AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD: శ్రీవారి దర్శనంతో సంబంధం లేకుండా ఆన్‌లైన్‌లో లడ్డూలు బుకింగ్.. టీటీడీ కీలక ప్రకటన

తిరుమల శ్రీవారి దర్శనానికి ఎంత డిమాండ్‌ ఉంటుందో.. స్వామివారి లడ్డూలకు కూడా అంతే డిమాండ్‌ ఉంటుంది. ఏడు కొండల వాడి దర్శనానికి వెళ్లిన భక్తులందరూ వీలైనన్ని ఎక్కువగా లడ్డూలు తెచ్చుకోవాలనుకుంటారు. దీనిని అవకాశంగా తీసుకుని కొందరు శ్రీవారి భక్తులను బురిడీ కొట్టిస్తున్నారు.

TTD: శ్రీవారి దర్శనంతో సంబంధం లేకుండా ఆన్‌లైన్‌లో లడ్డూలు బుకింగ్.. టీటీడీ కీలక ప్రకటన
Tirumala Laddu
Basha Shek
|

Updated on: Dec 12, 2022 | 8:32 PM

Share

తిరుమల శ్రీవారి దర్శనానికి ఎంత డిమాండ్‌ ఉంటుందో.. స్వామివారి లడ్డూలకు కూడా అంతే డిమాండ్‌ ఉంటుంది. ఏడు కొండల వాడి దర్శనానికి వెళ్లిన భక్తులందరూ వీలైనన్ని ఎక్కువగా లడ్డూలు తెచ్చుకోవాలనుకుంటారు. దీనిని అవకాశంగా తీసుకుని కొందరు శ్రీవారి భక్తులను బురిడీ కొట్టిస్తున్నారు. అధిక లడ్డూలు విక్రయిస్తామంటూ, దర్శనంతో సంబంధం లేకుండానే లడ్డూలు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాలంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ అసత్య వార్తలపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్పందించింది. తమ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో లడ్డూలు బుక్‌ చేసుకోవచ్చన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తేల్చి చెప్పేసింది. శ్రీవారి భక్తులు వీటిని నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సోమవారం టీటీడీ ఓ ప్రకటనను విడుదల చేసింది. టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా భక్తులు దర్శన టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే అదనపు లడ్డూలు బుక్ చేసుకునే అవకాశం ఉంది. అయితే దర్శనంతో సంబంధం లేకుండా లడ్డూలు బుక్ చేసుకోవచ్చని జరుగుతున్న ప్రచారం మాత్రం అవాస్తవం. ఇలాంటి తప్పుడు ప్రచారాలు వ్యాప్తి చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది.

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల..

కాగా స్వామి వారి ఆర్జిత సేవా టికెట్లను ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేసింది టీటీడీ. జనవరి నెల కోటాకు సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది.అలాగే ఈ నెల 16, 31వ తేదీదీలకు సంబంధించి ప్రత్యేక రూ.300 దర్శనం టైం స్లాట్ టోకెన్లను రేపు (మంగళవారం) విడుదల చేయనుంది. ఉదయం 9 గంటలకు ఈ టికెట్లను అందుబాటులో ఉంటాయి. కాగా.. ఈ నెల 16 సాయంత్రం నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. దీంతో 17వ తేదీ నుంచి జనవరి 14 వరకు సుప్రభాత సేవలను టీటీడీ రద్దు చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం.. క్లిక్ చేయండి..

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం