Watch Video: ‘టీడీపీ, జనసేన మేనిఫెస్టోలో బీజేపీలోగో లేదు’.. వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని
జనసేన పార్టీకి గుర్తూ లేదు, గుర్తింపు లేదని అంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఊరు, వాడ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కోసమే పవన్ పనిచేస్తున్నారన్న వెలంపల్లి.. జనసేన జెండాను చంద్రబాబుకు తాకట్టు పెట్టారని విమర్శించారు. టీడీపీ 2014, 2024 మేనిఫెస్టోకు ఏమైన తేడా ఉందా? అని ప్రశ్నించారు.

జనసేన పార్టీకి గుర్తూ లేదు, గుర్తింపు లేదని అంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఊరు, వాడ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కోసమే పవన్ పనిచేస్తున్నారన్న వెలంపల్లి.. జనసేన జెండాను చంద్రబాబుకు తాకట్టు పెట్టారని విమర్శించారు. టీడీపీ 2014, 2024 మేనిఫెస్టోకు ఏమైన తేడా ఉందా? అని ప్రశ్నించారు. జూన్ 4 తర్వాత పవన్, చంద్రబాబులను ప్రజలు చెత్తబుట్టలో వేస్తారన్నారు. గ్లాస్ గుర్తు లేని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఓడిస్తానంటున్నారని ఎద్దేవా చేశారు.
వెల్లంపల్లి వీడియో..
గడిచిన 10ఏళ్ల కాలంగా జనసేన పార్టీ జెండాను, గాజు గ్లాసును పట్టుకున్నారని ఆ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఆ గ్లాసును అందరికీ ఇచ్చేసి.. జెండాను చంద్రబాబుకు తాకట్టు పెట్టేశావని విమర్శించారు. ఈ సందర్భంగా విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని కూడా స్పందించారు. టీడీపీని బీజేపీ నమ్మడం లేదన్నారు కేశినేని నాని. అందుకే టీడీపీ, జనసేన మేనిఫెస్టోలో బీజేపీలోగో లేదన్నారు. టీడీపీని బీజేపీయే నమ్మడం లేదు, ప్రజలేం నమ్ముతారని అంటున్నారు కేశినేని నాని.
కేశినేని నాని వీడియో..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








