Andhra Pradesh: బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. నలుగురు దుర్మరణం..
పశ్చిమగోదావరి జిల్లాలో పెను ప్రమాదం జరిగింది. ఓ బాణాసంచా కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో అక్కడ పని చేస్తున్న నలుగురు కార్మికులు మృతి చెందారు. తాడేపల్లిగూడెం మండలం కడియద్దలో..
పశ్చిమగోదావరి జిల్లాలో పెను ప్రమాదం జరిగింది. ఓ బాణాసంచా కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో అక్కడ పని చేస్తున్న నలుగురు కార్మికులు మృతి చెందారు. తాడేపల్లిగూడెం మండలం కడియద్దలో ఈ ఘటన చోటు చేసుకుంది. మరికొంత మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీ పేలుడుతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఒక్కసారిగా భారీ శబ్ధం రావడంతో ఉలిక్కి పడ్డారు. పేలుడు కారణంగా భవనం ధ్వంసమైంది. మృతదేహాలు, హాహాకారాలతో ఘటనాస్థలం భీతావహంగా మారింది. చనిపోయిన వారి కుటుంబీకుల రోదనలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.
మరో ఘటనలో.. తమిళనాడులోని మదురై క్రాకర్స్ తయారీ కేంద్రంలో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలు ఆర్పుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో 15 మందికి పైగా కార్మికులు ఉన్నారు. కొన్ని మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..