AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI New Rules: ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలు.. డిఫాల్ట్‌ అయిన కస్టమర్లపై అడ్డగోలు ఛార్జీలకు అడ్డుకట్ట..!

పెనాల్టీ ఛార్జీల క్యాపిటలైజేషన్ ఉండదని నోటిఫికేషన్ పేర్కొంది. అటువంటి ఛార్జీలపై అదనపు వడ్డీ లెక్కించబడదు. అయితే, ఈ సెంట్రల్ బ్యాంక్ సూచనలు క్రెడిట్ కార్డ్‌లు, బాహ్య వాణిజ్య రుణాలు, వాణిజ్య రుణాలు మొదలైన వాటికి వర్తించవు. రుణానికి సంబంధించి రుణగ్రహీతలో మనోధైర్యాన్ని నింపడమే అపరాధ వడ్డీ, ఛార్జ్ విధించే లక్ష్యం అని సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది.

RBI New Rules: ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలు.. డిఫాల్ట్‌ అయిన కస్టమర్లపై అడ్డగోలు ఛార్జీలకు అడ్డుకట్ట..!
RBI
Jyothi Gadda
|

Updated on: Aug 19, 2023 | 10:47 AM

Share

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: భారతీయ రిజర్వ్ బ్యాంక్ కోట్లాది మందికి భారీ ఉపశమనం కలిగించింది. రుణ ఖాతాలపై పెనాల్టీ, వడ్డీ రేట్లకు సంబంధించి RBI నిబంధనలను మార్చింది. రుణ ఖాతాలపై జరిమానా విధించడాన్ని సెంట్రల్ బ్యాంక్ నిషేధించింది. దీంతో పాటు వచ్చే ఏడాది నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని ఆర్బీఐ తెలిపింది. RBI ఈ కొత్త నిబంధన అన్ని బ్యాంకులకు వర్తిస్తుంది. కొత్త నిబంధనలు వాణిజ్య, NBFC, కో-ఆపరేటివ్ బ్యాంక్, హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్, NABARD, SIDBI మొదలైన అన్ని బ్యాంకులకు వర్తిస్తాయి.

ఆర్బీఐ విడుదల చేసిన కొత్త నిబంధన..

బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బిఎఫ్‌సిలు) తమ ఆదాయాలను పెంచుకోవడానికి పెనాల్టీ వడ్డీని ఉపయోగిస్తున్న తీరుపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ ( ఆర్‌బిఐ ) ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి సెంట్రల్ బ్యాంక్ సవరించిన నిబంధనలను జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం రుణంపై డిఫాల్ట్ అయినప్పుడు సంబంధిత ఖాతాదారుడికి జరిమానాను ఛార్జీల రూపంలో మాత్రమే విధించాలి. అంతేకానీ, జరిమానా వడ్డీ ఛార్జీలను విధించకూడదు. దీనిని కూడా ఆయా బ్యాంకులు ఆదాయ మార్గంగా మార్చుకోకూడదని సూచించింది.. అంతేకాదు.. ఈ ఛార్జీలపై భవిష్యత్తులో కూడా ఎలాంటి వడ్డీని విధించకూడదని చెప్పింది.. ఇది సాధారణ రుణాలపై విధించే చక్రవడ్డీకి వర్తించదని ఆర్‌బీఐ పేర్కొంది. అంతేకాదు.. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు వడ్డీకి మరే ఇతర అదనపు భారాలను జోడించకూడదని ఆర్‌బీఐ తేల్చిచెప్పింది. ఈ కొత్త నిబంధనలు జనవరి 1, 2024 నుండి అమలులోకి వస్తాయి..

ఫెయిర్ లెండింగ్ ప్రాక్టీసెస్ – రుణ ఖాతాలపై జరిమానా రుసుముకు సంబంధించి శుక్రవారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో జనవరి 1, 2024 నుండి బ్యాంకులు, ఇతర రుణ సంస్థలు అపరాధ వడ్డీని వసూలు చేయడానికి అనుమతించబడవని ఆర్‌బిఐ తెలిపింది.సెంట్రల్ బ్యాంక్ ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే, రుణగ్రహీత రుణ ఒప్పందంలోని నిబంధనలను పాటించకపోతే, అతని నుండి ‘పెనాల్టీ రుసుము’ వసూలు చేయవచ్చని సెంట్రల్ బ్యాంక్ నోటిఫికేషన్ పేర్కొంది. ఇది అపరాధ వడ్డీగా వసూలు చేయరాదు.. బ్యాంకులు అడ్వాన్సులపై విధించే వడ్డీ రేట్లకు నాన్-పెనాల్టీ వడ్డీని కలుపుతారు. దీంతో పాటు అపరాధ రుసుం సహేతుకంగా ఉండాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

అదనపు వడ్డీ లెక్కించబడదు..

పెనాల్టీ ఛార్జీల క్యాపిటలైజేషన్ ఉండదని నోటిఫికేషన్ పేర్కొంది. అటువంటి ఛార్జీలపై అదనపు వడ్డీ లెక్కించబడదు. అయితే, ఈ సెంట్రల్ బ్యాంక్ సూచనలు క్రెడిట్ కార్డ్‌లు, బాహ్య వాణిజ్య రుణాలు, వాణిజ్య రుణాలు మొదలైన వాటికి వర్తించవు. రుణానికి సంబంధించి రుణగ్రహీతలో మనోధైర్యాన్ని నింపడమే అపరాధ వడ్డీ/ఛార్జ్ విధించే లక్ష్యం అని సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది. బ్యాంకులు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆర్‌బీఐని మాధ్యమంగా ఉపయోగించరాదని స్పష్టం చేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..