అసాధారణ పరిస్థితుల దృష్ట్యా, సమస్యలతో ముందుకు వెళ్లడం నైతికంగా సరైనది కాదని అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ బోర్డు భావించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ‘అదానీ కంపెనీపై పెట్టుబడిదారుల ఆసక్తి చాలా ముఖ్యమైనది. అందువల్ల ఏదైనా కారణాల వల్ల సంభవించే ఆర్థిక నష్టాల నుంచి వారిని రక్షించడానికి, FPOతో ముందుకు వెళ్లకూడదని బోర్డు నిర్ణయించుకుంది’ అని అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది.
Adani enterprises not to proceed with the FPO of shares worth Rs 20,000 Crore pic.twitter.com/uDCqf1gPHq
— ANI (@ANI) February 1, 2023
ఇంకా ‘బలమైన లావాదేవీలతో, సురక్షితమైన ఆస్తులతో మా బ్యాలెన్స్ షీట్ చాలా మెరుగ్గా ఉంది. మా రుణానికి సేవ చేయడంలో మాకు నిష్కళంకమైన ట్రాక్ రికార్డ్ ఉంది. ఈ నిర్ణయం మా ప్రస్తుత కార్యకలాపాలు, భవిష్యత్తు ప్రణాళికలపై ఎలాంటి ప్రభావం చూపదు’ అని కూడా తెలిపింది అదానీ కంపెనీ.