AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mukesh Ambani: ముఖేష్ అంబానీ మాస్టర్ ప్లాన్‌.. త్వరలో కార్ల తయారీ కంపెనీలతో రిలయన్స్ పోటీ పడనుందా?

రిలయన్స్ గ్రూప్ ఇప్పుడు వేగంగా విస్తరణ దిశగా పరుగులు తీస్తోంది. రిలయన్స్ చాలా రంగాల్లో చాలా ముందుకు వచ్చింది. గత రెండేళ్లలో కంపెనీ అనేక దిగ్గజ బ్రాండ్‌లను కొనుగోలు చేసింది. రిలయన్స్ కిరాణా, పానీయాలు, ఆర్థిక సంస్థలు, ఇతర రంగాలలోకి విస్తరిస్తోంది. జియో ద్వారా టెలికాం రంగంలో..

Mukesh Ambani: ముఖేష్ అంబానీ మాస్టర్ ప్లాన్‌.. త్వరలో కార్ల తయారీ కంపెనీలతో రిలయన్స్ పోటీ పడనుందా?
Mukesh Ambani
Subhash Goud
|

Updated on: May 12, 2023 | 6:01 PM

Share

రిలయన్స్ గ్రూప్ ఇప్పుడు వేగంగా విస్తరణ దిశగా పరుగులు తీస్తోంది. రిలయన్స్ చాలా రంగాల్లో చాలా ముందుకు వచ్చింది. గత రెండేళ్లలో కంపెనీ అనేక దిగ్గజ బ్రాండ్‌లను కొనుగోలు చేసింది. రిలయన్స్ కిరాణా, పానీయాలు, ఆర్థిక సంస్థలు, ఇతర రంగాలలోకి విస్తరిస్తోంది. జియో ద్వారా టెలికాం రంగంలో కంపెనీ ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇప్పుడు వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ రిలయన్స్ ద్వారా ఫోర్ వీలర్ మార్కెట్లో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. అందుకోసం కంపెనీ ప్లాన్ చేసింది. చర్చలు సఫలమైతే ఈ గ్లోబల్ కార్ తయారీదారు (ఫోర్ వీలర్) బ్రాండ్ రిలయన్స్ ఫ్లీట్‌లో ఉంటుంది.

ఈ కంపెనీ వ్యాపారాన్ని చైనీస్ ఆటో దిగ్గజం SAIC యాజమాన్యంలోని MG మోటార్ స్వాధీనం చేసుకుంటుంది. భారతదేశంలో తన వ్యాపారాన్ని విక్రయించడానికి సిద్ధమవుతోంది. ఆటో రంగంలోని దిగ్గజ కంపెనీలతోనూ ఈ కంపెనీ దీనిపై చర్చిస్తోంది. వీటిలో హీరో గ్రూప్, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్, JSW గ్రూప్ ఉన్నాయి. దీనికి ఇప్పుడు రిలయన్స్ పేరు చేరింది. నివేదికల ఆధారంగా టైమ్స్ ఆఫ్ ఇండియా గురువారం ఈ విషయాన్ని నివేదించింది. ఎంజీ మోటార్ ఈ ఏడాది చివరి నాటికి తన భారత వ్యాపారాన్ని విక్రయించడానికి సిద్ధమవుతోంది. త్వరలోనే ఒప్పందం కుదుర్చుకోవచ్చని కంపెనీ భావిస్తోంది. ప్రస్తుతం ఎంజీ మోటార్స్‌కు అత్యవసరంగా నిధుల అవసరం ఉంది. అందుకే డీల్‌ను పూర్తి చేయడానికి కంపెనీ తొందరపడుతోంది.

MG మోటార్స్ యాజమాన్యం దీని కోసం ప్రత్యేక వాల్యుయేషన్ ఆఫర్‌ను చేసినట్లు మాత్రమే టాక్. అయితే ఈ పరిణామాలన్నింటిపై MG మోటార్స్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. రిలయన్స్, హీరో గ్రూప్, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్, జేఎస్‌డబ్ల్యూ గురించిన నివేదికలు కేవలం పుకార్లు మాత్రమేనని కంపెనీ పేర్కొంది.

ఇవి కూడా చదవండి

భారత్-చైనా సరిహద్దు వివాదం కారణంగా ప్రస్తుతం చైనా కంపెనీలు ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. వివిధ పెట్టుబడులు లేక ఇతర అనుమతుల కోసం వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, కంపెనీ తన మాతృ సంస్థ కోసం నిధులను సేకరించడానికి దాదాపు 2 సంవత్సరాలుగా ప్రయత్నిస్తోంది. కానీ ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రాలేదు. అందుకే నిధులను సేకరించడానికి ఈ ఇతర ఆప్షన్లను అన్వేషిస్తోంది.

MG మోటార్ ఇండియా సీఈవో రాజీవ్ చాబా ప్రకారం.. కంపెనీ దేశంలోని ఆర్థిక సంస్థలు, భాగస్వాములు, ఇతర స్వతంత్ర నిపుణుల ద్వారా భారతీయీకరణపై దృష్టి సారిస్తోంది. వచ్చే రెండు, నాలుగేళ్లలో కంపెనీ షేర్ హోల్డింగ్, బోర్డు, మేనేజ్ మెంట్, సప్లయ్ చెయిన్ భారతీయుల చేతుల్లోకి వస్తాయని వివరించారు. రానున్న రోజుల్లో మార్కెట్ నుంచి రూ.5,000 కోట్లు సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి