AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPPB Charges: ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ సర్వీస్ ఛార్జీలను సవరించిన ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ సర్వీస్ ఛార్జీలను సవరించింది. సవరించిన రేట్లు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.. పేమెంట్స్..

IPPB Charges: ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ సర్వీస్ ఛార్జీలను సవరించిన ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌
India Post Payment Bank
Subhash Goud
|

Updated on: Nov 05, 2022 | 11:10 AM

Share

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ సర్వీస్ ఛార్జీలను సవరించింది. సవరించిన రేట్లు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.. పేమెంట్స్ బ్యాంక్ కాకుండా వేరే నెట్‌వర్క్‌కు చెల్లింపు చేస్తే, నెలకు ఒక లావాదేవీ ఉచితం. తదుపరి లావాదేవీలకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. వీటిలో నగదు డిపాజిట్లు, ఉపసంహరణలు, మినీ స్టేట్‌మెంట్‌లు ఉన్నాయని పేమెంట్స్ బ్యాంక్ నోటిఫికేషన్‌లో తెలిపింది.

సవరించిన సర్వీస్ ఛార్జీ వివరాలు:

నగదు ఉపసంహరణ, డిపాజిట్ కోసం ఉచిత లావాదేవీ పరిమితి తర్వాత 20 చెల్లించాల్సి ఉంటుంది. వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) చెల్లించాలి. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్‌) మినీ స్టేట్‌మెంట్ కోసం పేమెంట్స్ బ్యాంక్ రూ.5. సర్వీస్ ఛార్జీ వసూలు చేయబడుతుంది.

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) వెబ్‌సైట్ సమాచారం ప్రకారం.. ఏఈపీఎస్‌ అనేది బ్యాంక్ నేతృత్వంలోని మోడల్. ఇది ఆధార్ ప్రామాణీకరణను ఉపయోగించి ఏదైనా బ్యాంకు వ్యాపార కరస్పాండెంట్ ద్వారా మైక్రో ఏటీఎంలో ఆన్‌లైన్ ఇంటర్‌ఆపరబుల్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ లావాదేవీలను అనుమతిస్తుంది. ఈ పద్ధతిలో ఆరు రకాల లావాదేవీలు చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ అంటే..

ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ అనేది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన బ్యాంక్ నేతృత్వంలోని మోడల్. ఈ సిస్టమ్ ద్వారా ఆన్‌లైన్ లావాదేవీలు మైక్రో ఏటీఎం, కియోస్క్, మొబైల్ పరికరాల ద్వారా ఆధార్ ప్రామాణీకరణతో ఏదైనా బ్యాంకు అధీకృత వ్యాపార కరస్పాండెంట్ ద్వారా చేయవచ్చు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆధార్ అనుసంధానిత ఖాతాదారులకు ధృవీకరణ ద్వారా వివిధ సేవలను అందించడానికి ఈ వ్యవస్థను అభివృద్ధి చేసింది. తమ ఖాతాతో తమ ఆధార్ నంబర్‌ను లింక్ చేసిన భారతీయులు ఈ సేవను పొందవచ్చు అని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!