Post Office: బ్యాంక్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ కంటే ఎక్కువ ఆదాయం ఇచ్చే ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా?

కష్టపడి సంపాదించడం.. దానిని పొదుపుగా ఖర్చు చేయడం. మిగిలిన కాస్త డబ్బును భవిష్యత్ అవసరాల కోసం దాచుకోవడం అందరూ చేసే పనే. అయితే, ఇలా దాచుకున్న డబ్బును సరైన విధానంలో అందరూ ఉంచగలుగుతున్నారా? అనేది పెద్ద ప్రశ్న. సాధారణంగా మనమంతా డబ్బు ..

Post Office: బ్యాంక్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ కంటే ఎక్కువ ఆదాయం ఇచ్చే ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా?
Best Scheme
Follow us

|

Updated on: Apr 28, 2023 | 6:13 PM

కష్టపడి సంపాదించడం.. దానిని పొదుపుగా ఖర్చు చేయడం. మిగిలిన కాస్త డబ్బును భవిష్యత్ అవసరాల కోసం దాచుకోవడం అందరూ చేసే పనే. అయితే, ఇలా దాచుకున్న డబ్బును సరైన విధానంలో అందరూ ఉంచగలుగుతున్నారా? అనేది పెద్ద ప్రశ్న. సాధారణంగా మనమంతా డబ్బు దాచుకోవడం అంటే బ్యాంకు సేవింగ్స్ ఎకౌంట్ లేదా ఫిక్స్‌డ్‌ డిపాజిట్ ఆలాగే ఆర్డీ వంటి వాటిని ఆప్షన్స్ గా చూస్తాం. ఎందుకంటే దాచుకునే డబ్బు సేఫ్ గా ఉంటుంది. కొంత వడ్డీ వస్తుంది. ఇంతే లెక్క వేస్తాం. కానీ, వీటి కంటే ఎక్కువ వడ్డీ ఎక్కడ వస్తుంది. మన డబ్బు సురక్షితంగా ఉండడంతో పాటు వడ్డీ రూపంలో ఎక్కువ ఆదాయం ఎలా సంపాదించుకోవచ్చు అనే అంశాలను గురించి పెద్దగా ఆలోచన చేయం.

ఇప్పుడు మనం బ్యాంక్ ఫిక్స్ డ్ డిపాజిట్ కంటే ఎక్కువ వడ్డీ ఇచ్చే ఇతర మార్గం ఒకదాని గురించి తెలుసుకుందాం. అదే పోస్టాఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ పథకం. ఇది సురక్షితమైన పెట్టుబడి విధానం. అలాగే మన డబ్బుపై ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిపెట్టే మార్గంగా ప్రస్తుతం చెప్పవచ్చు. దీని గరించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టాఫీసుకు చెందిన నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ (ఎన్‌ఎస్‌సి) పథకంపై వచ్చే వడ్డీని ప్రభుత్వం ఈ నెలలో పెంచింది. మీరు ఫిక్సెడ్ డిపాజిట్ కంటే పన్నును ఆదా చేసి, మీ పెట్టుబడిపై ఎక్కువ రాబడిని పొందాలనుకుంటే, మీరు ఈ పథకంలో డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు. ప్రస్తుతం ఈ పథకంపై 7.7% వడ్డీ అందుతోంది. ఈ పోస్టాఫీసు పథకంలో మీరు కనీసం రూ.1000 పెట్టుబడి పెట్టాలి. మీరు ఎన్‌ఎస్‌సిలో ఎంత మొత్తాన్ని అయినా పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో గరిష్ట పెట్టుబడి కోసం పరిమితి లేదు. NSC లాక్ ఇన్ పీరియడ్ 5 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఐదు సంవత్సరాల లోపు మీ డబ్బును మీరు వెనక్కి తీసుకోలేరు.

ఇవి కూడా చదవండి

మీరు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్‌లో ఏ డబ్బును ఇన్వెస్ట్ చేసినా, మీరు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద దానిపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో NSCలో గరిష్టంగా రూ.1.5 లక్షలు పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు దీనిపై పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందవచ్చు.

ఈ పథకంలో పిల్లల పేరు మీద కూడా ఖాతా తెరవవచ్చు. పిల్లల వయస్సు 10 ఏళ్లలోపు ఉంటే అతని పేరు మీద తల్లిదండ్రుల తరపున ఖాతాను తెరవవచ్చు. 10 సంవత్సరాల వయస్సులో, పిల్లవాడు తన ఖాతాను స్వయంగా నిర్వహించగలడు. పిల్లలు పెద్దవారైనపుడు వారి ఎకౌంట్ పూర్తి బాధ్యతను పొందుతారు. ఇది కాకుండా, 18 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తి స్వయంగా లేదా మైనర్ వ్యక్తి తరపున NSCలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ఖాతాను 3 పెద్దల పేరుతో ఉమ్మడి ఖాతాగా కూడా తెరవవచ్చు.

దీని నుంచి మీరు మీ పెట్టుబడిని వెనక్కి తీసుకోవాలంటే, మీరు 5 సంవత్సరాలు వేచి ఉండాలి. దీనికి 5 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉంది. అంటే, మీరు 5 సంవత్సరాలలోపు మీ డబ్బును ఉపసంహరించుకోలేరు.

ఇందులో పెట్టుబడి పెట్టే ముందు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. మీరు మెచ్యూరిటీ వ్యవధిలో మధ్యమధ్యలో దానిపై పొందిన వడ్డీని ఉపసంహరించుకోవాలనుకుంటే, మీరు ఈ పథకంలో పెట్టుబడి పెడితే అలా చేయలేరు. ఇందులో 5 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉంది. అంటే మీరు 60 నెలల వరకు డబ్బును విత్‌డ్రా చేయలేరు. అందుకే 1-2 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఈ పథకం సరిపోదు.

దేశంలోని అతిపెద్ద బ్యాంక్ ఎస్‌బీఐ ప్రస్తుతం 5 సంవత్సరాల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌పై 6.50% వార్షిక వడ్డీని చెల్లిస్తోంది. ఇది NSCలో పొందే వడ్డీ కంటే తక్కువ. అదే సమయంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా 5 సంవత్సరాల ఎఫ్‌డీపై సంవత్సరానికి 6.50% వడ్డీని చెల్లిస్తోంది. పన్ను మినహాయింపు ప్రయోజనం 5 సంవత్సరాల ఎఫ్‌డీపై కూడా అందుబాటులో ఉంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద, మీరు మీ మొత్తం ఆదాయం నుండి రూ. 1.5 లక్షల తగ్గింపును క్లెయిమ్ చేయవచ్చు. మీరు సెక్షన్ 80C ద్వారా మీ మొత్తం పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం నుంచి 1.5 లక్షల వరకు తగ్గించుకోవచ్చు.

ష్టపడి సంపాదించిన డబ్బును దాచుకోవడంలో తెలివిగా వ్యవహరిస్తే చక్కని రాబడి పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో పోస్టాఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ పథకం మీ డబ్బుకు భద్రత ఇవ్వడంతో పాటు దానిపై అధిక వడ్డీ కూడా అందిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి