KTR: భారత్‌లో టెస్లా కార్ల తయారీ ప్లాంట్‌.. తెలంగాణ సర్కార్‌కు విజ్ఞప్తి చేసిన కేటీఆర్‌

ప్రముఖం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ టెస్లా.. భారత్‌లో2 బిలియన్ డాలర్ల నుండి 3 బిలియన్ డాలర్ల ఎలక్ట్రిక్ కార్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతోంది. అయితే ఈ ప్లాంట్ ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను గుర్తించే పనిలో ఉంది. ఈ నేపథ్యంలో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు అమెరికా నుంచి టెస్లా కంపెనీ టీమ్‌ త్వరలో భారత్‌కు రానుంది. టెస్లా బృందం భారత్‌కు వస్తున్న సందర్భంలో తెలంగాణ మాజీ..

KTR: భారత్‌లో టెస్లా కార్ల తయారీ ప్లాంట్‌.. తెలంగాణ సర్కార్‌కు విజ్ఞప్తి చేసిన కేటీఆర్‌
Ktr
Follow us

|

Updated on: Apr 04, 2024 | 12:44 PM

ప్రముఖం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ టెస్లా.. భారత్‌లో2 బిలియన్ డాలర్ల నుండి 3 బిలియన్ డాలర్ల ఎలక్ట్రిక్ కార్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతోంది. అయితే ఈ ప్లాంట్ ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను గుర్తించే పనిలో ఉంది. ఈ నేపథ్యంలో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు అమెరికా నుంచి టెస్లా కంపెనీ టీమ్‌ త్వరలో భారత్‌కు రానుంది. టెస్లా బృందం భారత్‌కు వస్తున్న సందర్భంలో తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. దీనికి సంబంధించిన ఓ ట్వీట్‌ చేశారు. ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ కంపెనీ ప్లాంట్‌ను తెలంగాణకు తీసుకొచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు. టెస్లా ప్రతినిధులను మన రాష్ట్రానికి తీసుకొచ్చి.. ఇక్కడ కార్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. టెస్లా బృందం హైదరాబాద్‌ను సందర్శించి ఇక్కడ ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ ప్లాంట్‌ కోసం పరిశీలించేలా చర్యలు చేపట్టాలన్నారు.

ఇవి కూడా చదవండి

తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అద్భుతమైన అవకాశాలతో పాటు ప్రోగ్రెసివ్ పారిశ్రామిక విధానాలను కంపెనీకి తెలియజేసి, హైదరాబాద్ నగరంలో టెస్లా బృందం పర్యటించేలా చూడాలని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. ఈ కంపెనీని తీసుకువచ్చేందుకు ప్రభుత్వం తన శక్తి యుక్తులను అన్నిటిని ఉపయోగించి ప్రయత్నం చేయాలని కోరారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్