AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని కుటుంబాలకు తాగునీటి కుళాయి కనెక్షన్లు: మంత్రి

రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోని కుటుంబాలకు ఇంటింటికి పైపులైను ద్వారా తాగునీటి కుళాయి కనెక్షన్‌ ఇచ్చినట్లు పంజాబ్ నీటి సరఫరా, పారిశుద్ధ్య శాఖ మంత్రి..

గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని కుటుంబాలకు తాగునీటి కుళాయి కనెక్షన్లు: మంత్రి
Drinking Water Supply Connection
Srilakshmi C
|

Updated on: Feb 27, 2023 | 9:29 AM

Share

రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోని కుటుంబాలకు ఇంటింటికి పైపులైను ద్వారా తాగునీటి కుళాయి కనెక్షన్‌ ఇచ్చినట్లు పంజాబ్ నీటి సరఫరా, పారిశుద్ధ్య శాఖ మంత్రి బ్రమ్ శంకర్ జింపా తెలిపారు. దాదాపు34.26 లక్షల గ్రామీణ కుటుంబాలకు పైపుల ద్వారా తాగునీటిని అందించాలనే లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సాధించిందని ఆయన అన్నారు. దేశంలో ఈ ఘనత సాధించిన ఐదో రాష్ట్రంగా పంజాబ్‌ నిలిచిందని జింపా తెలిపారు. 2024 నాటికి జాతీయ లక్ష్యాన్ని పూర్తి చేయాల్సి ఉండగా తమ ప్రభుత్వం ఇప్పటికే లక్ష్యాన్ని సాధించినట్లు మంత్రి జింపా తెలిపారు. అందుకు సహకరించిన అధికారులందరికీ అభినందనలు తెలిపారు.

స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2022లో ఈ విభాగం రెండో స్థానంలో నిలిచింది. ఈ అవార్డు కింద కేంద్రం పంజాబ్‌ రాష్ట్రానికి 1 కోటి రూపాయల నగదు బహుమతి అందించింది. ఇదేకాకుండా పంజాబ్ మరో మూడు అవార్డులను గెలుచుకుంది. బయోడిగ్రేడబుల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కింద చేసిన వాల్ పెయింటింగ్‌కు మొదటి బహుమతి, ప్లాస్టిక్ వ్యర్థాలు- మురికి నీటి నిర్వహణకు మూడో బహుమతి అందుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.