AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే..

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి. వివేకా మర్డర్ కేసును సీబీఐ దర్యాప్తు వేగవంతమైన క్రమంలో సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలిచ్చింది.

YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే..
Ys Viveka Murder Case
Shaik Madar Saheb
|

Updated on: Apr 21, 2023 | 1:12 PM

Share

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి. వివేకా మర్డర్ కేసును సీబీఐ దర్యాప్తు వేగవంతమైన క్రమంలో సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలిచ్చింది. వివేకా కూతురు సునీత పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై స్టే విధించింది. దీంతోపాటు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ఈ క్రమంలో వైఎస్ సునీత, ఎంపీ అవినాష్ రెడ్డి తరుపు న్యాయవాదుల మధ్య వాడీవేడి వాదనలు కొనసాగాయి. ఉత్తర్వులపై స్టే విధిస్తే అవినాశ్‌ను సీబీఐ అరెస్టు చేస్తుందని అవినాశ్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. దీనిని పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధిస్తూనే, సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టే వరకు అరెస్టు చేయవద్దంటూ కొంత రిలీఫ్ ఇచ్చింది.

వైఎస్ వివేకానంద రెడ్డి రక్తపుమడుగులో పడి ఉంటే గుండెపోటుతో చనిపోయారని వైఎస్ అవినాశ్ రెడ్డి అన్నారని.. వైఎస్ సునీత తరుపు న్యాయవాదులు వివరించారు. సీబీఐ కేసు టేకప్ చేసినప్పుడు చాలా సమస్యలు ఎదురయ్యాయి.. చివరకు విచారణను ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేయాల్సి వచ్చింది. సీబీఐ స్పెషల్ టీమ్ ఏర్పాటు చేశాక అవినాశ్ రెడ్డి తండ్రి సహా ఇద్దరు అరెస్ట్ అయ్యారు. అవినాశ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా ఒక మధ్యంతర ఉత్తర్వు ద్వారా రిలీఫ్ ఇచ్చిందన్నారు. ఇది చాలా అభ్యంతరకరంగా ఉంది.. దర్యాప్తు సమయంలో హత్యకు బహుళ కారణాలు, ఉద్దేశాలు ఉన్నాయని గుర్తించింది. అవినాశ్ రెడ్డిని ఎలా ప్రశ్నించాలో చెబుతూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. రాతపూర్వక ప్రశ్నలు ఉండాలని, వాటిని అవినాశ్ రెడ్డికి అందజేయాలని సూచించిందని వివరించారు.

ఇదిలాఉంటే.. హైకోర్టు ఆదేశాలతో ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ కొనసాగుతోంది. వరుసగా మూడోరోజు ఎంపీ అవినాష్ రెడ్డి కోఠిలోని సీబీఐ కార్యాలయానికి చేరుకుని విచారణకు హాజరయ్యారు. సీబీఐ విచారణ కొనసాగుతున్న క్రమంలోనే సుప్రీంకోర్టు హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..

Follow Us
అక్షయ తృతీయ రోజున బంగారం ఎందుకు కొంటారు.. పెద్ద కథే ఉందిగా..
అక్షయ తృతీయ రోజున బంగారం ఎందుకు కొంటారు.. పెద్ద కథే ఉందిగా..
యూపీఐలో పొరపాటుగా డబ్బులు వేరే వ్యక్తికి పంపితే ఏం చేయాలి..?
యూపీఐలో పొరపాటుగా డబ్బులు వేరే వ్యక్తికి పంపితే ఏం చేయాలి..?
"వాడి జీవితం ఇలా అవుతుంది అని కలలో కూడా అనుకోలేదు"
గ్యాస్ సిలిండర్లకు గుడ్ బై..నీటితో పనిచేసే సరికొత్త స్టవ్ మీ కోసం
గ్యాస్ సిలిండర్లకు గుడ్ బై..నీటితో పనిచేసే సరికొత్త స్టవ్ మీ కోసం
పోలీస్ స్టేషన్ పక్కనే దారుణం.. ఏటీఎం మిషన్‌తో పరారైన దుండగులు
పోలీస్ స్టేషన్ పక్కనే దారుణం.. ఏటీఎం మిషన్‌తో పరారైన దుండగులు
జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ ఒలవడం..
జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ ఒలవడం..
బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
బ్యాంక్ అకౌంట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.. ఎలా అంటే..
బ్యాంక్ అకౌంట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.. ఎలా అంటే..
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్