AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan Scheme: ఈ పథకానికి 90 లక్షల మంది కొత్త లబ్ధిదారులు: కేంద్ర ప్రభుత్వం

భారత ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) పథకం కింద వికాస్ భారత్ సంకల్ప్ యాత్ర ద్వారా గత మూడున్నర నెలల్లో దాదాపు 90 లక్షల మంది కొత్త లబ్ధిదారులు చేరడం దీని ఫలితమేనని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. వికాస్ భారత్ సంకల్ప్ యాత్ర (VBSY), నవంబర్ 15, 2023న ప్రారంభించింది కేంద్రం. ఇది ప్రభుత్వ పథకాల గురించి అవగాహన పెంచడానికి కేంద్రం ప్రధాన చొరవ. ప్రభుత్వ

PM Kisan Scheme: ఈ పథకానికి 90 లక్షల మంది కొత్త లబ్ధిదారులు: కేంద్ర ప్రభుత్వం
Pm Kisan
Subhash Goud
|

Updated on: Mar 01, 2024 | 4:11 PM

Share

భారత ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) పథకం కింద వికాస్ భారత్ సంకల్ప్ యాత్ర ద్వారా గత మూడున్నర నెలల్లో దాదాపు 90 లక్షల మంది కొత్త లబ్ధిదారులు చేరడం దీని ఫలితమేనని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. వికాస్ భారత్ సంకల్ప్ యాత్ర (VBSY), నవంబర్ 15, 2023న ప్రారంభించింది కేంద్రం. ఇది ప్రభుత్వ పథకాల గురించి అవగాహన పెంచడానికి కేంద్రం ప్రధాన చొరవ. ప్రభుత్వ పథకాల కింద లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల పూర్తి ప్రయోజనాలను అందించడమే వికాస్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర లక్ష్యం.

90 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు

ఇటీవల, వికాస్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్రలో భాగంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు 2.60 లక్షలకు పైగా గ్రామ పంచాయతీలలోని లబ్ధిదారులందరికీ చేరేలా చూడడానికి 90 లక్షల మంది అర్హులైన రైతులను పీఎం కిసాన్ పథకానికి చేర్చినట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పీఎం కిసాన్ యోజన ఫిబ్రవరి 2, 2019న ప్రారంభం అయ్యింది. దీని కింద అర్హులైన రైతు కుటుంబాలకు ప్రతి నాలుగు నెలలకు మూడు సమాన వాయిదాలలో సంవత్సరానికి రూ.6,000 అందజేస్తారు. ఆధునిక డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా లబ్ధి చేకూరుతుంది.

ఇవి కూడా చదవండి

డిజిటల్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం

దళారుల ప్రమేయం లేకుండా దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ పథకం ప్రయోజనాలు చేరేలా ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా, ప్రభావవంతంగా, పారదర్శకంగా మార్చేందుకు రైతు-కేంద్రీకృత డిజిటల్ మౌలిక సదుపాయాలలో నిరంతర మెరుగుదలలు జరుగుతున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. పీఎం కిసాన్ పోర్టల్ UIDAI, PFMS (పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), ఆదాయపు పన్ను శాఖ పోర్టల్‌లతో ఏకీకృతం చేయబడింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి