AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stella ship: ఎట్టకేలకు పయనమైన స్టెల్లా షిప్.. కాకినాడ నుంచి వెళ్లేందుకు పచ్చజెండా

స్టైల్లా ఎల్ పనామా షిప్ ఎట్టకేలకు కాకినాడ నుంచి బయలుదేరింది.. దాదాపు 55 రోజుల తర్వాత షిప్ లోడ్ తో కీటోనౌ పోర్ట్ కి స్టార్ట్ అయింది.. షిప్ నిలిపినందుకు చెల్లించాల్సిన యాంకరేజ్ చార్జీ, ఎక్స్పోర్ట్ చార్జి పోర్ట్ అధారిటీ కి స్టీమర్ ఏజెంట్ చెల్లించింది.. దాంతో కస్టమ్స్ క్లియరెన్స్ వచ్చింది. అన్ని క్లారిటీగా ఉండడంతో కస్టమ్స్ క్లియరెన్స్ ఇచ్చింది టెక్నికల్ గా ఇబ్బందులు రావడంతో షిప్ లో ఉన్న రేషన్ బియ్యం మాత్రమే సీజ్ చేశారు.. దానికి అనుగుణంగా మిగతా లోడ్ కూడా చేసి షిప్ ను పంపించేశారు.

Stella ship: ఎట్టకేలకు పయనమైన స్టెల్లా షిప్.. కాకినాడ నుంచి వెళ్లేందుకు పచ్చజెండా
Stella Ship
Pvv Satyanarayana
| Edited By: |

Updated on: Jan 07, 2025 | 12:48 PM

Share

నవంబర్ 11న కాకినాడ పోర్టుకు స్టెల్లా షిప్ వచ్చింది.. దాదాపు 25 మంది ఎగుమతి దారులు రైస్ సప్లై చేయడానికి స్టీమర్ ఏజెంట్ తో అగ్రిమెంట్ చేసుకున్నారు.. నవంబర్ 27న తనిఖీలలో షిప్ లో రేషన్ బియ్యం ఉన్నట్లు కలెక్టర్ గుర్తించారు స్వయంగా ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి విచారణ చేయాలని ఆదేశించారు.. అయితే షిప్ ను సీజ్ చేయాలని చెప్పినప్పటికీ అంతర్జాతీయంగా దేశాల మధ్య ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లారు… దాంతో షిప్ లో ఉన్న రేషన్ రైస్ సీజ్ చేయాలని ఆదేశించారు.. షిఫ్ట్ కెపాసిటీ 52,000 మెట్రిక్ టన్నులు కాగా 32415 మెట్రిక్ టన్నుల లోడ్ కంప్లీట్ అయింది..

అయితే మొత్తం షిప్ తనిఖీ చేయాలని మల్టీ డిస్ప్లేనరీ కమిటీ ఏర్పాటు చేశారు కలెక్టర్.. ఐదు శాఖల అధికారులు పూర్తిగా సమన్వయం చేసుకొని నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.. అందులో మొత్తం 1320 టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లు కమిటీ నివేదిక ఇచ్చింది.. దాంతో వాటిని అన్లోడ్ చేశారు అధికారులు.. షిప్ లో బ్యాలెన్స్ ఉన్న రైస్ కి రా రైస్ లోడ్ చేశారు.. దాంతో లోడింగ్ కంప్లీట్ అయింది.. షిప్ వెళ్లడానికి దానికి తగ్గట్లు ఏర్పాటు చేశారు.. ఉన్న లోడ్ల 36% పోర్టిఫైడ్ కర్నల్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు.. దాంతోపాటు షిప్ లో లోడ్ వేయడానికి సిద్ధంగా ఉన్న మరో వెయ్యి టన్నులకు పైగానే రేషన్ రైస్ సీజ్ చేశారు.

షిప్,బార్జి లో కలిపి దాదాపు 2380 టన్నుల రేషన్ రైస్ గోడౌన్లకు తీసుకుని వెళ్లి సీజ్ చేశారు.. గతంలో రేషన్ రైస్ అక్రమ రవాణాకు సంబంధించి 8 కేసులు నమోదయ్యాయి.. ఈ షిప్ లో ఉన్న రేషన్ రైస్ కు సంబంధించి సత్యం బాలాజీ ఇండస్ట్రీస్ ఓనర్ ప్రదీప్ అగర్వాల్, మేనేజర్ కళ్యాణ్ అశోక్ ల పై 6 ఏ కింద కేసులు నమోదు చేశారు… షిప్ నిలిపినందుకు యాంకరేజీ చార్జి కార్గో షిప్ లోకి ఎక్కించినందుకు కట్టాల్సిన ఎక్స్పోర్ట్ చార్జీ పోర్టు అథారిటీకి స్టెల్లా షిప్ స్టీమర్ ఏజెంట్ చెల్లించారు .. దాంతో నో డ్యూ సర్టిఫికెట్ ఇచ్చారు.. దానికి అనుగుణంగా కస్టమ్స్ అధికారులు షిప్ మూవ్ అవడానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని క్లారిటీ ఇచ్చారు.. ఈ రైస్ లోడు బెనిన్ దేశంలోని కిటోనౌ పోర్టుకి చేరుకోవాల్సి ఉంది.. దాదాపు 26 రోజులు సముద్రంలో ప్రయాణిస్తారు.

ఇవి కూడా చదవండి

మొత్తానికి 55 రోజుల బ్రేక్ తర్వాత స్టెల్లా షిప్ కాకినాడ పోర్ట్ నుంచి బయలుదేరింది.. అన్ని క్లారిటీగా ఉండడంతో కస్టమ్స్ క్లియరెన్స్ ఇచ్చింది టెక్నికల్ గా ఇబ్బందులు రావడంతో షిప్ లో ఉన్న రేషన్ బియ్యం మాత్రమే సీజ్ చేశారు.. దానికి అనుగుణంగా మిగతా లోడ్ కూడా చేసి షిప్ ను పంపించేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us