AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాదారులకు షాక్.. ఎంసీఎల్‌ఆర్‌ రేట్ల పెంపు.. రుణంపై EMI భారం

ICICI Bank: దేశంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ఆగస్టులో వరుసగా మూడోసారి రెపో రేటు పెంచాలని నిర్ణయించింది...

ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాదారులకు షాక్.. ఎంసీఎల్‌ఆర్‌ రేట్ల పెంపు.. రుణంపై EMI భారం
Subhash Goud
|

Updated on: Sep 02, 2022 | 4:07 PM

Share

ICICI Bank: దేశంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ఆగస్టులో వరుసగా మూడోసారి రెపో రేటు పెంచాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం సామాన్యుల జీవితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. చాలా పెద్ద బ్యాంకులు తమ రుణ వడ్డీ రేట్లను పెంచాయి. ఇప్పుడు ఈ జాబితాలో దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు ఐసీఐసీఐ పేరు కూడా చేరింది. ICICI బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్లను పెంచాలని నిర్ణయించింది. ఈ పెరిగిన MCLR 1 సెప్టెంబర్ 2022 నుండి అమల్లోకి వచ్చింది.

బ్యాంకు MCLRని ఎంత మేర పెంచింది?

ఐసిఐసిఐ బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్లను పూర్తి 10 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ పెంపు అన్ని టర్మ్ లోన్‌లకు వర్తిస్తుంది. ఆగస్టు 5న జరిగిన సమీక్షా సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటును పెంచుతూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ పెరుగుదల 0.50%. ప్రస్తుతం రెపో రేటు 5.40 శాతంగా ఉంది. గత మూడుసార్లు రెపో రేటు పెంపు నిర్ణయం తర్వాత, రెపో రేటులో మొత్తం 1.40% పెరుగుదల నమోదైంది. ఈ పెంపు నుండి అన్ని బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు (FD రేట్లు), RD, సేవింగ్స్ రేట్లు వంటి తమ రుణాలు మరియు డిపాజిట్ రేట్లను నిరంతరం పెంచుతున్నాయి. ఇది నేరుగా వినియోగదారులపై ప్రభావం చూపుతుంది. కస్టమర్లు ఎఫ్‌డిపై అధిక రాబడిని పొందుతుండగా వారిపై EMI భారం కూడా పెరుగుతోంది.

ఇవి కూడా చదవండి

ICICI వివిధ పదవీకాలాలపై వడ్డీ రేట్లు..

వడ్డీ MCLR రేటును పెంచాలని నిర్ణయించిన తర్వాత హోమ్ లోన్, కార్ లోన్, బిజినెస్ లోన్, పర్సనల్ లోన్ మొదలైన అన్ని రకాల లోన్‌లపై EMI పెరగనుంది . బ్యాంక్ ఓవర్‌నైట్ లోన్‌పై వడ్డీ రేటు 7.55% నుంచి 7.65%కి పెరిగింది. అదే సమయంలో ఒక నెల కాలానికి MCLR 7.65% నుండి 7.75%కి పెరిగింది. అదే సమయంలో మూడు నెలల MCLR 7.70% నుండి 7.80%కి, 6-నెలల నుండి 7.95%, 1 సంవత్సరం MCLR 7.90% నుండి 8.00%కి పెరిగింది.

దేశంలోని రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్లను పెంచాలని నిర్ణయించగా, MCLR ని పెంచింది. దీని వల్ల కస్టమర్లపై రుణ ఈఎంఐ భారం పెరగనుంది. కొత్త రేట్లు 1 సెప్టెంబర్ 2022 నుండి అమలులోకి వచ్చాయి. బ్యాంక్ స్టాక్ మార్కెట్‌కు సమాచారం ఇస్తూ.. MCLR రేటును సుమారు 0.05% పెంచాలని నిర్ణయించినట్లు బ్యాంకు తెలిపింది. ఒక సంవత్సరం MCLR రేటు 5 బేసిస్ పాయింట్లు పెంచబడింది. ఇది 7.65% నుండి 7.70% కి పెరిగింది.