AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జస్ట్ 90 నిమిషాల్లో.. అమరావతి టు హైదరాబాద్.. హైస్పీడ్ ట్రైన్ కారిడార్ డ్రాఫ్ట్ ప్లాన్ రెడీ..

అమరావతి ఇకపై దేశంలోని మెట్రో నగరాలతో పోటీ పడబోతోంది. కేవలం రోడ్లే కాదు.. ఇప్పుడు అద్భుతమైన రైల్వే నెట్‌వర్క్ కూడా అమరావతి చెంతకు రాబోతోంది. హైదరాబాద్ - చెన్నై మధ్య ప్రయాణాన్ని గంటల్లోకి మార్చే హైస్పీడ్ కారిడార్ డ్రాఫ్ట్ ప్లాన్ సిద్ధమైంది. అటు ఎర్రుపాలెం నుంచి ఇటు నంబూరు వరకు కొత్త పట్టాలు వేయనున్నారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

జస్ట్ 90 నిమిషాల్లో.. అమరావతి టు హైదరాబాద్.. హైస్పీడ్ ట్రైన్ కారిడార్ డ్రాఫ్ట్ ప్లాన్ రెడీ..
Hyderabad Chennai High Speed Rail Via Amaravati
Krishna S
|

Updated on: Apr 05, 2026 | 12:34 PM

Share

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దే క్రమంలో మరో కీలక అడుగు పడింది. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రైల్వే శాఖ సంయుక్తంగా అమరావతిని దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానించేలా భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేశాయి. ముఖ్యంగా హైదరాబాద్ – అమరావతి – చెన్నై నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించేలా హైస్పీడ్ రైల్ కారిడార్ డ్రాఫ్ట్ ప్లాన్ సిద్ధమైంది. హైదరాబాద్ నుండి చెన్నై వెళ్లే హైస్పీడ్ రైలు మార్గాన్ని అమరావతి మీదుగా మళ్లించేలా అధికారులు వ్యూహరచన చేశారు. ఈ రైలు కారిడార్ రాజధాని ప్రాంతంలోని పశ్చిమ బైపాస్, ఎన్-6 రోడ్డు గుండా సాగనుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ నుంచి అమరావతికి కేవలం 90 నిమిషాల్లో, అమరావతి నుంచి చెన్నైకి అతి తక్కువ సమయంలో చేరుకోవచ్చు. ఇది కేవలం ప్రయాణ సౌకర్యమే కాకుండా దక్షిణ భారతదేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేయనుంది.

57 కిలోమీటర్ల కొత్త లైన్

కేంద్ర ప్రభుత్వం రూ. 2,245 కోట్లతో అమరావతికి రైల్వే లైన్‌ను మంజూరు చేసింది. తెలంగాణలోని ఎర్రుపాలెం నుండి గుంటూరు జిల్లాలోని నంబూరు వరకు సుమారు 57 కిలోమీటర్ల మేర కొత్త లైన్ నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కృష్ణా నదిపై సుమారు 3 కిలోమీటర్ల పొడవైన ఐకానిక్ రైల్వే వంతెన నిర్మించనున్నారు. ఇది అమరావతి ప్రాంతంలోనే అతిపెద్ద రైల్వే వంతెనగా, పర్యాటక ఆకర్షణగా నిలవనుంది.

వాణిజ్య కేంద్రంగా పరిటాల.. కార్గో స్టేషన్లు

ఈ రైల్వే లైన్ కేవలం ప్రయాణికుల కోసమే కాదు సరుకు రవాణాలోనూ కీలకం కానుంది. పరిటాల వద్ద అత్యాధునిక కార్గో స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల అమరావతి ప్రాంతంలో పారిశ్రామిక ఉత్పత్తుల రవాణా సులభతరం అవుతుంది. ఉత్తర భారతం నుండి వచ్చే రైళ్లు ఎర్రుపాలెం మీదుగా నేరుగా అమరావతికి చేరుకునే వీలు కలుగుతుంది. దీనివల్ల విజయవాడ స్టేషన్‌పై రద్దీ కూడా తగ్గుతుంది. అత్యాధునిక సిగ్నలింగ్ వ్యవస్థ, హైస్పీడ్ ట్రాక్‌లతో నిర్మించనున్న ఈ కారిడార్లు అమరావతిని ఒక లాజిస్టిక్ హబ్‌గా మార్చబోతున్నాయి. విద్యా, వైద్య, పారిశ్రామిక రంగాలలో పెట్టుబడులు రావడానికి ఈ రైల్వే కనెక్టివిటీ వెన్నెముకగా నిలవనుంది.

Follow Us