AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: వెళ్లిపొతున్నాం.. పిల్లల్ని బాగా చూసుకోండి.. సెల్ఫీ వీడియో పంపి అదృశ్యమైన దంపతులు..

మేమిద్దరం వెళ్లిపొతున్నాం.. పిల్లలు జాగ్రత్త.. వారిని మంచిగా చూసుకోండి.. అంటూ దంపతులు రోదిస్తున్న వీడియో విశాఖపట్నంలో కలకలం రేపింది. ఆర్ధిక ఇబ్బందులతో చనిపోతున్నట్లు ఓ కుటుంబం సెల్ఫీ వీడియో తీసుకుని.. అదృశ్యమయ్యారు.

Andhra Pradesh: వెళ్లిపొతున్నాం.. పిల్లల్ని బాగా చూసుకోండి.. సెల్ఫీ వీడియో పంపి అదృశ్యమైన దంపతులు..
Vizag News
Shaik Madar Saheb
|

Updated on: Mar 28, 2023 | 9:54 AM

Share

మేమిద్దరం వెళ్లిపొతున్నాం.. పిల్లలు జాగ్రత్త.. వారిని మంచిగా చూసుకోండి.. అంటూ దంపతులు రోదిస్తున్న వీడియో విశాఖపట్నంలో కలకలం రేపింది. ఆర్ధిక ఇబ్బందులతో చనిపోతున్నట్లు ఓ కుటుంబం సెల్ఫీ వీడియో తీసుకుని.. అదృశ్యమయ్యారు. ఈ ఘటన విశాఖలోని వడ్లపూడి తిరుమల నగర్‌లో చోటుచేసుకుంది. ఇంట్లో నుంచి వెళ్లిపోయే ముందు ఏడుస్తూ బై చెబుతూ వరప్రసాద్ దంపతులు వెళ్లిపోయారు. వర ప్రసాద్‌ దంపతులు విడుదల చేసిన వీడియో పలువురిని కంటతడిపెట్టిస్తున్నది.. ఈ వీడియో తర్వాత దంపతులిద్దరూ ఏమైపోయారన్నది మిస్టరీగా మారింది.

అయితే, వాళ్ల చెప్పులు, బ్యాగ్ మాత్రం ఏలూరు కొప్పాక కాలువ దగ్గర కనిపించడం కటుుంబసభ్యుల్లో ఆందోళనకు దారితీసింది. వరప్రసాద్ స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగి. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో పరిస్థితి చేజారి తన భార్య కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నాం అంటూ పేర్కొన్నారు. పిల్లల్ని బాగా చూసుకోండి ఇక వెళ్ళిపోతున్నాం అంటూ ఏడుస్తూ చెబుతున్న మాటలు గుండెలను పిండేస్తున్నాయి.

చనిపోవాలని లేకున్నా.. చుట్టుముట్టిన ఆర్ధిక ఇబ్బందులతో దిక్కుతోచని స్థితిలో వాళ్లు ఆత్మహత్య వైపు మళ్లినట్లు తెలుస్తోంది. వీడియో తీసుకున్న అనంతరం దానిని బంధువులకు పంపి వారిద్దరు అదృశ్యమవ్వడం స్థానికంగా కలకలం రేపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..