RBI: నిబంధనలు పాటించనందున ఆ మూడు బ్యాంకులకు షాకిచ్చిన రిజర్వ్‌ బ్యాంకు

RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) బ్యాంకులపై కొరఢా ఝులిపిస్తోంది. నిబంధనలు పాటించని బ్యాంకులపై భారీ ఎత్తున జరిమానా విధిస్తోంది. సోమవారం నాసిక్ మర్చంట్స్ కోఆపరేటివ్..

RBI: నిబంధనలు పాటించనందున ఆ మూడు బ్యాంకులకు షాకిచ్చిన రిజర్వ్‌ బ్యాంకు
Rbi
Follow us

|

Updated on: Jul 12, 2022 | 12:29 PM

RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) బ్యాంకులపై కొరఢా ఝులిపిస్తోంది. నిబంధనలు పాటించని బ్యాంకులపై భారీ ఎత్తున జరిమానా విధిస్తోంది. సోమవారం నాసిక్ మర్చంట్స్ కోఆపరేటివ్ బ్యాంక్‌తో సహా మూడు సహకార బ్యాంకులపై రెగ్యులేటరీ సమ్మతిలో లోపాల కారణంగా జరిమానా విధించింది. ఫ్రాడ్ రిపోర్టింగ్, పర్యవేక్షణకు సంబంధించి జారీ చేసిన నాబార్డ్ (నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్) ఆదేశాలను పాటించనందుకు, ముంబైలోని మహారాష్ట్ర స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్‌కి రూ.37.50 లక్షల జరిమానా విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ సహకార బ్యాంకుకు 50 లక్షల జరిమానా విధించారు. అలాగే నాసిక్ మర్చంట్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఇతర బ్యాంకుల్లో డిపాజిట్ల ప్లేస్‌మెంట్, డిపాజిట్లపై వడ్డీకి సంబంధించి ఆర్‌బీఐ ఆదేశాలను పాటించనందుకు రూ.50 లక్షల జరిమానా విధించినట్లు సెంట్రల్ బ్యాంక్ మరో ప్రకటనలో తెలిపింది.

నేషనల్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, బెట్టియా, బీహార్ డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్, నో యువర్ కస్టమర్ రూల్స్ నిబంధనలను ఉల్లంఘించినందుకు రూ.2 లక్షల జరిమానా విధించినట్లు ఆర్బీఐ తెలిపింది. రెగ్యులేటరీ సమ్మతిలో లోపాల కారణంగా ఈ పెనాల్టీ విధించినట్లు సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

ఈ బ్యాంకులపై ఆర్బీఐ చర్యలు..

రెగ్యులేటరీ నిబంధనలు పాటించనందుకు గతంలో ఆర్‌బీఐ ఫెడరల్ బ్యాంక్‌పై రూ.5.72 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియాపై రూ.70 లక్షలు పెనాల్టీ విధించింది. ఈ మేరకు ఆర్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. నో యువర్ ఎంప్లాయీ నిబంధనలు, రెగ్యులేటరీ సమ్మతి కొన్ని నిబంధనలకు సంబంధించి ఆదేశాలను పాటించనందుకు బ్యాంక్ ఆఫ్ ఇండియాపై RBI రూ. 70 లక్షల పెనాల్టీని విధించిందని పేర్కొంది.

ఇన్సూరెన్స్ బ్రోకింగ్/కార్పొరేట్ ఏజెన్సీ సేవలలో నిమగ్నమైన తన ఉద్యోగులకు బీమా కంపెనీ ఏదైనా ప్రోత్సాహకం (నగదు లేదా నగదు రహిత) అందించిందో లేదో నిర్ధారించడంలో బ్యాంక్ విఫలమైందని ఫెడరల్ బ్యాంక్ గురించి ప్రత్యేక ప్రకటనలో RBI పేర్కొంది. ఆర్‌బీఐ మార్చి 31, 2020 నాటికి బ్యాంక్ ఆర్థిక స్థితికి సంబంధించి మానిటరింగ్ అసెస్‌మెంట్ (ISE) కోసం చట్టబద్ధమైన తనిఖీని నిర్వహించింది.

అంతకుముందు, ప్రైవేట్ రంగ బ్యాంకు కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్‌బీఐ గత వారం పెద్ద చర్య తీసుకుంది. కోటక్ బ్యాంకుపై రిజర్వ్ బ్యాంక్ రూ.1 కోటి 5 లక్షల జరిమానా విధించింది. రెగ్యులేటరీ నిబంధనలను పాటించడంలో జాప్యం కారణంగా ఈ జరిమానా విధించబడింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు