Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Recovery: విజయ్ మాల్యా.. నీరవ్ మోదీల ఆస్తుల విక్రయం.. బ్యాంకులు ఎంత రికవరీ చేశాయో తెలుసా?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంటులో కీలక సమాచారం అందించారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ వంటి పరారీలో ఉన్న వారి ఆస్తులను విక్రయించడం ద్వారా బ్యాంకులు భారీగా రికవరీ సాధించాయి.

Bank Recovery: విజయ్ మాల్యా.. నీరవ్ మోదీల ఆస్తుల విక్రయం.. బ్యాంకులు ఎంత రికవరీ చేశాయో తెలుసా?
Nirmala Sitaraman
Follow us
KVD Varma

|

Updated on: Dec 20, 2021 | 9:05 PM

Bank Recovery: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంటులో కీలక సమాచారం అందించారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ వంటి పరారీలో ఉన్న వారి ఆస్తులను విక్రయించడం ద్వారా బ్యాంకులు రూ.13,109.17 కోట్లను రికవరీ చేశాయని సీతారామన్ చెప్పారు. లోక్‌సభలో ‘సప్లిమెంటరీ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్’ చర్చ సందర్భంగా నిర్మలా సీతారామన్ ఒక ప్రశ్నకు సమాధానంగా సమాచారం ఇచ్చారు. వివిధ సమస్యలపై ప్రతిపక్షాల కోలాహలం మధ్య ప్రభుత్వం లోక్‌సభలో గ్రాంట్ల కోసం సప్లిమెంటరీ డిమాండ్‌ల రెండో విడతను ఆమోదించింది.

సప్లిమెంటరీ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ ఆమోదం పొందడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం అదనంగా రూ.3.73 లక్షల కోట్లు వెచ్చించనుంది. అదనపు వ్యయం కోసం ప్రభుత్వం ఈ గ్రాంట్‌ను పార్లమెంటు ఆమోదం కోసం తీసుకొచ్చింది. ఈ అదనపు మొత్తంలో రూ.62,000 కోట్లు ఎయిర్ ఇండియా బాధ్యతను నిర్వహించే కంపెనీకి, రూ.58,430 కోట్లు ఎరువుల సబ్సిడీకి, రూ.53,123 కోట్లు చెల్లింపు ఎగుమతి ప్రోత్సాహకానికి మరియు రూ.22,039 కోట్లు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధికి అందించబడతాయి.

కాగా, నిర్మలా సీతారామన్ ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ దేశం విడిచి పారిపోయిన డిఫాల్టర్ల గురించి చెప్పారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ వంటి పరారీలో ఉన్న వారి ఆస్తులను విక్రయించడం ద్వారా బ్యాంకులు రూ.13,109.17 కోట్లను రికవరీ చేశాయని ఆర్థిక మంత్రి తెలిపారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ లేదా ఈడీ నుంచి ప్రభుత్వం ఈ సమాచారాన్ని పొందింది. తాజా జప్తు జాబితాలో పరారీలో ఉన్న కింగ్‌ఫిషర్ వ్యాపారి విజయ్ మాల్యా ఆస్తి ఉందని, దానిని జూలై 16న విక్రయించామని, దాని నుంచి రూ.792 కోట్లు సమీకరించామని నిర్మలా సీతారామన్ తెలిపారు.

ద్రవ్యోల్బణంపై ప్రభుత్వ సన్నాహాలు..

పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై ప్రతిపక్షాల కోలాహలం మధ్య, ఆహార నూనెలు.. ఇతర నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించడానికి ప్రభుత్వం నిరంతరం ప్రయత్నాలు చేస్తోందని ఆర్థిక మంత్రి అన్నారు. ఇందుకోసం ఈజీవోఎం లేదా మంత్రుల బృందం నిరంతరం సమావేశాలు నిర్వహించి ధరలను తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలో వంటనూనెల ధరలు మరింత తగ్గుతాయని చెప్పారు. డిఫాల్టర్స్ గురించి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, గత ఏడేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులు డిఫాల్టర్ నుండి రూ.5.49 లక్షల కోట్లను రికవరీ చేశాయన్నారు. పారిపోయిన వ్యాపారవేత్తల ఆస్తులను విక్రయించడం ద్వారా ఈ రికవరీ సాధించారు. ఎగవేతదారులు, దేశం విడిచి పారిపోయిన వారి నుంచి డబ్బులు రికవరీ చేశామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పారిపోయిన వారు విదేశాలకు పారిపోయారు, అయితే వారి ఆస్తులను జప్తు చేశారు. జప్తు తర్వాత రికవరీ అయిన డబ్బు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తిరిగి చేరింది. దీనివల్ల బ్యాంకులు గతంలో కంటే ఆర్థికంగా మరింత భద్రతను సంతరించుకున్నాయి.

ప్రస్తుతం బ్యాంకుల్లో ఇన్వెస్టర్ల సొమ్ము భద్రంగా ఉందని నిర్మలా సీతారామన్ అన్నారు. దేశంలో ప్రజాపంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అదనంగా రూ.49,805 కోట్లు వెచ్చించనుంది. ఆహార నిల్వలు మరియు గిడ్డంగుల కోసం ప్రభుత్వం ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తుంది. అదే విధంగా రక్షణ శాఖకు అదనంగా రూ.5,000 కోట్లు, హోం మంత్రిత్వ శాఖకు రూ.4,000 కోట్లు విడుదల చేయనున్నారు.

పారిపోయిన వ్యాపారుల నుంచి దేశ సొమ్మును రికవరీ చేస్తామని ప్రభుత్వం ఎప్పటి నుంచో చెబుతూనే ఉంది. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి సోమవారం సవివరంగా వివరించారు. ఇటీవలి జప్తులో విజయ్ మాల్యాకు చెందిన ఆస్తులు ఉన్నాయని, వాటిని విక్రయించడం ద్వారా సొమ్ము బ్యాంకులకు తిరిగి వచ్చినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి: IPL 2022 Mega Auction: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. వాయిదా పడనున్న మెగావేలం.. ఎందుకంటే?

Stock Market: ఒమిక్రాన్ భయాలతో స్టాక్ మార్కెట్ కుదేలు.. రూ.6,81,0000 కోట్ల మదుపర్ల సందప ఆవిరి

Jaya Bachchan: కోడలికి ఈడీ సమన్లు.. రాజ్యసభలో బీజేపీకి జయాబచ్చన్‌ శాపనార్థాలు