AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Faster Payments: చెల్లింపులను వేగవంతం చేసేలా నయా వ్యవస్థ.. ఆర్‌బీఐ గవర్నర్ ఏమంటున్నారంటే..?

ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది ఆన్‌లైన్ వ్యాపారి చెల్లింపు లావాదేవీల కోసం పురాతన మోడ్‌లలో ఒకటి. అలాగే ఆదాయపు పన్ను, బీమా ప్రీమియం, మ్యూచువల్ ఫండ్ చెల్లింపులు, ఈ-కామర్స్ వంటి చెల్లింపుల కోసం ఇది ఒక ప్రాధాన్య ఛానెల్. ప్రస్తుతం చెల్లింపు అగ్రిగేటర్‌ల (పీఏ) ద్వారా ప్రాసెస్ చేసిన అలాంటి లావాదేవీలు పరస్పరం పనిచేయవు, అంటే  వివిధ ఆన్‌లైన్ వ్యాపారుల ప్రతి పీఏతో ఒక బ్యాంకు విడివిడిగా ఏకీకృతం కావాలి. బహుళ సంఖ్యలో చెల్లింపు అగ్రిగేటర్‌లను బట్టి ప్రతి బ్యాంక్‌కి ఒక్కో పీఏతో కలిసిపోవడం కష్టం.

Faster Payments: చెల్లింపులను వేగవంతం చేసేలా నయా వ్యవస్థ.. ఆర్‌బీఐ గవర్నర్ ఏమంటున్నారంటే..?
Rbi 4
Nikhil
|

Updated on: Mar 05, 2024 | 6:45 PM

Share

ఇటీవల కాలంలో ఆన్‌లైన్ చెల్లింపులు భారతదేశంలో వేగంగా వృద్ధి చెందాయి. ముఖ్యంగా యూపీఐ సేవలు ఆన్‌లైన్ చెల్లింపులను వేరే దశకు తీసుకెళ్లాయి. అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్ విషయానికి వస్తే ఈ తరహా చెల్లింపులు ఎక్కువ మొత్తంలో లావాదేవీలు చేసేవారికి అనువుగా ఉంటాయి. ఇప్పుడు తాజాగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ కోసం ఇంటర్‌ఆపరబుల్ పేమెంట్ సిస్టమ్‌ను 2024లో ప్రారంభించే అవకాశం ఉందని ఇది వ్యాపారులకు త్వరగా నిధులను సెటిల్ చేయడానికి వీలు కల్పిస్తుందని అన్నారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది ఆన్‌లైన్ వ్యాపారి చెల్లింపు లావాదేవీల కోసం పురాతన మోడ్‌లలో ఒకటి. అలాగే ఆదాయపు పన్ను, బీమా ప్రీమియం, మ్యూచువల్ ఫండ్ చెల్లింపులు, ఈ-కామర్స్ వంటి చెల్లింపుల కోసం ఇది ఒక ప్రాధాన్య ఛానెల్. ప్రస్తుతం చెల్లింపు అగ్రిగేటర్‌ల (పీఏ) ద్వారా ప్రాసెస్ చేసిన అలాంటి లావాదేవీలు పరస్పరం పనిచేయవు, అంటే  వివిధ ఆన్‌లైన్ వ్యాపారుల ప్రతి పీఏతో ఒక బ్యాంకు విడివిడిగా ఏకీకృతం కావాలి. బహుళ సంఖ్యలో చెల్లింపు అగ్రిగేటర్‌లను బట్టి ప్రతి బ్యాంక్‌కి ఒక్కో పీఏతో కలిసిపోవడం కష్టం. అలాగే ఈ  లావాదేవీలకు సంబంధించిన నియమాల కారణంగా, వ్యాపారులు చెల్లింపుల వాస్తవ రసీదులో జాప్యంత సెటిల్మెంట్ రిస్క్‌లు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ తాజా చర్యల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

వ్యాపారుల ఇబ్బందులకు దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐకు చెల్లింపుల విజన్ 2025 ఇంటర్నెట్ బ్యాంకింగ్ లావాదేవీల కోసం ఇంటర్‌ఆపరబుల్ చెల్లింపు వ్యవస్థను ప్రవేశ పెడుతంది. ఆర్‌బీఐ ఎన్‌పీసీఐ తరహాలో భారత్ బిల్‌పే లిమిటెడ్ (ఎన్‌బీబీఎల్)కి అటువంటి ఇంటర్‌ఆపరబుల్ సిస్టమ్‌ను అమలు చేయడానికి ఆమోదం తెలిపింది. ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ కోసం ఈ ఇంటర్‌ఆపరబుల్ పేమెంట్ సిస్టమ్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. ఈ కొత్త వ్యవస్థ వ్యాపారులకు నిధులను త్వరితగతిన సెటిల్ చేయడానికి దోహదపడుతుంది. ముఖ్యంగా డిజిటల్ చెల్లింపులపై వినియోగదారుల విశ్వాసాన్ని మరింత పెంచుతుంది.

దేశంలోని పేమెంట్ సిస్టమ్‌లలో ఫ్లాగ్‌షిప్ అయిన యూపీఐ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగవంతమైన చెల్లింపు వ్యవస్థగా మారిందని గవర్నర్ దాస్ పేర్కొన్నారు. డిజిటల్ చెల్లింపులలో యూపీఐ వాటా 2023లో 80 శాతానికి చేరుకుంది. స్థూల స్థాయిలో యూపీఐ లావాదేవీల పరిమాణం సీవై-2017లో 43 కోట్ల నుంచి సీవై-2023లో 11,761 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం యూపీఐ ఒక రోజులో దాదాపు 42 కోట్ల లావాదేవీలను ప్రాసెస్ చేస్తోంది. పారదర్శకత, వాడుకలో సౌలభ్యం, అన్నింటికీ మించి భద్రత అనే మూలస్తంభాలపై డిజిటల్ చెల్లింపులపై నమ్మకం ఏర్పడిందని నిపుణులు చెబుతున్నాు. కాబట్టి ఈ వ్యవస్థకు సంబంధించి భద్రతను బలోపేతం చేయడం చాలా ముఖ్యమైనదని గవర్నర్ అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..