PPF: పీపీఎఫ్‌ ఖాతాదారులు అలర్ట్‌.. ఏప్రిల్ 5 లోపు ఈ పనిని పూర్తి చేయండి.. లేకపోతే భారీగా నష్టం

మీరు కూడా పీపీఎఫ్‌ పెట్టుబడి పెట్టినట్లయితే ఏప్రిల్ 5 తేదీ మీకు చాలా ముఖ్యమైనది. వాస్తవానికి, 2025-25 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. అటువంటి పరిస్థితిలో మీరు ఈ ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక, పన్ను ప్రణాళికను చేయాలనుకుంటే మీకు సమయం చాలా ముఖ్యం. పన్ను ఆదా చేయడానికి మార్కెట్లో అనేక ఆప్షన్లు అందుబాటులో ఉన్నప్పటికీ పీపీఎఫ్‌ ఇప్పటికీ సురక్షితమైన పెట్టుబడిగా పరిగణిస్తారు. పీపీఎఫ్‌ అనేది పన్ను ఆదాతో పాటు..

PPF: పీపీఎఫ్‌ ఖాతాదారులు అలర్ట్‌.. ఏప్రిల్ 5 లోపు ఈ పనిని పూర్తి చేయండి.. లేకపోతే భారీగా నష్టం
Ppf
Follow us

|

Updated on: Apr 04, 2024 | 2:39 PM

మీరు కూడా పీపీఎఫ్‌ పెట్టుబడి పెట్టినట్లయితే ఏప్రిల్ 5 తేదీ మీకు చాలా ముఖ్యమైనది. వాస్తవానికి, 2025-25 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. అటువంటి పరిస్థితిలో మీరు ఈ ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక, పన్ను ప్రణాళికను చేయాలనుకుంటే మీకు సమయం చాలా ముఖ్యం. పన్ను ఆదా చేయడానికి మార్కెట్లో అనేక ఆప్షన్లు అందుబాటులో ఉన్నప్పటికీ పీపీఎఫ్‌ ఇప్పటికీ సురక్షితమైన పెట్టుబడిగా పరిగణిస్తారు. పీపీఎఫ్‌ అనేది పన్ను ఆదాతో పాటు అధిక వడ్డీ రేట్ల ప్రయోజనాన్ని పొందే పథకం. పీపీఎఫ్ పథకంలో ఏప్రిల్ 5 తేదీ చాలా ముఖ్యమైనది. ఈ తేదీని మిస్ అయితే లక్షల్లో నష్టం వాటిల్లవచ్చు. ఎలాగో చెప్పుకుందాం..

ఏప్రిల్ 5 ఎందుకు ముఖ్యమైనది?

మీరు ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఏప్రిల్ 5వ తేదీలోపు పీపీఎఫ్‌ స్కీమ్‌లో ఒకేసారి డబ్బును పెట్టుబడి పెట్టినట్లయితే మీరు అత్యధిక వడ్డీ రేటు ప్రయోజనాన్ని పొందుతారు. పీపీఎప్‌ ఖాతాలో వడ్డీ ప్రతి నెల 5వ తేదీన లెక్కిస్తారు. అటువంటి పరిస్థితిలో మీరు ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఏప్రిల్ 5వ తేదీలోపు మొత్తం మొత్తాన్ని డిపాజిట్ చేస్తే మీరు మొత్తం నెలకు వడ్డీ ప్రయోజనం పొందుతారు.

ఇవి కూడా చదవండి

వడ్డీ గణన

పీపీఎఫ్ ఖాతాలో జమ చేసిన మొత్తంపై 7.1 శాతం వడ్డీని ప్రభుత్వం అందిస్తోంది. ఒక వ్యక్తి ప్రతి నెల 5వ తేదీలోపు పెట్టుబడి పెడితే, అతను డిపాజిట్ చేసిన మొత్తంపై పూర్తి వడ్డీ ప్రయోజనం పొందుతారు. అదే సమయంలో మీరు 5వ తేదీ తర్వాత పెట్టుబడి పెడితే మీరు 5వ తేదీ, 30వ తేదీల మధ్య అతి తక్కువ బ్యాలెన్స్‌పై మాత్రమే వడ్డీ ప్రయోజనం పొందుతారు. అటువంటి పరిస్థితిలో మీరు ఆ నెలలో వడ్డీని కోల్పోవచ్చు.

పీపీఎఫ్‌ కాలిక్యులేటర్ ప్రకారం.. మీరు ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 5 నాటికి ఏక మొత్తంలో రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టి, ఈ పెట్టుబడిని 15 సంవత్సరాల పాటు కొనసాగిస్తే, 15 సంవత్సరాలలో డిపాజిట్ చేసిన మొత్తంపై మీకు మొత్తం రూ. 18.18 లక్షల వడ్డీ లభిస్తుంది. అదే సమయంలో ప్రతి నెల 5వ తేదీ తర్వాత పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేస్తే రూ.17.95 లక్షల వడ్డీ మాత్రమే లభిస్తుంది. అటువంటి పరిస్థితిలో మీరు 15 సంవత్సరాలలో వడ్డీలో రూ. 23,188 నష్టాన్ని పొందుతారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్