Andhra Pradesh: టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి.. లోకేష్ ముందే అఖిలప్రియ వర్గం అటాక్..
నంద్యాల టీడీపీలో వర్గపోరు.. బాహాబాహీ వరకు వెళ్లింది. టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై అదే పార్టీకి చెందిన అఖిలప్రియ వర్గం దాడి చేసింది. పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం సంచలనం రేకెత్తిస్తోంది. ఏబీ సుబ్బారెడ్డిపై దాడితో యువగళం పాదయాత్రలో
నంద్యాల టీడీపీలో వర్గపోరు.. బాహాబాహీ వరకు వెళ్లింది. టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై అదే పార్టీకి చెందిన అఖిలప్రియ వర్గం దాడి చేసింది. పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం సంచలనం రేకెత్తిస్తోంది. ఏబీ సుబ్బారెడ్డిపై దాడితో యువగళం పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ దాడిలో ఏబీ సుబ్బారెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి.
నారాలో లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నంద్యాలలో కొనసాగుతోంది. ఈ యాత్రలో వైవీ సుబ్బారెడ్డి సహా ఇతర నేతలు పాల్గొన్నారు. అయితే, అఖిలప్రియ వర్గానికి చెందిన కొందరు.. ఏవీ సుబ్బారెడ్డిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. లోకేష్ ముందే ఈ దాడి జరుగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తనపై దాడి చేయడంపై ఏబీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే డైరెక్ట్గా కక్ష తీర్చుకోవాలంటూ సవాల్ విసిరారు ఏవీ. మరోవైపు, ఈ ఘటనతో పరిస్థితి అదుపు తప్పడంతో.. పాదయాత్ర నుంచి సుబ్బారెడ్డిని పంపించారు పోలీసులు.
మరి నంద్యాలలో ఈ ఘటన ఏ పరిస్థితులకు దారితీస్తుందోనని పొలిటికల్ వర్గాల్లో తీవ్ర చర్చగా మారింది. మరోవైపు.. దాడి ఘటనతో అలర్ట్ అయిన పోలీసులు.. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా జాగ్రత్తపడుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..