AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flying Electric Car : త్వరలో మార్కెట్లోకి ఎగిరే కార్లు..! దేశంలోనే మొట్టమొదటి ఎయిర్ టాక్సీని చూపించిన ఆనంద్‌ మహీంద్రా..

Eplane చెన్నైలో ఉన్న టెక్ స్టార్టప్ కంపెనీ. ఆమె ఫ్లయింగ్ ఎలక్ట్రిక్ టాక్సీని అభివృద్ధి చేస్తోంది. గత ఏడాది మే 23న ఎలక్ట్రిక్ విమానాల తయారీకి ఏవియేషన్ సెక్టార్ రెగ్యులేటర్ డీజీసీఏ నుంచి అనుమతి లభించింది. దీంతో ఎప్లేన్ కంపెనీ దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ విమానాల తయారీ కంపెనీగా అవతరించింది.

Flying Electric Car : త్వరలో మార్కెట్లోకి ఎగిరే కార్లు..! దేశంలోనే మొట్టమొదటి ఎయిర్ టాక్సీని చూపించిన ఆనంద్‌ మహీంద్రా..
Flying Electric Car
Jyothi Gadda
|

Updated on: May 11, 2024 | 4:32 PM

Share

మహీంద్రా గ్రూప్ ఛైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. వివిధ విషయాలపై ఆసక్తికర ట్వీట్లను షేర్‌ చేస్తూ నెటిజన్లను ఎక్కువగా ఆకర్షిస్తుంటారు. అందుకే ఆయనకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు అతను దేశంలోనే మొట్టమొదటి ఫ్లయింగ్ ట్యాక్సీని చూపించారు. ఆనంద్ మహీంద్రా ఈ ఎగిరే కారు ఫీచర్ల గురించిన సమాచారాన్ని కూడా పంచుకున్నారు. భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ టాక్సీని తయారు చేసేందుకు ఐఐటీ మద్రాస్ ఈప్లేన్ కంపెనీని ఏర్పాటు చేస్తోందని ఆయన వెల్లడించారు. రవాణా ప్రపంచంలో ఇది ఒక ఆవిష్కరణ అని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఏడాది నాటికి భారత్‌లో విడుదలయ్యే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.

ఆనంద్‌ మహీంద్రా తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో ఎయిర్ టాక్సీ ఫోటోలను షేర్‌ చేశారు. క్యాప్షన్‌లో ఇది భవిష్యత్ రవాణా అని రాశారు. వచ్చే ఏడాది నాటికి దేశంలో ఈ ఎయిర్ ట్యాక్సీలు ప్రారంభమవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ePlane కంపెనీ ప్రస్తుతం ఈ సాంకేతికత అభివృద్ధిలో నిమగ్నమై ఉందని ఆయన రాశారు. ఇందుకోసం మద్రాస్‌ ఐఐటీ పూర్తి మద్దతు ఇస్తోందన్నారు. దేశవ్యాప్తంగా యువత ముందుకు సాగేందుకు ఐఐటీ మద్రాస్ వంటి సంస్థలు దోహదపడుతున్నాయన్నారు.

ఇవి కూడా చదవండి

Eplane చెన్నైలో ఉన్న టెక్ స్టార్టప్ కంపెనీ. ఆమె ఫ్లయింగ్ ఎలక్ట్రిక్ టాక్సీని అభివృద్ధి చేస్తోంది. గత ఏడాది మే 23న ఎలక్ట్రిక్ విమానాల తయారీకి ఏవియేషన్ సెక్టార్ రెగ్యులేటర్ డీజీసీఏ నుంచి అనుమతి లభించింది. దీంతో ఎప్లేన్ కంపెనీ దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ విమానాల తయారీ కంపెనీగా అవతరించింది.

Eplane E200 అనేది టూ సీటర్ ఎయిర్‌క్రాఫ్ట్. నగరాల్లో సేవలు అందించేందుకు దీన్ని నిర్మిస్తున్నారు. దీని పరిధి 200 కి.మీ. ఇది ఒకే ఛార్జ్‌పై అనేకసార్లు ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ eVTOL విమానం నిలువు టేకాఫ్, హోవర్, ల్యాండింగ్ చేయగలదు. ఈ కంపెనీని 2019లో ప్రొఫెసర్ అత్యనారాయణన్ చక్రవర్తి స్థాపించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..