నడిరోడ్డుపై కాల్పులు.. భయంతో పారిపోయిన జనం… వీడియో
దేశ రాజధానిలో రోజురోజుకు నేరాలు పెరిగిపోతున్నాయి. ఢిల్లీలో ఓ వ్యక్తిపై దుండగులు పట్టపగలే కాల్పులు జరిపారు. రోహిణిలోని సెక్టార్-11లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి పరారైపోయారు. ఈ సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన బాధితుడిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. కాల్పులు జరిగిన సమయంలో అక్కడున్న వారంతా భయంతో పరుగులు పెట్టారు. ఈ […]

దేశ రాజధానిలో రోజురోజుకు నేరాలు పెరిగిపోతున్నాయి. ఢిల్లీలో ఓ వ్యక్తిపై దుండగులు పట్టపగలే కాల్పులు జరిపారు. రోహిణిలోని సెక్టార్-11లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి పరారైపోయారు. ఈ సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన బాధితుడిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. కాల్పులు జరిగిన సమయంలో అక్కడున్న వారంతా భయంతో పరుగులు పెట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
#WATCH Delhi: A man was shot at by unknown assailants in Rohini, Sector-11, yesterday. He has been admitted to a hospital in critical condition. pic.twitter.com/Zvrx5hDqBV
— ANI (@ANI) May 18, 2019



