Indian Railways: వావ్.. భారత రైల్వే శాఖ భారీ డీల్.. ఆ దేశానికి 200 రైల్వే కోచ్ల ఎగుమతి
ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్వర్క్లలో ఒకటిగా ఉన్న భారతదేశం ఈ రంగంలో రాణించడానికి నిరంతరం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వేకు సంబంధించిన ఎగుమతి విభాగం ఆర్ఐటీఈఎస్ బంగ్లాదేశ్కు 200 ప్యాసింజర్ కోచ్లను సరఫరా చేయడానికి కొత్త ఆర్డర్ను పొందింది. ఇది అంతర్జాతీయ ఎగుమతి మార్కెట్లో భారతీయ రైల్వేకు ఒక ముఖ్యమైన విజయాన్ని సూచిస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారతీయ రైల్వే తన తయారీ సామర్థ్యాలను నిరంతరం విస్తరిస్తోంది. ఎగుమతులను సులభతరం చేయడానికి, ఇది వివిధ దేశాలతో వ్యాపార చర్చలలో చురుగ్గా పాల్గొనేందుకు ఆర్ఐటీఈఎస్ను స్థాపించింది.
![Indian Railways: వావ్.. భారత రైల్వే శాఖ భారీ డీల్.. ఆ దేశానికి 200 రైల్వే కోచ్ల ఎగుమతి](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/05/passenger-coaches-export.jpg?w=1280)
భారతీయ రైల్వే నెట్వర్క్ ఇటీవల కాలంలో గణనీయమైన వృద్ధిని సాధిస్తోంది. ముఖ్యంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ అభివృద్ధితో, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రైళ్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది. ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్వర్క్లలో ఒకటిగా ఉన్న భారతదేశం ఈ రంగంలో రాణించడానికి నిరంతరం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వేకు సంబంధించిన ఎగుమతి విభాగం ఆర్ఐటీఈఎస్ బంగ్లాదేశ్కు 200 ప్యాసింజర్ కోచ్లను సరఫరా చేయడానికి కొత్త ఆర్డర్ను పొందింది. ఇది అంతర్జాతీయ ఎగుమతి మార్కెట్లో భారతీయ రైల్వేకు ఒక ముఖ్యమైన విజయాన్ని సూచిస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారతీయ రైల్వే తన తయారీ సామర్థ్యాలను నిరంతరం విస్తరిస్తోంది. ఎగుమతులను సులభతరం చేయడానికి, ఇది వివిధ దేశాలతో వ్యాపార చర్చలలో చురుగ్గా పాల్గొనేందుకు ఆర్ఐటీఈఎస్ను స్థాపించింది. ఈ నేపథ్యంలో ఆర్ఐటీఎస్కు వచ్చిన తాజా ఆర్డర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
బంగ్లాదేశ్లో ప్యాసింజర్ రైళ్లకు పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి ఆ దేశం 200 ప్యాసింజర్ కోచ్ల కోసం గ్లోబల్ టెండర్ను జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆర్ఐటీఈఎస్ను ఈ కోచ్ల తయారీ కాంట్రాక్టును పొందింది. ఈ ఆర్డర్లో 106 ఏసీ కోచ్లు, 94 నాన్-ఏసీ కోచ్లు ఉన్నాయి. ఇవన్నీ పంజాబ్లోని కపుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేస్తారు. ఈ ఒప్పందానికి సంబంధించిన మొత్తం విలువ 111.26 మిలియన్ యూఎస్ డాలర్లు. అంటే అంటే దాదాపు రూ. 915 కోట్లు. ఈ ప్రాజెక్ట్ కోసం ఫైనాన్సింగ్ యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా అందిస్తారు. కోచ్లతో పాటు భారతీయ రైల్వేలు బంగ్లాదేశ్కు డిజైన్ నైపుణ్యం, విడిభాగాల మద్దతు మరియు శిక్షణను కూడా అందిస్తాయి. డెలివరీ టైమ్లైన్ ఆర్డర్ తేదీ నుంచి 36 నెలలకు సెట్ చేశారు.
భారతీయ రైల్వే కోచ్లపై 24 నెలల వారంటీని అందించడానికి అంగీకరించింది. భారతీయ రైల్వేలు, బంగ్లాదేశ్ ప్రభుత్వం మధ్య అధికారిక ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ప్రాజెక్ట్ మేక్ ఇన్ ఇండియా చొరవ కిందకు వస్తుంది. ప్రపంచ స్థాయి రైల్వే కోచ్లను తయారు చేసే భారతదేశ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. భారత్ బంగ్లాదేశ్కు కోచ్లను సరఫరా చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో 120 బ్రాడ్-గేజ్ ప్యాసింజర్ కోచ్లు, 36 బ్రాడ్-గేజ్ లోకోమోటివ్లు మరియు 10-మీటర్-గేజ్ లోకోమోటివ్లు ఇప్పటికే డెలివరీ చేశారు. బంగ్లాదేశ్లో నడుస్తున్న రైళ్లలో గణనీయమైన సంఖ్యలో భారతీయ మూలాలు ఉన్నాయి. బంగ్లాదేశ్కు సంబంధించిన నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా తక్కువ ఖర్చుతో కూడిన రైళ్లను తయారు చేసే భారతదేశ సామర్థ్యం ఈ ఆర్డర్లను పొందడంలో కీలకమైన అంశంగా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..