Reliance Capital: అనిల్‌ అంబానీ రిలయన్స్‌ క్యాపిటల్‌కు ఎదురుదెబ్బ.. RBI సంచలన నిర్ణయం

Reliance Capital: దేశంలో అత్యధిక ధనవంతుడుగా ఉన్న ముఖేష్‌ అంబానీ సోదరుడు అనిల్‌ అంబానీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌..

Reliance Capital: అనిల్‌ అంబానీ రిలయన్స్‌ క్యాపిటల్‌కు ఎదురుదెబ్బ.. RBI సంచలన నిర్ణయం
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Nov 29, 2021 | 7:16 PM

Reliance Capital: దేశంలో అత్యధిక ధనవంతుడుగా ఉన్న ముఖేష్‌ అంబానీ సోదరుడు అనిల్‌ అంబానీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ క్యాపిటల్‌ కంపెనీ మరింతగా దివాలా తీసింది. కంపెనీ బోర్డును రద్దు చేస్తున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) వెల్లడించింది. చేసిన అప్పులను తీర్చడంలో కంపెనీ విఫలం కావడంతో ఆర్బీఐఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే ప్రాథమిక విచారణలో కంపెనీ నిర్వహణకు సంబంధించిన అనేక తప్పిదాలు ఉన్నట్లు ఆర్బీఐ గుర్తించింది. రిలయన్స్ క్యాపిటల్ బోర్డు తన బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైనందున బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర మాజీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వై. నాగేశ్వరరావును అడ్మినిస్ట్రేటర్‌గా నియమిస్తున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ తెలిపింది.

అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934లోని సెక్షన్ 45-IE (1) ప్రకారం అందించబడిన అధికారాలను ఉపయోగించడం ద్వారా, బోర్డ్ ఆఫ్ రిలయన్స్ క్యాపిటల్ అధికారాలను స్వాధీనం చేసుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఒక ప్రకటన విడుదల చేసింది. దివాలా చట్టం కింద కంపెనీపై ఆర్‌బిఐ త్వరలో చర్యలు ప్రారంభించనుంది.

అయితే రిలయన్స్‌ క్యాపిటల్‌ గత ఏడాది హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (హెచ్‌డీఎఫ్‌సీ), యాక్సిస్‌ బ్యాంకు నుంచి తీసుకున్న రూ.624 కోట్ల విలువైన రుణాలపై వడ్డీ చెల్లింపులను చెల్లించకపోవడాన్ని ఆర్బీఐ ప్రస్తావించింది. అక్టోబర్‌ 31 నాటికి వడ్డీ చెల్లింపుల వషయంలో కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీకి రూ.4.77 కోట్లు, యాక్సిస్‌ బ్యాంకుకు రూ.0.71 కోట్లు డిఫాల్డ్‌ చేసింది. హెచ్‌డీఎఫ్‌సీ నుంచి ఆరు నెలల నుంచి ఏడు సంవత్సరాల కాలానికి 10.6 శాతం నుంచి 13 శాతం, యాక్సిస్‌ బ్యాంకు నుంచి 3-7 సంవత్సరాలకు 8.25 శాతం టర్మ్‌ లోన్స్‌ను తీసుకుంది. ఇలా చెల్లింపుల విషయంలో చేసిన పొరపాట్ల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆర్బీఐ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

Liquor Consumption: మద్యం వినియోగంలో ఆ రాష్ట్రం ముందుంది.. మరి తెలంగాణ.. తాజా సర్వేలో సంచలన విషయాలు..!

SBI Customers Alert: తన కస్టమర్లకు షాకిచ్చిన ఎస్‌బీఐ.. డిసెంబర్‌ 1 నుంచి వీటిపై బాదుడు..!

ITR Filing Penalty: పన్ను రిటర్న్‌ దాఖలు చేసేవారికి శుభవార్త.. ఆలస్యమైనా జరిమానా ఉండదు.. ఎవరెవరికి అంటే..!

బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు