AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: టెన్షన్ టెన్షన్.. సుప్రీంకోర్టుకు మూడు రాజధానుల రగడ.. ఆ రోజే కీలక విచారణ

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ఇష్యూ.. ఇప్పుడు పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది. మూడు రాజధానులు చేసి తీరుతామని పాలకులు చెబుతుంటే.. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు....

Andhra Pradesh: టెన్షన్ టెన్షన్.. సుప్రీంకోర్టుకు మూడు రాజధానుల రగడ.. ఆ రోజే కీలక విచారణ
Supreme Court
Ganesh Mudavath
| Edited By: Ravi Kiran|

Updated on: Feb 27, 2023 | 12:15 PM

Share

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ఇష్యూ.. ఇప్పుడు పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది. మూడు రాజధానులు చేసి తీరుతామని పాలకులు చెబుతుంటే.. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశం హైకోర్టును దాటి సుప్రీంకోర్టుకు చేరింది. ఈ క్రమంలో మూడు రాజధానుల వ్యవహారంపై మార్చి 28న విచారణ జరిగనుంది.  ఈ మేరకు దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ తేదీని ఖరారు చేసింది. కేసును త్వరగా విచారణ చేపట్టాలని కోరుతూ కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు సుప్రీం ధర్మాసనాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేసు విచారణ తేదీని జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం నిర్ణయించింది.

కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అంశంపై రచ్చ కొనసాగుతూనే ఉంది. ప్రతిపక్షాలు ఏం మాట్లాడినా.. తాము మాత్రం మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామంటున్నారు. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ.. ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ అంశం సుప్రీం కోర్టు పరిధిలో ఉంది. ఈ సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. కీలక ప్రకటన చేశారు. ఢిల్లీలో జరిగిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు సన్నాహక సమావేశంలో ఏపీకి విశాఖపట్నం రాజధాని కాబోతోందని స్పష్టం చేశారు. తాను కూడా త్వరలోనే విశాఖకు షిఫ్ట్ అవుతానని వెల్లడించారు.

మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అంశంపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి.. అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌.. లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. 2015లోనే దీన్నీ నోటిఫై చేశారని వివరించారు. 2020లో ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు తెచ్చిందని చెప్పారు. రాజధాని అంశంపై హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందని కేంద్రం హోంశాఖ సహాయమంత్రి తెలిపారు. ప్రస్తుతం రాజధాని అమరావతి అంశం కోర్టు పరిధిలో ఉందని లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..