AP News: దాడి చేసి ప్రాణాలు తీస్తోన్నా ఈ దున్నపోతును ఏం అనరు.. ఎందుకంటే..?
రోళ్ళ మండలంలో ఈ దున్నపోతు దాడిలో ఓ వృద్ధురాలు ప్రాణం కోల్పోయింది. ఎం.రాయాపురం పంచాయతీ ఎంఆర్ గొల్లహట్టికి చెందిన ఈరమ్మ (72) అనే వృద్ధురాలు పశువుల మేత కోసం పొలానికి వెళ్లింది. అక్కడ మేత కోసుకుని చీకటి పడ్డాక ఇంటికి బయల్దేరింది. అక్కడే పొలాల్లో మేత మేస్తున్న దేవుని పేరు మీద వదిలిన దున్నపోతు...
సత్యసాయి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. రోళ్ల మండలంలో దున్నపోతు దాడి చేయడంతో ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ దుర్ఘటనతో గ్రామస్థులను భయబ్రాంతులకు గురవుతున్నారు. ఎందుకంటే అది మామూలు దున్నపోతు కాదు. దాని దాడితో గాయపడ్డా, ప్రాణాలు పోతున్నా దాన్ని ఎవ్వరూ ఏమీ అనరు. ఎందుకంటే అది గ్రామ దేవతకు ఇచ్చిన దున్నపోతు కాబట్టి.
రోళ్ళ మండలంలో ఈ దున్నపోతు దాడిలో ఓ వృద్ధురాలు ప్రాణం కోల్పోయింది. ఎం.రాయాపురం పంచాయతీ ఎంఆర్ గొల్లహట్టికి చెందిన ఈరమ్మ (72) అనే వృద్ధురాలు పశువుల మేత కోసం పొలానికి వెళ్లింది. అక్కడ మేత కోసుకుని చీకటి పడ్డాక ఇంటికి బయల్దేరింది. అక్కడే పొలాల్లో మేత మేస్తున్న దేవుని పేరు మీద వదిలిన దున్నపోతు వెనుక నుంచి ఈరమ్మపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడి… సొమ్మసిల్లి పడిపోయిన వృద్ధురాలిని గ్రామస్తులు గమనించి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వృద్ధురాలు చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
రోళ్ళ మండలంలోని ఎం.ఆర్ గొల్లహట్టి చుట్టుపక్కల గ్రామాల్లో కొల్హాపురమ్మ, మారెమ్మ అమ్మవార్ల పేరు మీద గ్రామస్థులు నాలుగైదు దున్నపోతులు వదిలారు. ఇవి రాత్రనక, పగలనక పొలాల్లో తిరుగుతూ పంట ధ్వంసం చేస్తున్నా.. గ్రామ దేవత కోసం వదిన దున్నపోతులు కాబట్టి ఎవరు ఏమీ అనడం లేదు. తాజాగా దున్నపోతు దాడి చేసిన ఘటనలో ఈశ్వరమ్మ మృతి చెందడంతో చుట్టుపక్కల గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామ దేవత కోసం వదిలిన దున్నపోతులు కాబట్టి ఎవరూ ఏమి చేయలేరు…. అలా అని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని తిరుగుతున్న పరిస్థితి ఏర్పడింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…