Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: మీరు ఎక్కే రైలు మిస్‌ అయితే మరో ట్రైన్‌లో ప్రయాణించవచ్చా? నిబంధనలేంటి?

భారతీయ రైల్వేలను దేశం లైఫ్ లైన్ అంటారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రైల్వేశాఖ అనేక నిబంధనలు రూపొందిస్తోంది. రైలు మిస్సింగ్ అనేది ప్రయాణీకుల అతిపెద్ద సమస్య. మీరు రైలును మిస్‌ అయినప్పుడు ముందుగా గుర్తుకు వచ్చేది టికెట్ వాపసు గురించి. దీని తర్వాత ఈ టిక్కెట్‌తో..

Indian Railways: మీరు ఎక్కే రైలు మిస్‌ అయితే మరో ట్రైన్‌లో ప్రయాణించవచ్చా? నిబంధనలేంటి?
Follow us
Subhash Goud

|

Updated on: Sep 28, 2024 | 3:40 PM

భారతీయ రైల్వేలను దేశం లైఫ్ లైన్ అంటారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రైల్వేశాఖ అనేక నిబంధనలు రూపొందిస్తోంది. రైలు మిస్సింగ్ అనేది ప్రయాణీకుల అతిపెద్ద సమస్య. మీరు రైలును మిస్‌ అయినప్పుడు ముందుగా గుర్తుకు వచ్చేది టికెట్ వాపసు గురించి. దీని తర్వాత ఈ టిక్కెట్‌తో మీరు మరొక రైలులో ప్రయాణించవచ్చా అనే తదుపరి ప్రశ్న. మరి ఇలాంటి సమస్యలకు రైల్వే నిబంధనలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: Rule Change 1st October: అక్టోబర్‌ 1 నుంచి ఐదు పెద్ద మార్పులు.. మీ జేబుపై ప్రభావం పడనుందా?

మీరు వేరే రైలులో ప్రయాణించవచ్చా?

భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం, ఒక ప్రయాణీకుడు జనరల్ కోచ్ టికెట్ తీసుకుని ఉంటే రైస్‌ మిస్‌ అయినట్లయితే అతను మరొక రైలులో ప్రయాణించవచ్చు. అదే వందే భారత్, సూపర్ ఫాస్ట్, రాజధాని ఎక్స్‌ప్రెస్ మొదలైన రైళ్లు కూడా ముఖ్యమే. అయితే, ప్రయాణీకుడు రిజర్వ్ చేసిన టిక్కెట్‌ను కలిగి ఉంటే, అటువంటి పరిస్థితిలో అదే టిక్కెట్‌ను మరొక రైలులో ప్రయాణించడానికి ఉపయోగించలేరు. ఒక వేళ మీరు అదే టికెట్‌తో మరో రైలులో ప్రయాణించినట్లయితే ఇబ్బందులు పడతారు. రైల్వే టీటీఈకి పట్టుబడితో జరిమానా విధిస్తారు.

రీఫండ్‌ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?

  • టిక్కెట్ రీఫండ్ పొందడానికి మీరు TDR ఫారమ్‌ను పూరించాలి. దీని కోసం ముందుగా మీరు IRCTC వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌కి లాగిన్ అవ్వాలి.
  • ఇప్పుడు మీరు ‘మై ట్రాన్సాక్షన్’ ఎంపికను ఎంచుకోవాలి.
  • ఇప్పుడు మీరు ‘ఫైల్ TDR’ ఎంపికపై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత మీరు రైలు PNR నంబర్, క్యాప్చాను నమోదు చేయాలి. ఇప్పుడు క్యాన్సిలేషన్ రూల్స్ బాక్స్‌ను టిక్ చేయండి.
  • ఆ తర్వాత సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. మీరు నమోదు చేసుకున్న లేదా టికెట్ బుకింగ్ ఫారమ్‌లో ఇచ్చిన ఫోన్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.
  • దీని తర్వాత ఎన్ని రోజుల్లో రీఫండ్‌ వస్తుందనే విషయాన్ని చూపిస్తుంది.

టికెట్ రద్దుపై వాపసు ఎలా పొందాలి?

రైల్వే నిబంధనల ప్రకారం, నిర్ణీత సమయానికి 48 గంటలలోపు మీరు ధృవీకరించబడిన రైలు టిక్కెట్‌ను రద్దు చేస్తే మొత్తం మొత్తంలో 25% వరకు కట్‌ అవుతుంది. మీరు రైలు బయలుదేరే సమయానికి 4 గంటల నుండి 12 గంటల మధ్య టిక్కెట్‌ను రద్దు చేస్తే, టికెట్‌లో సగం మొత్తం అంటే 50% కట్‌ చేస్తారు. వెయిట్‌లిస్ట్, ఆర్‌ఏసీ టిక్కెట్‌లను రైలు షెడ్యూల్ చేసిన బయలుదేరే సమయానికి 30 నిమిషాల ముందు తప్పనిసరిగా రద్దు చేయాలి. లేకుంటే మీరు వాపసు పొందలేరు.

ఇది కూడా చదవండి: 2025 Holidays: వచ్చే ఏడాది సెలవుల జాబితా ఇదే.. ఆ నెలలో ఎక్కువ హాలిడేస్‌

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి