడ్డపై డారిల్ మిచెల్ అన్ స్టాపబుల్ రికార్డ్
భారత గడ్డపై డారిల్ మిచెల్ అన్ స్టాపబుల్ రికార్డ్
భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్‌కౌంటర్!
భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్‌కౌంటర్!
సిపిఐ శతాబ్ది ఉత్సవాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం..
సిపిఐ శతాబ్ది ఉత్సవాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం..
క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించకపోతే మిమ్మల్ని అరెస్టు చేయవచ్చా?
క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించకపోతే మిమ్మల్ని అరెస్టు చేయవచ్చా?
ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులను క‌టాక్షించ‌నున్న మలయప్ప స్వామి
ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులను క‌టాక్షించ‌నున్న మలయప్ప స్వామి
ఆటోలో అనుమానాస్పదంగా కనిపించిన నీలి రంగు పెట్టె..!
ఆటోలో అనుమానాస్పదంగా కనిపించిన నీలి రంగు పెట్టె..!
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
ఒకే బ్యాటర్ పై మూడు సార్లు అటాక్..హర్షిత్ హ్యాట్రిక్ రికార్డ్
ఒకే బ్యాటర్ పై మూడు సార్లు అటాక్..హర్షిత్ హ్యాట్రిక్ రికార్డ్
ఆలయానికి ఏ పండు తీసుకెళ్తే శుభ ప్రదం.? ఎలాంటి ఫలితం వస్తుందో..
ఆలయానికి ఏ పండు తీసుకెళ్తే శుభ ప్రదం.? ఎలాంటి ఫలితం వస్తుందో..