AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Polavaram: పోలవరం ప్రాజెక్టు నిధులపై కేంద్రం అనూహ్య నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతోన్న పోలవరం ప్రాజెక్టు నిధులపై మోదీ సర్కారు తేల్చేసింది. దేశంలోని మిగతా ప్రాజెక్టులకు మాదిరిగా

Polavaram: పోలవరం ప్రాజెక్టు నిధులపై కేంద్రం అనూహ్య నిర్ణయం
Polavaram
Venkata Narayana
|

Updated on: Oct 07, 2021 | 2:47 PM

Share

Polavaram Project: ఆంధ్రప్రదేశ్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతోన్న పోలవరం ప్రాజెక్టు నిధులపై మోదీ సర్కారు తేల్చేసింది. దేశంలోని మిగతా ప్రాజెక్టులకు మాదిరిగా పోలవరం ప్రాజెక్టుకు కూడా అదనంగా నిధులు మంజూరు చేయాలని కేంద్ర జల శక్తి శాఖ కోరిన నేపథ్యంలో కొత్త నిర్ణయాన్ని తీసుకుంది. మరో రూ. 4వేల కోట్లను అదనంగా మంజూరు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు, కేంద్ర జలశక్తి శాఖ లేఖ ఇప్పటికే రాసిన సంగతి తెలిసిందే.

అయితే, ఆ లేఖను పరిశీలించిన మీదట నిధులు ఇచ్చేది లేదని ఆర్థిక శాఖ తేల్చిచెప్పేసింది. ఆ లేక సమాచారాన్ని కేంద్ర జల శక్తి శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి వివరించింది.

కాగా, నిన్న ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కలిసి దీనిపై చర్చించారు. పోలవరం నిధులకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ లేఖపై మంతనాలు జరిపారు. క్యాబినెట్ తీర్మానానికి కట్టుబడి ఉంటామని కేంద్ర ఆర్థిక మంత్రి తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది.

కాగా, 2017లో కేంద్ర క్యాబినెట్ తీర్మానం మేరకు రూ. 20 వేల కోట్లకు మించి ఇచ్చేది లేదని ఆర్థిక శాఖ స్పష్టం చేస్తూ.. ఈ మేరకు జలశక్తి శాఖకు లేక రాసింది.

Read also: Snake Bite Murders: రాజస్థాన్‌లో సర్వసాధారణంగా మారిపోయిన పాము కాటుతో హత్యలు.!