AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: తన బిడ్డల కోసం తల్లి ఇంటికే నిప్పు పెట్టిన కుమార్తె… ఏం జరిగిందంటే..

రెండు రోజుల క్రితం అర్దరాత్రి సమయంలో తన మేనల్లుడి సాయంతో రోశమ్మ ఉన్న ఇంటికి నిప్పు పెట్టింది. సకాలంలో మంటలను గమనించిన రోశమ్మ ఇద్దరు బిడ్డలను తీసుకుని ప్రమాదం నుండి బయటపడింది. అయితే నిప్పు పెడుతున్న విజువల్స్ సిసి కెమెరాలో రికార్డు కావడంతో అసలు గుట్టు బయట పడింది.

Andhra Pradesh: తన బిడ్డల కోసం తల్లి ఇంటికే నిప్పు పెట్టిన కుమార్తె... ఏం జరిగిందంటే..
Fire
T Nagaraju
| Edited By: Jyothi Gadda|

Updated on: May 16, 2024 | 7:58 PM

Share

తల్లి ఇంటికే నిప్పు పెట్టింది ఓ కుమార్తె. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసకుంది. సుజాత అనే మహిళ తన తల్లి ఉంటున్న ఇంటికి నిప్పుపెట్టింది. భర్త నుండి విడిపోయిన సుజాత మరో వ్యక్తితో సహజీవనం చేస్తుంది. అయితే, అప్పటికే సుజాతకు తన మొదటి భర్తకు ఇద్దరు ఆడబిడ్డలున్నారు. వీడాకులు తీసుకున్న తర్వాత మరొక వ్యక్తితో సుజాత సహజీవనం చేస్తోంది. అయితే ఆమె ఇద్దరి బిడ్డలు సుజాత తల్లి వద్దే ఉంటున్నారు. తన బిడ్డలను తన వద్దకు పంపాలని అనేక సార్లు సుజాత తన తల్లి రోశమ్మతో గొడవ పడింది. అయితే అందుకు రోశమ్మ ఒప్పుకోలేదు. దీంతో తన తల్లిపైనే కక్ష పెంచుకుంది సుజాత. రెండు రోజుల క్రితం అర్దరాత్రి సమయంలో తన మేనల్లుడి సాయంతో రోశమ్మ ఉన్న ఇంటికి నిప్పు పెట్టింది. సకాలంలో మంటలను గమనించిన రోశమ్మ ఇద్దరు బిడ్డలను తీసుకుని ప్రమాదం నుండి బయటపడింది. అయితే నిప్పు పెడుతున్న విజువల్స్ సిసి కెమెరాలో రికార్డు కావడంతో అసలు గుట్టు బయట పడింది.

తెనాలిలోని చెంచుపేటకు చెందిన రోశమ్మ ఒకరి ఇంట్లో పనిచేస్తూ జీవిస్తుంది. యజమాని స్థలంలోనే పూరిల్లు నిర్మించుకుని నివస్తుంది. ఆమె కుమార్తె సుజాత కూడా అక్కడకు దగ్గరలోనే భర్త నుండి విడిపోయి మరొక వ్యక్తితో కలిసి సహజీవనం చేస్తోంది. అయితే రోశమ్మకు, సుజాతకు మధ్య విబేధాలున్నాయి. ఈ క్రమంలోనే తన మనమరాళ్లను తన వద్దే ఉంచుకుంటుంది. అయితే తన వద్దకు పంపాలని అనేక సార్లు సుజాత తల్లితో గొడవ పడింది. అందుకు రోశమ్మ ఒప్పుకోలేదు. ఈ క్రమంలోనే తల్లిపైనే పగ పెంచుకుంది.

రెండు రోజుల క్రితం తన మేనల్లుడితో కలిసి అర్దరాత్రి రోశమ్మ నివిసిస్తున్న ఇంటికి నిప్పు పెట్టింది. అయితే సకాలంలో గమనించిన స్థానికులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. అంతేకాకుండా సుజాతతో సహజీవనం చేస్తున్న వ్యక్తిని పట్టుకుని చితకబాదారు. అనంతరం అందరిని పోలీసులకు అప్పగించారు. ఇంటికి నిప్పు పెట్టిన విజువల్స్ సిసి కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ విజువల్స్ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..