Kesineni Nani: బీజేపీ నేత సత్య కుమార్‌కు ఎంపీ కేశినేని నాని పరామర్శ.. ఫైర్ అవుతున్న తెలుగు తమ్ముళ్లు.. ఎందుకంటే..

బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ యాదవ్ కారుపై రాళ్ల దాడి ఘటన ఏపీ రాజకీయాల్లో కలకలం రేపిన విషయం తెలిసిందే. మందడం సమీపంలో జరిగిన ఈ ఘటనపై బీజేపీ సహా.. విపక్ష పార్టీల నేతలు సైతం అధికార పార్టీ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.

Kesineni Nani: బీజేపీ నేత సత్య కుమార్‌కు ఎంపీ కేశినేని నాని పరామర్శ.. ఫైర్ అవుతున్న తెలుగు తమ్ముళ్లు.. ఎందుకంటే..
Satya Kumar, Kesineni Nani
Follow us

|

Updated on: Apr 02, 2023 | 11:40 AM

బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ యాదవ్ కారుపై రాళ్ల దాడి ఘటన ఏపీ రాజకీయాల్లో కలకలం రేపిన విషయం తెలిసిందే. మందడం సమీపంలో జరిగిన ఈ ఘటనపై బీజేపీ సహా.. విపక్ష పార్టీల నేతలు సైతం అధికార పార్టీ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ తరుణంలో టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని పరామర్శ.. బీజేపీ నేత సత్యకుమార్‌ను పరామర్శించడం.. తెలుగు తమ్ముళ్లలో ఆగ్రహానికి దారితీసింది. సొంత పార్టీ నేతలపై దాడి జరిగినప్పుడు.. ఇలా ఎందుకు పరామర్శించలేదు అంటూ ఎంపీపై ఫైర్ అవుతున్నారు.

గుంటూరు జిల్లా మందడంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ యాదవ్ కారుపై.. రాళ్ల దాడి అనంతరం ఎంపీ కేశినేని నాని పరామర్శించారు. విజయవాడలోని ఓ హోటల్ లో సత్యకుమార్ ను కలిసి.. పలు విషయాలపై మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫొటోలను కేశినేని భవన్ శనివారం ట్విట్టర్ హ్యాండిల్ లో షేర్ చేసింది.

ఇవి కూడా చదవండి

అమరావతిలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ యాదవ్ పై అధికార పార్టీ వైసీపీ అమానుష దాడిని ఖండిస్తూ ఒక ప్రైవేట్ హోటల్లో ఆయన్ను కలసి పరామర్శించి, ఎంపీ కేశినేని నాని, టీడీపీ నగర నాయకులు సంఘీభావం తెలిపినట్లు కేశినేని భవన్ ట్విట్ లో పేర్కొంది. ఈ సందర్భంగా ఫొటోలను షేర్ చేసింది.

అయితే, ఈ ట్విట్ టీడీపీ నాయకుల్లో ఆగ్రహానికి దారితీసింది. తెలుగు తమ్ముళ్లు కేశినేని నానిని వ్యతిరేకిస్తూ రీట్విట్లు చేస్తున్నారు. టీడీపీ నేతలపై దాడులు జరిగిన సమయంలో ఎక్కడ దాక్కున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతోపాటు ఈ సారి కేశినేనికి టికెట్ ఇవ్వొద్దంటూ తెలుగు తమ్ముళ్లు చంద్రబాబుకు సూచిస్తున్నారు.

‘‘దొంతు చిన్న, పట్టాభి మీద పోలీసులు దొంగ కేసులు పెట్టీ అరెస్ట్ చేసినప్పుడు మాత్రం ఇంట్లొ ఏసీలో పడుకుని ఉంటారు.. బీజేపీ మీద దాడి అనగానే సానుభూతి. కృష్ణ జిల్లాలో టిడిపినీ బ్రష్టు పట్టించినంతగా.. ఏ జిల్లాలోను జరగలేదు.’’ అంటూ ఓ నెటిజన్ ట్విట్ చేయగా.. ‘‘బీజేపీలో జాయిన్ అవ్వండి’’ అంటూ మరొకరు.. ‘‘స్వపక్షం విపక్షం అంటే ఈయనే.. టిడిపి వాళ్లపై దాడులు జరిగితే సైలెంట్’’.. అంటూ ఇంకొకరు రిట్వీట్లు చేస్తున్నారు.

ఇదిలాఉంటే.. విజయవాడ ఎంపీ కేశినేని నాని.. గత కొన్ని రోజుల నుంచి టీడీపీ కార్యక్రమాలల్లో  పాల్గొనడంలేదని.. అంటిముట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటున్నారు తెలుగు తమ్ముళ్లు.. అంతకుముందు సైతం కేశినేని నానా మాట్లాడుతూ.. చంద్రబాబు సీటు ఇవ్వకున్నా ఏమీ కాదని.. ప్రజలు పోటీ చేయమంటే ఇండిపెండెంట్‌గా బరిలో దిగుతానంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో కలకలం రేపాయి. తాజాగా.. తెలుగు తమ్ముళ్లు చేస్తున్న ట్విట్లపై కేశినేని నాని ఎలా స్పందిస్తారన్నది ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం..

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..