Watch Video: కూటమి మేనిఫెస్టోలో సాధ్యంకాని హామీలు.. బీజేపీ నేత IYR సంచలన వ్యాఖ్యలు
AP Elections 2024: జమిలి ఎన్నికల వేళ టీడీపీ, జనసేన తీరుపై బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తంచేస్తూ బహిరంగ వ్యాఖ్యలు చేయడం ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. ఏపీలో విడుదల చేసిన ఉమ్మడి మేనిఫెస్టోపై బీజేపీ నేత IYR కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Alliance Manifesto in Andhra Pradesh: జమిలి ఎన్నికల వేళ టీడీపీ, జనసేన తీరుపై బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తంచేస్తూ బహిరంగ వ్యాఖ్యలు చేయడం ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. ఏపీలో విడుదల చేసిన ఉమ్మడి మేనిఫెస్టోపై బీజేపీ నేత IYR కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన విడుదల చేసిన మేనిఫెస్టోతో బీజేపీకి సంబంధమే లేదన్నారు. మేనిఫెస్టోలో సాధ్యంకాని, అలవికాని హామీలు ఉన్నాయని పెదవి విరిచారు.
అటు మరో నేత జీవీఎల్ కూడా అది టీడీపీ, జనసేన మేనిఫెస్టో మాత్రమే అన్నారు. మోదీ ఇమేజ్ను ఏపీలో టీడీపీ, జనసేన సరిగా వాడుకోవడం లేదని జీవీఎల్ అసహనం వ్యక్తంచేశారు. ఏపీలో బీజేపీకి 18శాతం ఓటు బ్యాంక్ ఉందన్నారు. అనేక విషయాల్లో బీజేపీకి జాతీయ విధానం ఉన్నందునే ఉమ్మడి మేనిఫెస్టోలో భాగస్వామి కాలేదన్నారు జీవీఎల్.
ఆ ఒక్క మాటతో.. ఆ మేనేజర్ లేచి వెళ్లిపోయాడు !
కొమ్ముతో జీపును ఎత్తిపడేసింది! భయంతో కేకలు వేసిన టూరిస్ట్లు..
10 నిమిషాల డెలివరీ కంటే ప్రశాంతతే ముఖ్యం!
కరెంట్ లేకుండానే కూలింగ్! ఇక ఏసీతో పనిలేదు
వామ్మో... ఆ ఊరి నిండా పాములే!
భీమేశ్వరాలయ సమీపంలో అరుదైన శ్వేతనాగు.. ప్రత్యక్షం
కుక్కను వెంబడిస్తూ వెళితే.. బయటపడిన 18 వేల ఏళ్ల రహస్య ప్రపంచం

