Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PAN Aadhaar Link: వీరు పాన్-ఆధార్ లింక్ చేయాల్సిన అవసరం లేదు.. ఎవరెవరో తెలుసా?

ఆధార్ కార్డ్ లాగా, పాన్ కార్డ్ కూడా ముఖ్యమైన పత్రాలలో ఒకటి. అన్ని ఆర్థిక లావాదేవీలు, పన్ను సంబంధిత విషయాలలో పాన్ కార్డ్ ఉపయోగించబడుతుంది. దేశంలో కోట్లాది మందికి పాన్ కార్డు ఉండడానికి ఇదే కారణం. ముఖ్యంగా వ్యాపారవేత్తలు, ఉద్యోగస్తులు ఖచ్చితంగా పాన్ కార్డ్ కలిగి ఉంటారు. పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయడం చాలా ముఖ్యం. అయితే కొంతమందిని లింక్..

PAN Aadhaar Link: వీరు పాన్-ఆధార్ లింక్ చేయాల్సిన అవసరం లేదు.. ఎవరెవరో తెలుసా?
Aadhaar - Pan Link
Subhash Goud
|

Updated on: Apr 04, 2024 | 1:07 PM

Share

ఆధార్ కార్డ్ లాగా, పాన్ కార్డ్ కూడా ముఖ్యమైన పత్రాలలో ఒకటి. అన్ని ఆర్థిక లావాదేవీలు, పన్ను సంబంధిత విషయాలలో పాన్ కార్డ్ ఉపయోగించబడుతుంది. దేశంలో కోట్లాది మందికి పాన్ కార్డు ఉండడానికి ఇదే కారణం. ముఖ్యంగా వ్యాపారవేత్తలు, ఉద్యోగస్తులు ఖచ్చితంగా పాన్ కార్డ్ కలిగి ఉంటారు. పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయడం చాలా ముఖ్యం. అయితే కొంతమందిని లింక్ చేయాల్సిన అవసరం లేదు. ఇందుకు సంబంధించి కొన్ని నిబంధనలు కూడా రూపొందించారు.

గత కొన్నేళ్లుగా, పాన్‌ను ఆధార్ కార్డుతో లింక్ చేయడానికి ప్రభుత్వం చాలా గడువులను ఇచ్చింది. దాని గడువు ఇప్పుడు ముగిసింది. పాన్ కార్డుకు సంబంధించి అనేక రకాల సమాచారాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. ఇందులో దాని దుర్వినియోగం గురించి కూడా చర్చ జరుగుతోంది. పాన్-ఆధార్ లింక్ చేయవలసిన అవసరం లేని వ్యక్తుల గురించి తెలుసుకుందాం.

పాన్-ఆధార్ కార్డుకు ఎవరు లింక్ చేయలేరు?

ఇవి కూడా చదవండి

కొంతమందికి పాన్ కార్డ్‌ని ఆధార్ కార్డ్‌తో లింక్ చేయాల్సిన అవసరం లేదని నిబంధనలు చెబుతున్నాయి. వీరిలో 80 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు. ఇది కాకుండా ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. నాన్ రెసిడెంట్లు లేదా భారతీయ పౌరసత్వం లేని వారు. వారు కూడా పాన్ కార్డును లింక్ చేయవలసిన అవసరం లేదు. అదే సమయంలో అస్సాం, జమ్మూ మరియు కాశ్మీర్, మేఘాలయ రాష్ట్రాల నివాసితులు కూడా పాన్ ఆధార్‌ను లింక్ చేయడానికి అనుమతి ఉంది. కానీ వీటిని కూడా లింక్ చేయాల్సిన అవసరం లేదు. వాస్తవానికి, పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయని వారి పాన్ కార్డ్ డియాక్టివేట్ అవుతుంది.

పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయని వారు ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయలేరు. దీనితో పాటు, మీరు బ్యాంకు సంబంధిత లావాదేవీలు కూడా చేయలేరు. ప్రభుత్వ పథకాలన్నీ సద్వినియోగం చేసుకోలేరు. దీనికి కారణం ఈ రోజుల్లో ప్రతిదానికీ కేవైసీ చాలా ముఖ్యమైనది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి