Fake Certificates: లక్షన్నరకే పదో తరగతి సర్టిఫికేట్.. దందా వెనుక ఎవరున్నారో తెలిస్తే విస్తు పోవాల్సిందే..

ఈజీ మనీ మాత్రమే కాదు.. ఈజీ చదవులు కూడా మన జీవితాలకు ప్రమాదమే. అందులోనూ ఎలాంటి పరీక్షలు రాయకుండా వచ్చే సర్టిఫికేట్లు మరింత డేంజర్‌. ఈ విషయాన్ని అలస్యంగా అయినా.. అనుభవపూర్వకంగా..

Fake Certificates: లక్షన్నరకే పదో తరగతి సర్టిఫికేట్.. దందా వెనుక ఎవరున్నారో తెలిస్తే విస్తు పోవాల్సిందే..
Fake Certificates
Follow us

|

Updated on: Dec 12, 2022 | 7:39 AM

ఈజీ మనీ మాత్రమే కాదు.. ఈజీ చదవులు కూడా మన జీవితాలకు ప్రమాదమే. అందులోనూ ఎలాంటి పరీక్షలు రాయకుండా వచ్చే ఫేక్ సర్టిఫికేట్లు మరింత డేంజర్‌. ఈ విషయాన్ని అలస్యంగా అయినా అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు అనంతపురం జిల్లాకు చెందిన కొందరు యువకులు. ఫేక్ సర్టిఫికేట్ల మీద ఎన్ని కేసులు నమోదు అవుతున్నా.. ఎంత మంది పట్టుబడుతున్నా.. తగ్గేదే అన్నట్లుగా రెచ్చిపోతాం అంటున్నారు నకిలీగాళ్లు. మరోసారి టెన్త్‌ నకిలీ సర్టిఫికేట్ల బాగోతం బటయపడింది. విజయవాడ ఎస్సార్‌పేట పీఎస్‌ పరిధిలో నకిలీగాళ్లు గుట్టుచప్పుడు కాకుండా ఈ ఫేక్ దందాను నడిపిస్తున్నారు. బ్రోకర్స్ ద్వారా వేరు వేరు సెంటర్స్ నుంచి ఫేక్‌ సర్టిఫికేట్స్‌ బిజినెస్‌ ఇష్టానుసారంగా సాగిస్తున్నారు. అయితే విచారణలో అన్నామలై యూనివర్శిటి ప్రతినిధులే ఈ నకిలీ బిజినెస్‌కు పాల్పడుతున్నట్లు తేలింది. వారు లక్షన్నర రూపాయాలు ఇస్టే 10th సర్టిఫికెట్‌లను ఇస్తాం అని వ్యాపారం నడిపిస్తున్నారు.

అయితే ఇది ఫేక్‌ సర్టిఫికేట్‌ అని తీసుకుంటున్న యువకులకు తెలియదు. అన్నామలై వర్సిటీ నుంచి ఇచ్చే ఒరిజినలే అంటూ యువకులను మభ్యపెట్టి వారు అమ్మేస్తున్నారు. అనంతపురానికి చెందిన కొందరు యువకులు ఈ ట్రాప్‌లో చిక్కుకున్నారు. వారు పదో తరగతి ఎగ్జామ్ రాకుండానే పదిరోజుల్లో నేరుగా తమ ఇళ్లకే వచ్చాయి సర్టిఫికేట్స్. ఆ సర్టిఫికెట్స్‌తో పోస్టల్ డిపార్ట్మెంట్‌లో ఉద్యోగాలకు అప్లై చేశారు ఏడుగురు యువకులు. పోస్టల్ డిపార్ట్మెంట్ వెరిఫికేషన్‌లో అవి ఫేక్ సర్టిఫికేట్స్ అని తేలడంతో యువకులను వివరణ ఇవ్వాలని అడిగింది పోస్టల్ డిపార్ట్మెంట్. ఫేక్ సర్టిఫికేట్స్ అని తెలియడంతో ఆందోళనకు గురైన యువకులు బ్రోకర్ ఆనంద్‌ను నిలదీశారు.

విజయవాడ బందర్ రోడ్డులో ఉన్న అన్నామలై బ్రాంచ్‌కు యువకులు వచ్చి నిలదీయడంతో.. తామిచ్చింది ఒరిజినలే అని.. కావాలంటే ఆన్‌లైన్‌లో చూసుకోవాలని సంబంధిత బ్రోకర్ ఉచిత సలహా ఇచ్చాడు. పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ నోటీసులు చూపించి.. తమ డబ్బులు వెనక్కి ఇవ్వాలని యువకులు గొడవకు దిగారు. అయితే దాని వల్ల ఫలితం లేకపోయేసరికి నకిలీగాళ్ల ఫేక్‌ దందాపై యువకులు సూర్యారావుపేట పోలీసులకు కంప్లైంట్‌ చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సర్టిఫికేట్స్ అమ్మడమే కాదు కొనడం కూడా నేరమే అంటున్నారు. మరోవైపు ఫేక్ సర్టిఫికేట్ల గురించి యూనివర్శిటీ ప్రతినిధులను, బ్రోకర్‌ను, యువకులను పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..

Latest Articles
తెలుగు మీడియాలో మరో సంచలనం.. టీవీ9తో సీఎం జగన్‌ ఇంటర్వ్యూ..
తెలుగు మీడియాలో మరో సంచలనం.. టీవీ9తో సీఎం జగన్‌ ఇంటర్వ్యూ..
అఫీషియల్.. ఆహాలో గీతాంజలి మళ్లీ వచ్చింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అఫీషియల్.. ఆహాలో గీతాంజలి మళ్లీ వచ్చింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సులువుగా బరువు తగ్గాలంటే ఈ ఒక్క సూపర్ డ్రింక్‌ తాగితే సరి..
సులువుగా బరువు తగ్గాలంటే ఈ ఒక్క సూపర్ డ్రింక్‌ తాగితే సరి..
మీకు తెలుసా.. ఈ దేశాల్లోని ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తారట!
మీకు తెలుసా.. ఈ దేశాల్లోని ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తారట!
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
రేవణ్ణను రెండో రోజు విచారించిన సిట్‌
రేవణ్ణను రెండో రోజు విచారించిన సిట్‌
బాంబుల్లా పేలుతున్న ఉడకబెట్టిన గుడ్లు.. కారణం ఇదే!
బాంబుల్లా పేలుతున్న ఉడకబెట్టిన గుడ్లు.. కారణం ఇదే!
ఐఫోన్ డ్రీమ్‌ నిజం చేసుకునే ఛాన్స్‌.. ఐఫోన్‌ 13పై భారీ డిస్కౌంట్
ఐఫోన్ డ్రీమ్‌ నిజం చేసుకునే ఛాన్స్‌.. ఐఫోన్‌ 13పై భారీ డిస్కౌంట్
ముంబైతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. తుది జట్లలో కీలక మార్పులు
ముంబైతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. తుది జట్లలో కీలక మార్పులు
తెలుగు మీడియాలో మరో సంచలనం.. టీవీ9తో సీఎం జగన్‌ ఇంటర్వ్యూ..
తెలుగు మీడియాలో మరో సంచలనం.. టీవీ9తో సీఎం జగన్‌ ఇంటర్వ్యూ..
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..