AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Investment: త్వరలోనే 10 గ్రాముల బంగారం రూ.2 లక్షలు? పెట్టుబడిదారులకు పండగే..!

భారతదేశంలో అధిక మంది బంగారాన్ని ఆభరణంగానే చూస్తారు కానీ పెట్టుబడిగా చూడరు. అయితే పెట్టుబడిగా ఆలోచించి పెట్టుబడి పెట్టిన వారికి ప్రస్తుతం బంగారం ద్వారా అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. బంగారం ధరలు కొత్త ఎత్తులకు ఎగబాకడంతో, విలువైన లోహం ప్రతిష్టాత్మకమైన రూ. 1 లక్ష లేదా రూ. 2 లక్షల మార్కును ఎప్పుడు చేరుకుంటుందని పెట్టుబడిదారులు ఆలోచిస్తున్నారు.

Gold Investment: త్వరలోనే 10 గ్రాముల బంగారం రూ.2 లక్షలు? పెట్టుబడిదారులకు పండగే..!
Gold Price
Nikhil
|

Updated on: May 03, 2024 | 5:00 PM

Share

భారతదేశంలో బంగారం లేని మహిళ ఉండదు అనేది అతిశయోక్తి కాదు. అయితే గత కొద్దిరోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు కొనుగోలుదారులను ఉక్కిబిక్కిరి చేస్తున్నాయి. భారతదేశంలో అధిక మంది బంగారాన్ని ఆభరణంగానే చూస్తారు కానీ పెట్టుబడిగా చూడరు. అయితే పెట్టుబడిగా ఆలోచించి పెట్టుబడి పెట్టిన వారికి ప్రస్తుతం బంగారం ద్వారా అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. బంగారం ధరలు కొత్త ఎత్తులకు ఎగబాకడంతో, విలువైన లోహం ప్రతిష్టాత్మకమైన రూ. 1 లక్ష లేదా రూ. 2 లక్షల మార్కును ఎప్పుడు చేరుకుంటుందని పెట్టుబడిదారులు ఆలోచిస్తున్నారు. బంగారం కదలికలపై చారిత్రక డేటాను పరిశీలిస్తే ఈ విషయం గురించి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బంగారం పెట్టుబడిదారులు ఏయే అంశాలు పరిగణలోని తీసుకోవాలో? ఓ సారి చూద్దాం.

గత తొమ్మిదేళ్లలో బంగారం ధరలు దాదాపు మూడు రెట్లు పెరిగాయి. 2015లో రూ. 24,740 నుంచి ప్రారంభమయ్యాయి. మునుపటి తొమ్మిదేళ్ల కాలంలో ఇదే విధమైన నమూనా గమనిస్తే 2006లో రూ. 8,250 నుంచి మూడు రెట్లు పెరిగాయి. 1987లో బంగారం ధరలు 10 గ్రాములకు రూ. 2,570 నుండి మూడు రెట్లు పెరిగాయి. ప్రస్తుతం ఇదే మూడు రెట్లు ధోరణి కొనసాగితే బంగారం 10 గ్రాముల మైలురాయికి రూ. 2 లక్షలను అధిగమించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, ఈ స్థాయికి చేరుకోవడానికి కాలపరిమితి అనిశ్చితంగానే ఉంది. ఇటీవలి ట్రెండ్లను బట్టి, రాబోయే 7- 12 సంవత్సరాలలో బంగారం ధరలు రూ. 2 లక్షలకు చేరుకోవచ్చని సూచిస్తున్నారు.

రాబోయే ఆరేళ్లలో బంగారం ధరలు మూడు రెట్లు పెరుగుతాయని అంచనా వేస్తూ మరింత గొప్ప ఆశావాదాన్ని వ్యక్తం చేశారు. ఈ పెరుగుదలకు సంభావ్య ఉత్ప్రేరకాలుగా పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డి-డాలరైజేషన్ కారణమని నిపుణులు భావిస్తున్నారు.  అయితే ట్రిపుల్ పీరియడ్ దాదాపు 19 సంవత్సరాల వరకు విస్తరించిన సందర్భాలు ఉన్నాయని పేర్కొంటుననారు. ఏదైనా ఆస్తిలా కాకుండా బంగారం బుల్, బేర్ మార్కెట్లకు లోబడి ఉంటుందని, ఫలితంగా వేరియబుల్ వార్షిక రాబడి ఉంటుందని వివరిస్తున్నారు.  ముఖ్యంగా చాలా ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఇష్టపడుతుననారు. పెట్టుబడిదారులు తమ వ్యూహాలను కేవలం బంగారం సంభావ్య ట్రిప్లింగ్ పై ఆధారపడకుండా ద్రవ్యోల్బణం, మార్కెట్ అస్థిరతతో సంబంధం ఉన్న నష్టాలను తగ్గించడానికి పెట్టుబడిపెట్టాలని సూచిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి