AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPI payments: యూపీఐ చార్జీలపై యూజర్ల షాకింగ్ నిర్ణయం.. 75 శాతం మంది ఏంచెప్పారంటే..?

ప్రస్తుతం డిజిటల్ చెల్లింపుల శకం నడుస్తోంది. ప్రతి ఒక్కరూ తమ స్మార్ట్ ఫోన్ల ద్వారా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ (యూపీఐ)ను ఉపయోగించి నగదు లావాదేవీలు జరుపుతున్నారు. దీని ద్వాారా డబ్బులు చెల్లించడం చాలా సులభంగా ఉండడంతో ఆదరణ పెరిగింది. ఉదయం లేచింది మొదలు, రాత్రి పడుకునే వరకూ అనేక లావాదేవీలకు యూపీఐ మనకు ఎంతో ఉపయోగపడుతుంది.

UPI payments: యూపీఐ చార్జీలపై యూజర్ల షాకింగ్ నిర్ణయం.. 75 శాతం మంది ఏంచెప్పారంటే..?
Upi
Nikhil
|

Updated on: Sep 28, 2024 | 4:00 PM

Share

ప్రస్తుతం డిజిటల్ చెల్లింపుల శకం నడుస్తోంది. ప్రతి ఒక్కరూ తమ స్మార్ట్ ఫోన్ల ద్వారా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ (యూపీఐ)ను ఉపయోగించి నగదు లావాదేవీలు జరుపుతున్నారు. దీని ద్వాారా డబ్బులు చెల్లించడం చాలా సులభంగా ఉండడంతో ఆదరణ పెరిగింది. ఉదయం లేచింది మొదలు, రాత్రి పడుకునే వరకూ అనేక లావాదేవీలకు యూపీఐ మనకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ విధానం లేనప్పుడు నగదు కొనుగోళ్లు జరిగేవి. బయటకు వెళితే డబ్బులు తీసుకువెళ్లాల్సి వచ్చేది. ముఖ్యంగా చిల్లర సమస్య వేధించేది. యూపీఐ చెల్లింపులతో ఆ సమస్యలన్నింటికీ చెక్ పడింది. ప్రస్తుతం ఈ చెల్లింపుల విధానంలో మనకు అదనపు చార్జీలు ఏమీ వసూలు చేయరు. కానీ చెల్లింపులకు చార్జీలు పెడితే ఎంత యూపీఐని ఎంత మంది వినియోగిస్తారనే అనే అంశంపై ఇటీవల సర్వే చేశారు. దానిలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి.

యూపీఐ చెల్లింపుల విధానంలో దేశంలో ఎంతో ఆదరణ పొందింది. రోడ్డు పక్కన తోపుడు బళ్ల నుంచి స్టార్ హాటళ్ల వరకూ దీని ద్వారా చెల్లింపులు జరపొచ్చు. మన బ్యాంకు ఖాతాలో డబ్బులు ఉంటే చాలు ఎక్కడైనా నిరభ్యతరంగా వాడుకోవచ్చు. ఈ విధానంలో లాావాదేవీలు సులభం కావడంతో పాటు పారదర్శకత పెరిగింది. దాదాపు 38 శాతం మంది తమ వ్యాపారాలలో యూపీఐ చెల్లింపులు కీలకంగా మారాయన్నారు. మరో 37 శాతం మంది తాము లావాదేవీలన్నింటిని ఆ విధానంలో చేస్తున్నట్టు వెల్లడించారు.  యూపీఐ ద్వారా జరిపే లావాదేవీలకు చార్జీలు వసూలు చేస్తే ఏమతుందని అనే అంశంపై ఇటీవల సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ విధానంలో చాలా సులువుగా చెల్లింపులు జరుగుతున్నప్పటికీ చార్జీలు విధిస్తే వినియోగించబోమని తెలిపారు.

సర్వేలో పాల్గొన్న దాదాపు 75 శాతం మంది ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. యూపీఐలో ఈ విధానంలో వస్తే దాదాపు వాడకం నిలిచిపోతుందన్నారు. అయితే 22 శాతం మంది సానుకూలంగా స్పందించారు. ఆర్థిక లావాదేవీలు చాలా సులువగా జరుగుతున్నాయి కాబట్టి చార్జీలు వసూలు చేసినా తాము వినియోగిస్తామని తెలిపారు. జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో ఈ సర్వేను జరిపారు. దేశంలోని 325 జిల్లాలలో 44 వేల మంది అభిప్రాయాలను తెలుసుకున్నారు. వారిలో 65 శాతం మంది పురుషులు, 35 శాతం మంది మహిళలు ఉన్నారు. పట్టణాలతో పాటు గ్రామీణుల నుంచి సమాచారం సేకరించారు. చాలామంది చార్జీల ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించారు. అవి అమలైతే తాము యూపీఐని వినియోగంచబోమని స్పష్టం చేశారు. కాబట్టి యూపీఐ విధానంతో డిజిటల్ చెల్లింపులు జోరుగా జరుగుతున్న నేపథ్యంలో చార్జీలు అమలు చేస్తే ప్రజాదరణ తగ్గిపోయే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక
శ్రీవారి భక్తులకు హెచ్చరిక! వీఐపీ దర్శనం పేరుతో మోసపోకండి
శ్రీవారి భక్తులకు హెచ్చరిక! వీఐపీ దర్శనం పేరుతో మోసపోకండి
టాస్ గెలిచిన రాజస్థాన్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు..
టాస్ గెలిచిన రాజస్థాన్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు..
ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
మహిళా రిజర్వేషన్లు రాజకీయ లబ్ధి కోసం కాదు.. మహిళా సాధికారత కోసమే
మహిళా రిజర్వేషన్లు రాజకీయ లబ్ధి కోసం కాదు.. మహిళా సాధికారత కోసమే