Post Office Scheme: పోస్టాఫీసుల్లో అద్భుతమైన స్కీమ్‌.. ఐదేళ్లలో 14 లక్షల రాబడి

పోస్టాఫీసుల్లో రకరకాల పొదుపు పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఇకప్పుడు ఉత్తరాలకే పరిమితమైన పోస్టాఫీసులు.. ఇప్పుడు ప్రజలకు మరింతగా దగ్గరయ్యే పథకాలను రూపొందిస్తోంది..

Post Office Scheme: పోస్టాఫీసుల్లో అద్భుతమైన స్కీమ్‌.. ఐదేళ్లలో 14 లక్షల రాబడి
Post Office Scheme
Follow us

|

Updated on: Nov 05, 2022 | 8:26 AM

పోస్టాఫీసుల్లో రకరకాల పొదుపు పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఇకప్పుడు ఉత్తరాలకే పరిమితమైన పోస్టాఫీసులు.. ఇప్పుడు ప్రజలకు మరింతగా దగ్గరయ్యే పథకాలను రూపొందిస్తోంది. బ్యాంకుల మాదిరిగానే పొదుపు పథకాలను తీసుకువస్తోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి వచ్చే స్కీమ్స్‌ అందుబాటులో ఉన్నాయి. పోస్టల్‌ కస్టమర్లకు ఎప్పటికప్పుడు సరికొత్త పథకాలను అందిస్తోంది. ఇందులో భాగంగా ఓ స్కీమ్‌ ద్వారా 5 ఏళ్లలో ఏకంగా రూ.14 లక్షల వరకు రాబడి పొందవచ్చు. అయితే పోస్టాఫీసు స్కీమ్స్‌ ఎప్పటికీ సురక్షితంగానే ఉంటాయి. అన్ని పథకాలకు సెక్యూరిటీ ఉంటుంది. అద్భుతమైన రిటర్న్స్‌ ఉంటాయి. ఇలాంటి పథకాలలో ఇన్వెస్ట్‌మెంట్‌ చేయడం వల్ల లక్షాధికారులు కావచ్చు. పోస్టాఫీసు సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీమ్‌లో 7.4 శాతం వడ్డీ లభిస్తోంది. అంటే ఐదేళ్ల కాలంలో 14 లక్షల వరకు సంపాదించుకోవచ్చు.

మీరు రిటైర్‌మెంట్‌ అయి ఉంటే పోస్టాఫీసుల్లో అద్భుతమైన స్కీమ్స్‌ ఉన్నాయి. ఈ పథకంలో ప్రయోజనాలు సేవింగ్స్‌ స్కీమ్‌ అందుబాటులో ఉంది. సంపాదించిన డబ్బును పోస్టాఫీసుల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తే అధిక లాభాలు అందుకోవచ్చు. సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీమ్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌ చేయాలంటే వయసు 60 ఏళ్లు, లేదా అంతకంటే ఎక్కువ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. అంతేకాకుండా వీఆర్ఎస్ తీసుకున్నవాళ్లు కూడా ఈ పథకంలో చేరవచ్చు.

ఐదేళ్లలో 14 లక్షలు ఎలా..?

సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌లో మీరు ఒకేసారి రూ.10 లక్షల వరకు ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తే ఏడాదికి 7.4 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ లెక్కన ఐదేళ్ల తర్వాత మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత మొత్తం రూ.14,28,964 పొందవచ్చు. ఇందులో రూ.4,28,964 వరకు వడ్డీ అందుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

1000 రూపాయలకే ఖాతా ఓపెన్‌

ఈ సీనియర్‌ సిటిజన్స్ స్కీమ్‌లో కనీస మొత్తం రూ.1000లతో ఖాతాను ఓపెన్ చేయవచ్చు. గరిష్టంగా రూ.15 లక్షల వరకు ఇన్వెస్ట్‌మెంట్‌ చేసుకోవచ్చు. అకౌంట్‌ ఓపెన్ చేసేందుకు లక్ష రపాయల కంటే తక్కువ ఉంటే క్యాష్‌ రూపంలో ఇవ్వవచ్చు. లక్షకుపైగా ఉంటే తప్పకుండా చెక్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌ మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు. ఒక వేళ మీరు ఇంకొంత కాలం పొడిగించాలనుకుంటే పొడిగించుకునే వెసులుబాటు ఉంది. మెచ్యూరిటీ తరువాత ఈ స్కీమ్‌ను మరో మూడేళ్లకు పెంచవచ్చు. దీనికోసం పోస్టాఫీసుకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

పన్ను మినహాయింపు:

ఈ సేవింగ్స్‌ స్కీమ్‌లో మీకు వచ్చే వడ్డీ ఏడాదికి రూ.10 వేల కంటే ఎక్కువ ఉన్నట్లయితే టీడీఎస్‌ కట్‌ అవుతుంది. ఈ స్కీమ్‌లో పెట్టిన పెట్టుబడికి సెక్షన్‌ 80సీ ప్రకారం ట్యాక్స్‌ మినహాయింపు ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?