AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: తేనె కోసం వెళితే బంగారు నాణేల బిందె దొరికింది.. కట్ చేస్తే పంపకాల్లో కథ అడ్డం తిరిగింది..?

Nellore : అయితే దొరికిన బంగారు నాణేలు ఏ శతాబ్ధానికి చెందినవో తెలియదు. కానీ, వాటిపై తాజ్ మహల్ పదాలు వచ్చేలా ఉర్దూ లో ఉన్నాయని చెప్పారు. యువకులకు బంగారు నాణేలు దొరికాయి. కానీ, వాటాల్లో తేడాతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో నెల్లూరు జిల్లా లో ఎక్కడ ఏ ఇద్దరు చేరినా ఈ బంగారు నాణేల చెంబు గురించే మాట్లాడుకుంటున్నారు.

Andhra Pradesh: తేనె కోసం వెళితే బంగారు నాణేల బిందె దొరికింది.. కట్ చేస్తే పంపకాల్లో కథ అడ్డం తిరిగింది..?
Gold Treasure Found
Ch Murali
| Edited By: |

Updated on: Aug 21, 2023 | 8:58 PM

Share

నెల్లూరు జిల్లా,ఆగస్టు21; నెల్లూరు జిల్లా పొదలకురు మండలం చారిత్రక ఆలయాలకు పెట్టింది పేరు…ఇక్కడి ప్రభగిరి పట్నంలో వంద ఆలయాలు ఉన్నట్లు ఇప్పటికే గుర్తించారు…అయితే కాల క్రమంలో కొన్ని ఆలయాలు తెర మరుగుకాగా కొన్ని ఆలయాలు రూపు కోల్పోయి కాల గర్భంలో కలిసిపోయాయి…అయితే ఇక్కడ గుప్త నిధుల ఉన్నాయని ఏళ్ల తరబడి ప్రచారం జరిగింది.. గుప్త నిధుల కోసం కొండలు ఆలయాలను తవ్వేసిన సందర్భాలు కోకొల్లలు….అయితే ఇక్కడ తవ్వకాలు జరిపిన వారికి గుప్త నిధులు దొరికాయా లేదా అనేది పెద్ద ప్రశ్న…ఇదంతా ఇప్పుడు చెప్పడానికి ప్రత్యేకమైన కారణం లేకపోలేదు. నెల్లూరు జిల్లా పొదలకురు మండలం చిట్టెపల్లి లో నలుగురు యువకులు తేనె కోసం గ్రామ సమీపంలోని కొండ పై ఉన్న పురాతన అంకమ్మ ఆలయం వద్దకు వెళ్లగా అక్కడ వారికి ఎంతో విలువైన బంగారు నాణేలుతో కూడిన చెంబు దొరికింది.

చిట్టెపల్లి కి చెందిన వరుణ్, అజిత్, వెంకటేశ్వర్లు కలిసి తేనె కోసం కొండ మీద వున్న అంకమ్మ ఆలయం వద్దకు వెళ్లారు. అక్కడ రాళ్ల కింద వారికి ఇత్తడి చెంబు కనిపించింది. అయితే రాళ్లను తొలగించి చెంబు ను బయటకు తీసిన యువకులు దాన్ని పగులకొట్టి చూడగా అందులో బంగారు నాణేలు కనిపించాయి. అయితే నాణేలు చూసి భయపడిన యువకులు గ్రామంలో ఒకరి వద్దకు వెళ్లి చెంబును పూర్తిగా పగులకొట్టి చూడాలని ఇచ్చారు. దాంతో చెంబు ను లోపలికి తీసుకువెళ్లిన వ్యక్తి కాసేపు ఆగి బైటికి వచ్చి చెంబులో ఏమి లేవని చెంబు బయట పడేయాలని చెప్పాడు.అయితే అప్పటికే చెంబులో దొరికిన నాణేలను ఫోటో తీసిన యువకుడు కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా ఎస్పీ ని కలిశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారించగా వంద గ్రాముల నాణేలను రికవరీ చేసినట్లు తెలిసింది.

అయితే చెంబులో దొరికిన నాణేలు మూడు కేజీలకు పైగా వుంటాయని కోట్ల రూపాయలు విలువ చేస్తాయని స్థానికులు అంటున్నారు. జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి స్పందించి పూర్తి స్థాయిలో విచారణ జరిపితే కోట్ల రూపాయల విలువైన నాణేలు బయటకు వస్తాయని అంటున్నారు స్థానికులు. అయితే దొరికిన బంగారు నాణేలు ఏ శతాబ్ధానికి చెందినవో తెలియదు. కానీ, వాటిపై తాజ్ మహల్ పదాలు వచ్చేలా ఉర్దూ లో ఉన్నాయని చెప్పారు. యువకులకు బంగారు నాణేలు దొరికాయి. కానీ, వాటాల్లో తేడాతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో నెల్లూరు జిల్లా లో ఎక్కడ ఏ ఇద్దరు చేరినా ఈ బంగారు నాణేల చెంబు గురించే మాట్లాడుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
రూపాయి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా ఫిఫా వరల్డ్ కప్ చూసే ట్రిక్
రూపాయి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా ఫిఫా వరల్డ్ కప్ చూసే ట్రిక్
మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పనే లేదు..ఏది కావాలన్నా మీ ఊర్లోనే
మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పనే లేదు..ఏది కావాలన్నా మీ ఊర్లోనే
8 + 8 = 4 ఎలా సాధ్యం? గణితం కాదు, లాజిక్ కావాలి..
8 + 8 = 4 ఎలా సాధ్యం? గణితం కాదు, లాజిక్ కావాలి..
గౌతమ్ గంభీర్‌ను కాదని డైరెక్ట్‌గా బీసీసీఐతో సీనియర్ల చర్చలు
గౌతమ్ గంభీర్‌ను కాదని డైరెక్ట్‌గా బీసీసీఐతో సీనియర్ల చర్చలు
1999లో రిలీజ్.. థియేటర్లు దద్దరిల్లిపోయాయి..
1999లో రిలీజ్.. థియేటర్లు దద్దరిల్లిపోయాయి..
గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు.. నావికుల రక్షణ కోసం కేంద్రం చర్యలు
గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు.. నావికుల రక్షణ కోసం కేంద్రం చర్యలు
హైదరాబాద్ ప్రజలకు శుభవార్త.. నగరంలో మరో భారీ ఫ్లైఓవర్..
హైదరాబాద్ ప్రజలకు శుభవార్త.. నగరంలో మరో భారీ ఫ్లైఓవర్..
విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఈ విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు
విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఈ విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు
విద్యార్థుల టెన్షన్‌కు బ్రేక్.. జూన్ మూడో వారంలో ఆ 2 కీలక ఫలితాలు
విద్యార్థుల టెన్షన్‌కు బ్రేక్.. జూన్ మూడో వారంలో ఆ 2 కీలక ఫలితాలు
జాబ్ కాకపోయినా జాక్‌పాట్ లాంటి అవకాశం.. DRDOలో ఇంటర్న్‌షిప్‌లు!
జాబ్ కాకపోయినా జాక్‌పాట్ లాంటి అవకాశం.. DRDOలో ఇంటర్న్‌షిప్‌లు!