AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag: ప్రభుత్వ ధనం, సమయం వేస్ట్ చేసిన సాయిప్రియపై కేసు నమోదు.. ఏకంగా కోర్టు అనుమతితో

ప్రభుత్వ వర్గాలను మిస్‌లీడ్ చేసిన సాయిప్రియ, ఆమె ప్రియుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అందుకోసం కోర్టు అనుమతి సైతం తీసుకున్నారు.

Vizag: ప్రభుత్వ ధనం, సమయం వేస్ట్ చేసిన సాయిప్రియపై కేసు నమోదు.. ఏకంగా కోర్టు అనుమతితో
Sai Priya
Ram Naramaneni
|

Updated on: Aug 29, 2022 | 9:01 AM

Share

Andhra Pradesh: విశాఖ సాయిప్రియ గుర్తుందా! అదేనండీ.. భర్తతో పాటు బీచ్‌కు వెళ్లి.. చెప్పాపెట్టకుండా ప్రియుడితో కలిసి వెళ్లిపోయిన సాయిప్రియకు ఇప్పుడు కష్టాల కాలం ఎదురవుతోంది. అవును విశాఖ పోలీసులు కోర్టు అనుమతితో సాయిప్రియపై కేసు పెట్టారు. ఐపీసీ సెక్షన్లు 420, 417, 494, 202 రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేశారు. భర్తను వంచించడం, భర్తకు విడాకులు ఇవ్వకుండా రెండోపెళ్లి చేసుకోవడం, తన గురించి వెతుకుతున్నారని తెలిసీ బాధ్యతారాహిత్యంగా క్షేమ సమాచారం ఇవ్వకపోవడంపై కేసు పెట్టారు. అంతేకాదు.. పోలీస్, నేవీ, కోస్ట్‌గార్డ్‌ విభాగాలను తప్పుదోవ పట్టించారని.. ప్రభుత్వ డబ్బు, టైమ్ వేస్ట్ చేేసిందని అధికారులు ఆగ్రహంతో ఉన్నారు.

వివరాలు ఇవి…

సాయిప్రియ, శ్రీనివాస్ భార్యభర్తలు. సాయి ప్రియ.. విశాఖ సంజీవనగర్‌లో ఉంటుండగా.. శ్రీనివాస్ హైదరాబాద్‌లో జాబ్ చేస్తున్నాడు. జులై 22న వీరి మ్యారేజ్ డే. దీంతో సరదాగా గడేపేందుకు వైజాగ్ ఆర్కే బీచ్‌కు వచ్చారు.  ఈ క్రమంలో శ్రీనివాస్ ఫోన్ మాట్లాడుతుండగా.. ఒక్కసారిగా అదృశ్యం అయ్యింది సాయి ప్రియ. ఎంత వెతికినా కనిపించలేదు. ఆమె అల్లలో కొట్టుకుపోయిందని భావించిన భర్త శ్రీనివాస్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. దీంతో రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది. కోస్ట్‌ల్ బోట్స్, నేవీ హెలికాప్టర్ సైతం రంగంలోకి దిగారు. గజ ఈతగాల్లో సముద్రంలో జల్లెడ పట్టారు. 2 రోజుల తర్వాత ఆమె ప్రియుడితో వెళ్లిపోయినట్లు తేలింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..