AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ration Card: ఆ రాష్ట్ర రేషన్ కార్డుదారులకు శుభవార్త.. ఈ నెలలో 150 కిలోల ఉచిత బియ్యం

దేశంలో రేషన్‌కార్డుదారులకు ఉచితంగా బియ్యాన్ని అందజేస్తున్న విషయం తెలిసిందే. డిసెంబర్‌ వరకు ఆ ఉచిత రేషన్‌ బియ్యం సరఫరా కొనసాగుతోంది. అయితే ఇప్పుడు రేషన్ కార్డుదారులు..

Ration Card: ఆ రాష్ట్ర రేషన్ కార్డుదారులకు శుభవార్త.. ఈ నెలలో 150 కిలోల ఉచిత బియ్యం
Ration Card
Subhash Goud
|

Updated on: Nov 05, 2022 | 7:51 AM

Share

దేశంలో రేషన్‌కార్డుదారులకు ఉచితంగా బియ్యాన్ని అందజేస్తున్న విషయం తెలిసిందే. డిసెంబర్‌ వరకు ఆ ఉచిత రేషన్‌ బియ్యం సరఫరా కొనసాగుతోంది. అయితే ఇప్పుడు రేషన్ కార్డుదారులు ఏకంగా 150 కిలోల వరకు ఉచిత రేషన్ బియ్యం అందుకోవచ్చు. కానీ దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు అనుకుంటే పొరపాటే. కేవలం ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ప్రజలు మాత్రమే ఈ ఉచిత రేషన్ బియ్యాన్ని అందుకోనున్నారు.  నవంబర్ నెలలో కార్డుదారులకు అధిక మొత్తంలో బియ్యాన్ని అందించనున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ప్రజలకు బంపర్ రైస్ అందుతుంది. నవంబర్‌లో రాష్ట్రంలోని బీపీఎల్ కుటుంబాలకు 45 కిలోల నుంచి 135 కిలోల వరకు బియ్యం అందుతాయి. ఈ బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు పూర్తిగా ఉచితంగా అందజేస్తుంది. ఇది కాకుండా, రాష్ట్రంలోని ప్రాధాన్యత కలిగిన రేషన్ కార్డు హోల్డర్లకు 15 కిలోల నుండి 150 కిలోల బియ్యం లభిస్తుంది. రేషన్ కార్డుదారులకు ఈ బియ్యాన్ని పూర్తిగా ఉచితంగా అందజేయనున్నారు. అయితే ఈ బియ్యం కుటుంబ సభ్యుల ఆధారంగా బియ్యం పంపిణీ జరుగుతుంది.

కిలో రూ.10కి బియ్యం తీసుకోగా..

ఇక్కడ అక్టోబరు వరకు బీపీఎల్ కుటుంబాలు రూ.1కి, ఏపీఎల్ ప్రజలు రూ.10కి బియ్యం కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఛత్తీస్‌గఢ్‌లో లాక్‌డౌన్ సమయంలో ఒక కుటుంబానికి గరిష్టంగా 85 కిలోల బియ్యం ఇచ్చారు. దేశంలోని ప్రజలకు డిసెంబర్ వరకు అదనంగా బియ్యాన్ని ఉచితంగా అందజేస్తామని మోదీ ప్రభుత్వం తరఫున ప్రకటించారు.

కుటుంబ సభ్యుల ప్రాతిపదికన:

కేంద్రం నుంచి బియ్యం పంపిణీ జరుగుతుందని, ఈ బియ్యాన్ని అక్టోబర్ నుంచి పంపిణీ చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. కానీ కొన్ని కారణాల వల్ల అక్టోబర్‌ నెల బియ్యం పంపిణీ కాలేదు. అక్టోబరు-నవంబర్ నెలలకు సంబంధించిన కేంద్ర కోటా బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏకకాలంలో పొందుతోంది. అటువంటి పరిస్థితిలో రేషన్ కార్డు ప్రకారం.. కేంద్రం అదనపు బియ్యం 5 నుండి 50 కిలోల వరకు పంపిణీ చేయబడుతుంది. ఎంత బియ్యం లభిస్తుందో కుటుంబ సభ్యుల ఆధారంగా ఇవ్వనున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అందించే బియ్యం, కేంద్రం అందించే బియ్యం కలిపి అదనంగా పొందనున్నారు.

ఇవి కూడా చదవండి

కేంద్రం ద్వారా రెండు నెలల బియ్యం

ప్రాధాన్యత కార్డుపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ కోటా నుండి పంపిణీ చేయబడిన బియ్యంలో రేషన్ కార్డుదారులకు కుటుంబ సభ్యులను బట్టి 15 నుండి 150 కిలోల బియ్యం లభిస్తుంది. రెండు నెలల అదనపు బియ్యం, ఈ నెల బియ్యం ఒకేసారి పంపిణీ చేయడంతో బియ్యం పరిమాణం పెరిగింది. డిసెంబర్‌లో కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా బియ్యం పంపిణీ చేయనున్నాయి.

బియ్యం పంపిణీలో దుకాణాల వద్ద అవాంతరాలు తలెత్తే అవకాశం ఉంది. ఈ మేరకు కొందరు దుకాణదారులకు నోటీసులు కూడా జారీ చేశారు అధికారులు. అందుకే ఈసారి రేషన్ బియ్యం ఎంత వస్తాయని ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. ఏయే రేషన్‌కార్డుదారులకు ఎంత బియ్యం అందజేస్తారనే సమాచారాన్ని రేషన్ దుకాణదారులు తమ దుకాణాల వెలుపల అతికించాలని కోరారు. వేలి ముద్ర సహాయంతో బియ్యాన్ని తీసుకోవాలని అధికారులు తెలిపారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

యువకుడి దారుణ హత్య.. నిందితుడిని పట్టించిన ఇన్‌స్టా రీల్..!
యువకుడి దారుణ హత్య.. నిందితుడిని పట్టించిన ఇన్‌స్టా రీల్..!
పెళ్లి వార్తలపై స్పందించిన మృణాల్ టీమ్.. ?
పెళ్లి వార్తలపై స్పందించిన మృణాల్ టీమ్.. ?
నా ఉద్దేశం అది కాదు.. తప్పుగా అర్థం చేసుకుంటున్నారు..
నా ఉద్దేశం అది కాదు.. తప్పుగా అర్థం చేసుకుంటున్నారు..
ఇండోర్ వన్డే తర్వాత రో-కో మాయం..గుండెలు బాదుకుంటున్న ఫ్యాన్స్
ఇండోర్ వన్డే తర్వాత రో-కో మాయం..గుండెలు బాదుకుంటున్న ఫ్యాన్స్
విశాఖలో మరో కీలక కార్యాలయం.. కేంద్ర హోం శాఖ నిర్ణయంతో..
విశాఖలో మరో కీలక కార్యాలయం.. కేంద్ర హోం శాఖ నిర్ణయంతో..
రవితేజ, కృష్ణవంశీ ఎందుకు మాట్లాడుకోరు.! ఓపెన్‌గా చెప్పేసిన టాలీవు
రవితేజ, కృష్ణవంశీ ఎందుకు మాట్లాడుకోరు.! ఓపెన్‌గా చెప్పేసిన టాలీవు
నాగోరే నాగోబా.. నేడే మహాపూజ.. అర్థరాత్రి నుండి జాతర షురూ..
నాగోరే నాగోబా.. నేడే మహాపూజ.. అర్థరాత్రి నుండి జాతర షురూ..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా? ఏం జరుగుతుందంటే..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా? ఏం జరుగుతుందంటే..
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?