TTD: శ్రీవారి భక్తులకు గమనిక.. ధనుర్మాసంలో నెల రోజులు శ్రీవారికి తిరుప్పావై సేవ

తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో నెల రోజులపాటు సుప్రభాతం కాకుండా తిరుప్పావై జరగనుంది. డిసెంబరు 17 నుంచి జనవరి 14 వరకు ధనుర్మాసం కావడంతో సుప్రభాతం స్థానంలో తిరుప్పావై సేవ జరగనుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం డిసెంబ‌రు 17 తెల్లవారుజామున 12.34 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానుండగా టీటీడీ ఈ మేరకు..

TTD: శ్రీవారి భక్తులకు గమనిక.. ధనుర్మాసంలో నెల రోజులు శ్రీవారికి తిరుప్పావై సేవ
Tiruppavai For Tirumala Srivaru
Follow us

| Edited By: Srilakshmi C

Updated on: Dec 07, 2023 | 5:00 PM

తిరుపతి, డిసెంబర్ 7: తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో నెల రోజులపాటు సుప్రభాతం కాకుండా తిరుప్పావై జరగనుంది. డిసెంబరు 17 నుంచి జనవరి 14 వరకు ధనుర్మాసం కావడంతో సుప్రభాతం స్థానంలో తిరుప్పావై సేవ జరగనుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం డిసెంబ‌రు 17 తెల్లవారుజామున 12.34 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానుండగా టీటీడీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. డిసెంబరు 17 ఉదయం నుంచి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదించనున్నారు.

ధనుర్మాస ఘడియలు 2024 జనవరి 14న ముగియనున్నాయి. పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి గంటన్నర ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీమహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారట. కావున ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉండగా నెలరోజులు ఆండాళ్‌ తిరుప్పావై పారాయణం జరగనుంది. 12 మంది ఆళ్వార్లలో శ్రీ ఆండాళ్‌(గోదాదేవి) ఒకరుకాగా ఈమెను నాచియార్‌ అని కూడా పిలుస్తారు. శ్రీవేంకటేశ్వరస్వామివారిని స్తుతిస్తూ ఆండాళ్‌ రచించిన 30 పాశురాలను కలిపి తిరుప్పావై అంటారు.

ఆళ్వార్‌ దివ్యప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం కాగా తమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం ఉంది. శ్రీవారి ఆలయంలో నెల రోజులపాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకొకటి చొప్పున అర్చకులు నివేదిస్తారు. ఈ సమయంలో సాధారణంగా భోగశ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతసేవ నిర్వహిస్తారు. ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
TSRTC రికార్డు బ్రేక్‌.. 3 రోజుల్లోనే 1.42 కోట్ల మంది సొంతూళ్లకు
TSRTC రికార్డు బ్రేక్‌.. 3 రోజుల్లోనే 1.42 కోట్ల మంది సొంతూళ్లకు
ఏపీలో ప్రారంభమైన మాక్ పోలింగ్.. ఓటు వేసేందుకు సిద్దంగా ఓటర్లు..
ఏపీలో ప్రారంభమైన మాక్ పోలింగ్.. ఓటు వేసేందుకు సిద్దంగా ఓటర్లు..
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. సోమవారం గోల్డ్‌ రేట్స్‌ ఎలా ఉన్నాయి
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. సోమవారం గోల్డ్‌ రేట్స్‌ ఎలా ఉన్నాయి
ఏపీ, తెలంగాణలో మొదలైన ఓట్ల జాతర.. ఓటేసేందుకు క్యూలో జనం
ఏపీ, తెలంగాణలో మొదలైన ఓట్ల జాతర.. ఓటేసేందుకు క్యూలో జనం
తెలంగాణలో ప్రారంభమైన మాక్ పోలింగ్.. సాయంత్రం 6 వరకు పోలింగ్..
తెలంగాణలో ప్రారంభమైన మాక్ పోలింగ్.. సాయంత్రం 6 వరకు పోలింగ్..
మరికాసేపట్లో 4వ దశ: 10 రాష్ట్రాల్లో 96 లోక్‌సభ స్థానాలకు పోలింగ్
మరికాసేపట్లో 4వ దశ: 10 రాష్ట్రాల్లో 96 లోక్‌సభ స్థానాలకు పోలింగ్
ఈ రాశివారికి ఈరోజు పట్టిందల్లా బంగారమే..
ఈ రాశివారికి ఈరోజు పట్టిందల్లా బంగారమే..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఆర్సీబీకి వరుసగా ఐదో విజయం
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఆర్సీబీకి వరుసగా ఐదో విజయం
రోహిత్ లేదా కోహ్లీ? సోనాలి బింద్రేకు ఇష్టమైన క్రికెటర్ ఎవరంటే?
రోహిత్ లేదా కోహ్లీ? సోనాలి బింద్రేకు ఇష్టమైన క్రికెటర్ ఎవరంటే?
250 కొట్టేసిన కింగ్ కోహ్లీ.. ఐపీఎల్ చరిత్రలో ఏకైక ప్లేయర్‌గా..
250 కొట్టేసిన కింగ్ కోహ్లీ.. ఐపీఎల్ చరిత్రలో ఏకైక ప్లేయర్‌గా..