AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashwini Vaishnav: వచ్చే రెండేళ్లలో 50 అమృత్‌ భారత్‌ రైళ్ల తయారీ: మంత్రి అశ్విని వైష్ణవ్

Ashwini Vaishnav: భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం ఎన్నో రకాల సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. పేద కుటుంబాలు తక్కువ ధరల్లో ఎక్కువ దూరం ప్రయాణించే విధంగా కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వచ్చే రెండేళ్లలో 50 వరకు అమృత్‌ భారత్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు..

Ashwini Vaishnav: వచ్చే రెండేళ్లలో 50 అమృత్‌ భారత్‌ రైళ్ల తయారీ: మంత్రి అశ్విని వైష్ణవ్
Subhash Goud
|

Updated on: Jan 11, 2025 | 9:55 AM

Share

వచ్చే రెండేళ్లలో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో 50 అమృత్ భారత్ రైళ్లను తయారు చేయనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం తెలిపారు. అమృత్‌భారత్‌ వెర్షన్‌ 2.0 రైళ్లలో కొత్తగా 12 రకాల మార్పులు చేపట్టినట్లు తెలిపారు. దీని నిర్మాణ సమయంలో పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని చేపడుతున్నట్లు చెప్పారు.ఉంచుకుంటారు. ఈ మేరకు చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ జనరల్‌ మేనేజర్‌ సుబ్బారావుతో కలిసి శుక్రవారం కోచ్‌ ఫ్యాక్టరీని సందర్శించారు. అమృత్‌ భారత్‌ రైళ్లతో పాటు, వందేభారత్‌ 2.0 స్లీపర్‌ రైళ్ల తయారీని పరిశీలించారు.

అలాగే తమిళనాడు ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయాలని అన్నారు. కేంద్రం, ఆయన మంత్రిత్వ శాఖ ప్రజల సంక్షేమం కోసం చర్యలు తీసుకోవడానికి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. కాగా, అమృత్ భారత్ మొదటి ఎడిషన్‌ను 2024 జనవరిలో ప్రధాని మోదీ ప్రారంభించారు. అమృత్ భారత్ రెండో ఎడిషన్ రైళ్లను ఇక్కడ తయారు చేయడం చాలా ఆనందంగా ఉందని, గత ఒక సంవత్సరం అనుభవం ఆధారంగా, అమృత్ భారత్ రెండవ ఎడిషన్‌లో అనేక రకాల మార్పు చేర్పులు చేస్తున్నట్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి

సెమీ ఆటోమేటిక్‌ కప్లెట్స్‌, మాడ్యులర్‌ టాయిలెట్స్‌, ఎమర్జెన్సీ టాక్‌ బ్యాక్‌ ఫీచర్‌, ఎమర్జెన్సీ బ్రేక్‌ సిస్టమ్‌, వందే భారత్‌ రైళ్ల తరహాలో నిరంతరం వెలిగే లైట్లు, ఛార్జింగ్‌ పోర్టులతో పాటు బెర్తుల డిజైన్‌ కూడా మార్చినట్లు వెల్లడించారు. ప్యాంట్రీ కారును సమూలంగా మార్చినట్లు తెలిపారు. అయితే తక్కువ ఖర్చుతో దూర ప్రాంతాలకు వెళ్లే వారికి మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని అందించడమే తమ లక్ష్యమని వెల్లడించారు. అమృత్‌ భారత్‌ రైళ్లలో చేపడుతున్న మార్పుల గురించి ఎక్స్‌లో ఖాతాలో ఓ పోస్టు కూడా చేశారు మంత్రి.

రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి:

ఈ రైళ్ల నిర్మాణంలో తక్కువ ఆదాయం, దిగువ మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని చేపడుతున్నట్లు మంత్రి వైష్ణవ్ తెలిపారు. రాబోయే రెండేళ్లలో అమృత్ భారత్ రెండో ఎడిషన్‌కు చెందిన 50 రైళ్లను (ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో) తయారు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

ఇది కూడా చదవండి: PM Modi: కష్టసుఖాల్లో మొదట కాల్‌ చేసేది ఎవరికో చెప్పిన మోదీ.. తొలి పాడ్‌కాస్ట్‌లో ఆసక్తికర విషయాలు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..