సేంద్రీయ వ్యవసాయదారులకు గుడ్‌ న్యూస్.. ఇక సులభంగా మీ పంటను ఎలా అమ్ముకోవచ్చో తెలుసుకోండి..

రైతులు పంట పండిచడం ఒక ఎత్తైతే.. దానిని విక్రయించడం మరో ఎత్తు. కొన్ని సందర్భాల్లో పండించిన పంటకు గిట్టుబాటుధర లభించక రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. కేంద్రప్రభుత్వం కొన్ని పంటలకు మద్దతు ధర..

సేంద్రీయ వ్యవసాయదారులకు గుడ్‌ న్యూస్.. ఇక సులభంగా మీ పంటను ఎలా అమ్ముకోవచ్చో తెలుసుకోండి..
Crop
Follow us

|

Updated on: Dec 15, 2022 | 11:18 AM

రైతులు పంట పండిచడం ఒక ఎత్తైతే.. దానిని విక్రయించడం మరో ఎత్తు. కొన్ని సందర్భాల్లో పండించిన పంటకు గిట్టుబాటుధర లభించక రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. కేంద్రప్రభుత్వం కొన్ని పంటలకు మద్దతు ధర ప్రకటిస్తుండటంతో వ్యవసాయ దారులకు సానుకూలమైన అంశమే అయినప్పటికి.. రైతులకు గిట్టుబాటు ధర దొరకడం కష్టంగానే మారింది. ఇటీవల కాలంలో సేంద్రీయ పంటకు డిమాండ్ పెరుగుతోంది. ఆరోగ్య ప్రయోజనాలను కాంక్షించే వ్యక్తులు సేంద్రీయ వస్తువులను కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో సేంద్రీయ వ్యవసాయ సాగు విస్తీర్ణం పెరుగుతోంది. కాని సేంద్రియ రైతులు తమ పంటలను ఎక్కడ విక్రయించాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు.  చాలా మంది తాము పండించిన పంటలను స్థానిక మార్కెట్‌లో అక్కడి ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ క్రమంలో సేంద్రీయ వ్యవసాయదారులు తమ పంట ఉత్పత్తులను లాభసాటిగా ఎలా విక్రయించుకోవాలో తెలుసుకుందాం. దేశంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

భూమి ఉత్పాదకత , ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పెద్ద సంఖ్యలో రైతులు కూడా సేంద్రీయ సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. కాని సేంద్రియ పంటలు పండించిన రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడ విక్రయించుకోవాలో తెలియక తరచుగా ఆందోళన చెందుతూ ఉంటారు. సేంద్రియ ఉత్పత్తులకు సంబంధించిన మార్కెట్ దేశంలో ఇప్పటికి పెద్దగా అభివృద్ధి చెందలేదనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు పండించిన పంటలను తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది. వారికి రావాల్సిన లాభాలు పొందలేకపోతున్నారు. అలాంటి రైతులకు లబ్ధికలిగేలా ప్రభుత్వం ఓ అడుగు ముందుకు వేసింది. https://www.jaivikkheti.in/ పోర్టల్‌ని సందర్శించడం ద్వారా రైతులు తమ పంటలను సరసమైన ధరకు విక్రయించుకోవచ్చు. రైతులు ఈ వెబ్ సైట్‌ను ఉపయోగించి పంటను విక్రయించుకోవడం ద్వారా మంచి లాభాలను పొందే అవకాశం ఉంటుంది.

ఈ వెబ్‌సైట్‌లో పంట ఉత్పత్తులు విక్రయించే రైతులు తమ దిగుబడి జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. అన్ని నిబంధనలను పాటించినప్పుడే దానిని ఆర్గానిక్ ప్రొడక్ట్‌ అని పిలుస్తారు. రైతు పండించిన పంట సేంద్రీయమని ఆర్గానిక్ ఉత్పత్తులను గుర్తించే సంస్థ ధృవీకరించబడాలి. ఆ తర్వాత మాత్రమే రైతు దానిని https://www.jaivikkheti.in/ వెబ్‌సైట్‌ ద్వారా విక్రయించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

దేశంలో సేంద్రీయ వ్యవసాయానికి ధృవీకరణ అవసరం. దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని సందర్శించి.. అక్కడ సంబంధి అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. భూమికి సంబంధించిన సమాచారం ఆధారంగా సేంద్రీయ వ్యవసాయ ధృవీకరణ పత్రం జారీ చేయబడుతుంది. సేంద్రీయ వ్యవసాయం వలన నేల సారాన్ని పెంచుతుంది. నీటిపారుదల విరామం పెరుగుతుంది. రసాయనిక ఎరువులపై ఆధారపడటం తగ్గించడం వల్ల ఖర్చులు తగ్గుతాయి. పంట ఉత్పాదకత పెరుగుతుంది. మార్కెట్‌లో సేంద్రియ ఉత్పత్తులకు డిమాండ్ పెరగడం వల్ల రైతుల ఆదాయం పెరుగుతుంది. సేంద్రియ ఎరువును ఉపయోగించడం ద్వారా నేల నాణ్యత మెరుగుపడుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు