Indian Railways: మరో 25 ఏళ్లలో 1,00,000 కి.మీ కొత్త రైల్వే ట్రాక్‌లు.. ఇక భారత రైల్వే స్పీడ్ మామూలుగా ఉండదు..

Indian Railways: భారతీయ రైల్వే వేగంగా ప్రగతి సాధిస్తోంది. పాతకాలం నాటి పద్ధతుల నుంచి బయటకొస్తూ ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. అందుకు తగిన విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తోంది.

Indian Railways: మరో 25 ఏళ్లలో 1,00,000 కి.మీ కొత్త రైల్వే ట్రాక్‌లు.. ఇక భారత రైల్వే స్పీడ్ మామూలుగా ఉండదు..
Indian RailwayImage Credit source: TV9 Telugu
Follow us

|

Updated on: Dec 10, 2022 | 2:38 PM

Indian Railways: భారతీయ రైల్వే వేగంగా ప్రగతి సాధిస్తోంది. పాతకాలం నాటి పద్ధతుల నుంచి బయటకొస్తూ ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. అందుకు తగిన విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తోంది. దీంతో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందుతున్నాయి. ఇటీవలే ప్రారంభించిన కొత్త తరహా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు అద్భుత స్పందన రావడంతో ఆ సర్వీసులను మరింత పెంచేందుకు కసరత్తు చేస్తోంది. అందుకనుగుణంగా దేశ వ్యాప్తంగా కొత్త రైల్వే ట్రాక్‌‌ల ఏర్పాటుతో పాటు ఇది వరకే ఉన్న రైల్వే ట్రాక్లను ఆధునికీకరించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. మరో 25 ఏళ్లలో 1,00,000 కిలో మీటర్ల రైల్వే ట్రాక్‌ల ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికను వచ్చే ఆర్థిక బడ్జెట్ (2023-24)లో కేంద్రం ఖరారు చేయనున్నట్లు మింట్ పత్రిక ఓ కథనంలో వెల్లడించింది.

మొత్తం ఖర్చు రూ.15నుంచి 20 ట్రిలియన్లు..

25 ఏళ్లలో 1,00,000 కిలో మీటర్ల కొత్త రైల్వే ట్రాక్‌లను నిర్మించనుండగా.. ప్రస్తుతం ఉన్న ముడి సరుకుల ధరలకనుగుణంగా దీనికి దాదాపు రూ. 15 నుంచి 20 ట్రిలియన్లు ఖర్చయ్యే అవకాశం ఉంది. అంచనవారీగా ఈ ప్రణాళికలను అమలు చేయనున్నారు. ఆ మేరకు ప్రతి ఏటా బడ్జెట్‌లో కేటాయింపులు చేయనుంది కేంద్ర ప్రభుత్వం. దీని ద్వారా  ఆధునిక సాంకేతికతతో ట్రాక్ లకు మెరుగులు దిద్ది.. రైళ్ల వేగాన్ని కూడా గణనీయంగా పెంచేందుకు ‌దోహదపడుతుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు.

రూ. 10,000 కోట్లతో ఎలక్ట్రిఫికేషన్ పనులు..

బ్రాడ్ గేజ్ లైన్లను ఎలక్ట్రిఫికేషన్ చేసేందుకు రూ. 10,000 కోట్లు వచ్చే బడ్జెట్లో కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా దాదాపు 7000 కిలోమీటర్ల మేర ట్రాక్లు కొత్త రూపు సంతరించుకునే అవకాశం ఉంది.  అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరం దేశంలో 4000 కిలోమీటర్ల అత్యాధునిక  కొత్త ట్రాక్లు నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీనికి గానూ రూ. 50,000 కోట్లు  బడ్జెట్‌లో కేటాయింపులు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు కొత్త ట్రాక్ల నిర్మాణానికి బడ్జెట్‌లో కేటాయిస్తున్న నిధులతో పోలిస్తే ఇది రెండింతలు కావడం విశేషం.

ఇవి కూడా చదవండి

400 వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు..

రైల్వే శాఖ ఇటీవల ప్రారంభించిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన రావడంతో రానున్న కాలంలో వీటి సంఖ్య మరింత పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే దాదాపు 300 నుంచి 400 వందే భారత్ రైళ్లను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వీటి ప్రస్తుత వేగం గంటకు 180 కిలోమీటర్లు. అలాగే సాధారణ రైళ్ల వేగం కూడా 160 కి తీసుకొచ్చే యోచన చేస్తున్నారు. అందుకనుగుణంగా దేశ వ్యాప్తంగా ట్రాక్లను ఆధునికీకరిస్తున్నారు.

లాభాల బాటలో రైల్వే..

భారతీయ రైల్వే లాభాల ట్రాక్ పై రయ్యి రయ్య మంటూ దూసుకుపోతోంది. 2021-22 ఆర్ధిక సంవత్సరం రెవెన్యూలో 11 శాతం గ్రోత్ రేట్ కనిపిస్తోంది. ఈ ఏడాది నవంబర్ రూ. 13,560 కోట్లను ఆర్జించింది. గతేడాది ఇదే నవంబర్లో రూ. 12,206 కోట్లు రాబట్టింది. అలాగే రైల్వే కార్గో లో కూడా 8.5 నుంచి 10 శాతం వరకూ రెవెన్యూ గ్రోత్ అంచనా వేయగా.. 12 నుంచి 14 శాతం గ్రోత్ కనిపించింది.

మరిన్ని బిజినెస్ వార్తలు చదవండి

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
మరో ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఢిల్లీతో పోరుకు హైదరాబాద్ రెడీ
మరో ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఢిల్లీతో పోరుకు హైదరాబాద్ రెడీ
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ఉప్పే కాదు, చక్కెర కూడా బీపీకి కారణమవుతుందా.?
ఉప్పే కాదు, చక్కెర కూడా బీపీకి కారణమవుతుందా.?
నెటిజన్లను ఊరిస్తున్న బ్లూక‌ల‌ర్ ఘీ రైస్.. తయారీ వీడియో వైరల్
నెటిజన్లను ఊరిస్తున్న బ్లూక‌ల‌ర్ ఘీ రైస్.. తయారీ వీడియో వైరల్
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ఈల వేసి.. తొడగొట్టి.. మీసం మెలేసి.. సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే
ఈల వేసి.. తొడగొట్టి.. మీసం మెలేసి.. సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే
ఈ పండ్లు తినగానే నీళ్లు తాగుతున్నారా.? ఏమవుతుందో తెలుసా?
ఈ పండ్లు తినగానే నీళ్లు తాగుతున్నారా.? ఏమవుతుందో తెలుసా?
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.